ఏమిటీ దౌర్భాగ్యం! నాలుగు పదాలతో పేనితే అది నానో కవిత్వమా? ఈ ఛండాలాన్ని నానోలనుకోండి, ఇంకేవైనా అనుకోండి కానీ కవిత్వం అనటం ఏమిటి? ఒక మహానుభావుడు వేమన మీద పరిశోధన చేసి ఆ ప్రేరణతో నానీలని మొదలేసారు. ఇప్పుడు ఆయన ప్రేరణతో మరో మహానుభావుడు కనీసం పేరులోనైనా ప్రత్యేకత చూపించలేక 'నానీ'లనే కొంత మార్చి 'నానో'లనేస్తున్నాడు.
ఇంకపైగా ఆయనకు నచ్చే నానోలు వ్రాయగలిగితే మూడొందల రూపాయల బహుమతి కూడానట! కవిత్వాన్ని చిల్లరకొట్ల స్థాయికి దిగజారుస్తున్న ఇటువంటి పనికిమాలిన విషయాలని ప్రయోగాలుగా ఎలా చెప్పుకుంటున్నారో అర్ధం కాదు. విమర్శకులు కూడా వీరికి వత్తాసు పలకటం విచిత్రం. కవిత్వం కన్నా వీరికి వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యంలాగుంది.
పేరులో కూడా తెలుగుదనం చూపలేని వ్యక్తులు తెలుగు సాహిత్యానికి కొమ్ముకాస్తున్నారనే మూర్ఖశిఖామణులు ఇలాంటివారికి వత్తాసుగా బ్లాగుల్లో అజరామర సాహిత్యం వచ్చేస్తున్నదని కలలు గంటూ, వ్యాసాలు కూడా వ్రాస్తు, కాదన్నవారిని ఖండిస్తున్నామంటారు. వీరి 'ఆలోచనాత్మక విశ్లేషణ' విప్లవాత్మకమని అందరినీ నమ్మమంటారు.
అయ్యా విప్లవాత్మకమంటే వంకాయతో వడియాలు పెట్టుకుంటామనటం కాదు. విమర్శనాత్మక శక్తితోపాటు విచక్షణా జ్ఞానం కూడా ఉండాలి. మన విమర్శకుల్లో అది లేకనే, గుడికెళ్ళి టెంకాయ కొట్టను, వంకాయ కొడతాను వెరైటీగా అనే ప్రబుద్ధులు బయలుదేరి, ప్రయోగాల పేరిట నానీలకు, నానోలకు నాన్నలమని, పెదనాన్నలమని చెప్పుకుంటున్నారు.
సరే, నానోలవారు ఎలా ఏడ్చినా, జ్ఞాపకాల తవ్వకాల్లో బయల్పడిన అలనాటి 'నానోలు' నెటిజన్సు కోసం :
శీను శీను
సిగరెట్టు
శీను పెళ్ళాం
పెసరట్టు
ఎ బి సి డి ఇ ఎఫ్
నీ తాత
ముడ్డి
ఠాప్
గూట్లో
రూపాయ్
నీ మొగుడు
సిపాయ్
వానావానా
వల్లప్ప
వాణీ మొగుడు
ఎల్లప్ప
Saturday, April 18, 2009
Wednesday, April 8, 2009
బూటు సత్కారం
ఈమధ్య కాలంలో సాధారణ పౌరులు అసాధారణంగా తమ నిరసన తెలియజేయటం మిగిలిన పౌరుల్లో చైతన్యాన్ని కలిగిస్తున్నది. ఆ కోవకు చెందినదే, కేంద్ర హోం మంత్రి చిదంబరంపై దైనిక్ జాగరణ్ విలేఖరి జర్నైల్ సింగ్ బూటు విసరటం. అతను చేసిన క్షమించరాని నేరమేదైనా ఉంటే, అది గురి తప్పేట్లుగా బూటు విసరటం మాత్రమే అని నేను భావిస్తున్నా. నా అంచనా ప్రకారం ఈ పౌరచైతన్యానికి ప్రభుత్వం, రాజకీయ నాయకులు ఉలిక్కి పడుతూ ఉండి ఉంటారు. ఇది ఎన్నికల మాసం కావటమే దానికి ప్రధాన కారణం. హోం మంత్రిపై ఈ బూటు దాడిని ఖండించటానికి అన్ని రాజకీయపక్షాలు ఏకమౌతాయనేది కూడా స్పష్టమే. ఎందుకంటే, రేపు వారి వంతు కూడా రావచ్చు కదా!
అసలు ఇటువంటి విషయాన్ని ఖండించటానికి కూడా సిగ్గుపడాలి మన రాజకీయ నాయకులు. మొన్నామధ్య, కొందరు ప్రజలు తమ నియోజకవర్గంలోని సమస్యలపై తమ ప్రతినిధి లాలూ యాదవ్ తో మాట్లాడటానికి వెళితే, ఆయన వాళ్ళను అమ్మనాబూతులు (నిజంగానే... టీవీలో పెదవుల కదలికౌ చూపించారు) తిట్టి మరీ పంపించాడు. బీహారులో ఆర్జేడీని కాకుండా, జెడి (యు) ను ప్రజలు ఎన్నుకున్నారన్న అక్కసే ఆయన కోపానికి కారణం. అంతెందుకు, నిన్ననే వరుణ్ గాంధీని రోడ్ రోలర్ కింద వేసి తొక్కిస్తానని బహిరంగసభలో చెప్పాడు ఈయనే. ఇటువంటి వాచాలత్వాన్ని అదుపులో పెట్టుకోలేని మూర్ఖపు వెధవలు, సామాన్య ప్రజలు మాత్రం తమనేమీ అనకూడదని, అడగకూడదని ఎందుకు అనుకుంటారు?
నిజానికి, ఈ బూటు సత్కారానికి అన్నివిధాలా అర్హుడు మన మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్. ఆయన అదృష్టం బాగుండి నిన్న కాక మొన్న హోం మంత్రి అయిన చిదంబరం ఈ సత్కారాన్ని అందుకోవాల్సి వచ్చింది. ఏమైనా, దుష్టసాంగత్యంలో ఉన్నందుకు ఇటువంటి సత్కారాలు తప్పవు మరి. ఈ సత్కారానికి ఇంకా ఎంతమంది అర్హులనేది ఓ సారి చూద్దాం.
ఈ అగ్రపూజకు అన్నివిధాలా అర్హుడు లాలూ యాదవ్. ఆ తర్వాత అంబుమణి రాందాసు, శివరాజ్ పాటిల్, అర్జున్ సింగ్, సోమ్ నాధ్ ఛటర్జీ. అలానే, మన రాష్ట్రమంత్రివర్గంలోని ప్రతి సభ్యుడు, ప్రతిపక్ష నాయకులు ప్రతి ఒక్కరూ.
ఏదేమైనా, రాజకీయ నాయకులపై కుళ్ళిన కోడిగుడ్లు, టొమేటోలు, బూటు సత్కారాలను 'ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్' కిందే పరిగణించి చట్టబద్ధం చేయాలని డిమాండు చేస్తున్నా.
అసలు ఇటువంటి విషయాన్ని ఖండించటానికి కూడా సిగ్గుపడాలి మన రాజకీయ నాయకులు. మొన్నామధ్య, కొందరు ప్రజలు తమ నియోజకవర్గంలోని సమస్యలపై తమ ప్రతినిధి లాలూ యాదవ్ తో మాట్లాడటానికి వెళితే, ఆయన వాళ్ళను అమ్మనాబూతులు (నిజంగానే... టీవీలో పెదవుల కదలికౌ చూపించారు) తిట్టి మరీ పంపించాడు. బీహారులో ఆర్జేడీని కాకుండా, జెడి (యు) ను ప్రజలు ఎన్నుకున్నారన్న అక్కసే ఆయన కోపానికి కారణం. అంతెందుకు, నిన్ననే వరుణ్ గాంధీని రోడ్ రోలర్ కింద వేసి తొక్కిస్తానని బహిరంగసభలో చెప్పాడు ఈయనే. ఇటువంటి వాచాలత్వాన్ని అదుపులో పెట్టుకోలేని మూర్ఖపు వెధవలు, సామాన్య ప్రజలు మాత్రం తమనేమీ అనకూడదని, అడగకూడదని ఎందుకు అనుకుంటారు?
నిజానికి, ఈ బూటు సత్కారానికి అన్నివిధాలా అర్హుడు మన మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్. ఆయన అదృష్టం బాగుండి నిన్న కాక మొన్న హోం మంత్రి అయిన చిదంబరం ఈ సత్కారాన్ని అందుకోవాల్సి వచ్చింది. ఏమైనా, దుష్టసాంగత్యంలో ఉన్నందుకు ఇటువంటి సత్కారాలు తప్పవు మరి. ఈ సత్కారానికి ఇంకా ఎంతమంది అర్హులనేది ఓ సారి చూద్దాం.
ఈ అగ్రపూజకు అన్నివిధాలా అర్హుడు లాలూ యాదవ్. ఆ తర్వాత అంబుమణి రాందాసు, శివరాజ్ పాటిల్, అర్జున్ సింగ్, సోమ్ నాధ్ ఛటర్జీ. అలానే, మన రాష్ట్రమంత్రివర్గంలోని ప్రతి సభ్యుడు, ప్రతిపక్ష నాయకులు ప్రతి ఒక్కరూ.
ఏదేమైనా, రాజకీయ నాయకులపై కుళ్ళిన కోడిగుడ్లు, టొమేటోలు, బూటు సత్కారాలను 'ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్' కిందే పరిగణించి చట్టబద్ధం చేయాలని డిమాండు చేస్తున్నా.
Wednesday, April 1, 2009
ఇవి ఎన్నికలా?
ఘనత వహించిన మన లౌకిక ప్రజాస్వామ్య దేశానికి కాబోయే ఏలికలెవరన్నది రాబోయే ఎన్నికల్లో తెలిసిపోతుంది. యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్సు అని, నేషనల్ డెమొక్రటిక్ అలయెన్సు అని, మూడో ప్రత్యామ్నాయమని, నాలుగో ప్రత్యామ్నాయమని రకరకాల కూటములు ఏర్పడ్డాయి, ఎన్నికల తర్వాత మరిన్ని ఏర్పడే అవకాశాలూ ఉన్నాయి. ఎన్ని కూటములు ఏర్పడినా ఎవరికి వారు తమదే అసలైన లౌకిక కూటమిగా చెప్పుకుంటూ, ఓట్లు అడుక్కుని ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని చూస్తారు. మరికొందరు, భా.జ.పా. లాంటి పార్టీలు ఎన్నెన్నో పిల్లిమొగ్గలు వేసి, తమను తాము లౌకికవాదులుగా ప్రజలు గుర్తించాలని తంటాలు పడుతుంటారు. అసలు ఏమిటి ఈ లౌకికవాదం?
కులమత ప్రమేయం లేకుండా ఏర్పాటు చేయబడిన రాజ్యాంగం మనది. అంటే, మన రాజ్యాంగానికి, మన దేశానికి ప్రత్యేకించి ఒక మతమని, కులమని, జాతి అని లేవు. అన్ని కులాలు, మతాలు, జాతులు సమానమే. అయినా, స్వాతంత్ర్యానికి పూర్వం అణగారిన కొన్ని వర్గాల కోసం చదువుల్లోనూ, ఉద్యోగావకాశాల్లోనూ, పదోన్నతుల్లోనూ, చివరికి చట్టసభల్లో ప్రవేశానికి కూడా రిజర్వేషనులు కల్పించాం. అంతవరకూ బానే ఉంది. అసలు సమస్య ఇక్కడే మొదలౌతుంది.
రిజర్వేషనులు అధికారికంగా జరిగేవి అయితే, అనధికారంగా జరిగే రిజర్వేషన్ల పాపం ఆయా పార్టీలదే. భా.జ.పా., కమ్యూనిస్టులతో సహా, ఎన్ని పార్టీలు ఆయా నియోజకవర్గాల్లోని కుల మత ప్రాతిపదికన అభ్యర్ధులను రంగంలోకి దింపుతున్నాయో గమనించి తీరాల్సిన విషయం. ఆదర్శవంతమైన ఒక వ్యక్తి కన్నా కూడా, సమూహంగా ఉన్న ఒక కులానికి చెందిన వ్యక్తే ప్రతిపార్టీకీ అభ్యర్ధి కాగలుగుతున్నాడు. బి.సి.ల ఓట్ల కోసం బి.సి. ఫ్రంటుతో ఎన్నికల ఒప్పందం చేసుకున్న లోక్ సత్తా కూడా ఈ తరహా లౌకిక వాదానికే ఊతమివ్వటం ఆశ్చర్యకరం!
ఆ అభ్యర్ధి ఎంత దుర్మార్గుడు కానీ, జైల్లో ఉన్నవాడైనా సరే, వాడి కుల లేదా మత సమూహానికి ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రాముఖ్యతను బట్టి, వాడికి టిక్కెట్ లభిస్తుంది. వాడు గెలుస్తాడు కూడా! నిజమైన 'లౌకికత్వాన్ని' పరిహాసాస్పదం చేస్తున్న ప్రతి పార్టీ తమనుతాము లౌకిక పార్టీగా చెప్పుకోవటం సిగ్గు చేటు.
ఈ రకమైన 'కుల, మత కసరత్తులతో' టిక్కెట్లు పంచుతున్న ఆయా పార్టీలు లౌకిక పార్టీలా? అవి ఏర్పాటు చేసే ప్రభుత్వం లౌకిక ప్రభుత్వమా?
సంజయ్ దత్ అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న కేసులో నిందితుడుగా నిరూపించబడ్డాదు కాబట్టి, అతను ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడని సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది. బాగుంది. అబూ సలేం చేసిన నేరం నిరూపితమవ్వలేదు కాబట్టి, వాడు ఎన్నికల్లో నిలబడటానికి అడ్డంకేమీ ఉండదా? పోలీసు రిమాండులోనూ, జడ్జి ముందర తన నేరాన్ని అంగీకరించిన ముంబాయి పేలుళ్ళ నిందితుడు 'కసబ్' కు ఇప్పుడు ఓ లాయర్ ని కూడా అంటకడుతున్నది మన రాజ్యాంగం. బాగుంది. వాడు ఇప్పుడు పాట మార్చి, నేను భారతీయుడినే, నేనూ ఎన్నికల్లో నిలబడతాను అంటే అడ్డంకేమీ ఉండదా?
ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందు వరుణ్ గాంధీ చేసిన ప్రసంగంపై ఎన్నికల కమిషన్ తాఖీదు పంపుతుంది. అతడిని అనర్హుడని ప్రకటిస్తుంది. కానీ, ఎన్నికల సమయంలో మైనారిటీ రిజర్వేషనులపై మాట్లాడే పార్టీలను, నేతలను ఎందుకని అనర్హులుగా ప్రకటించరు?
ఇన్ని లొసుగులతో జరుగుతున్న ఈ ఎన్నికలు 'ప్రజాస్వామ్య బద్ధమైనవనో, లౌకికమైనవనో' అనుకోటానికి ఎక్కడ ఆస్కారం ఉంది?
కులమత ప్రమేయం లేకుండా ఏర్పాటు చేయబడిన రాజ్యాంగం మనది. అంటే, మన రాజ్యాంగానికి, మన దేశానికి ప్రత్యేకించి ఒక మతమని, కులమని, జాతి అని లేవు. అన్ని కులాలు, మతాలు, జాతులు సమానమే. అయినా, స్వాతంత్ర్యానికి పూర్వం అణగారిన కొన్ని వర్గాల కోసం చదువుల్లోనూ, ఉద్యోగావకాశాల్లోనూ, పదోన్నతుల్లోనూ, చివరికి చట్టసభల్లో ప్రవేశానికి కూడా రిజర్వేషనులు కల్పించాం. అంతవరకూ బానే ఉంది. అసలు సమస్య ఇక్కడే మొదలౌతుంది.
రిజర్వేషనులు అధికారికంగా జరిగేవి అయితే, అనధికారంగా జరిగే రిజర్వేషన్ల పాపం ఆయా పార్టీలదే. భా.జ.పా., కమ్యూనిస్టులతో సహా, ఎన్ని పార్టీలు ఆయా నియోజకవర్గాల్లోని కుల మత ప్రాతిపదికన అభ్యర్ధులను రంగంలోకి దింపుతున్నాయో గమనించి తీరాల్సిన విషయం. ఆదర్శవంతమైన ఒక వ్యక్తి కన్నా కూడా, సమూహంగా ఉన్న ఒక కులానికి చెందిన వ్యక్తే ప్రతిపార్టీకీ అభ్యర్ధి కాగలుగుతున్నాడు. బి.సి.ల ఓట్ల కోసం బి.సి. ఫ్రంటుతో ఎన్నికల ఒప్పందం చేసుకున్న లోక్ సత్తా కూడా ఈ తరహా లౌకిక వాదానికే ఊతమివ్వటం ఆశ్చర్యకరం!
ఆ అభ్యర్ధి ఎంత దుర్మార్గుడు కానీ, జైల్లో ఉన్నవాడైనా సరే, వాడి కుల లేదా మత సమూహానికి ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రాముఖ్యతను బట్టి, వాడికి టిక్కెట్ లభిస్తుంది. వాడు గెలుస్తాడు కూడా! నిజమైన 'లౌకికత్వాన్ని' పరిహాసాస్పదం చేస్తున్న ప్రతి పార్టీ తమనుతాము లౌకిక పార్టీగా చెప్పుకోవటం సిగ్గు చేటు.
ఈ రకమైన 'కుల, మత కసరత్తులతో' టిక్కెట్లు పంచుతున్న ఆయా పార్టీలు లౌకిక పార్టీలా? అవి ఏర్పాటు చేసే ప్రభుత్వం లౌకిక ప్రభుత్వమా?
సంజయ్ దత్ అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న కేసులో నిందితుడుగా నిరూపించబడ్డాదు కాబట్టి, అతను ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడని సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది. బాగుంది. అబూ సలేం చేసిన నేరం నిరూపితమవ్వలేదు కాబట్టి, వాడు ఎన్నికల్లో నిలబడటానికి అడ్డంకేమీ ఉండదా? పోలీసు రిమాండులోనూ, జడ్జి ముందర తన నేరాన్ని అంగీకరించిన ముంబాయి పేలుళ్ళ నిందితుడు 'కసబ్' కు ఇప్పుడు ఓ లాయర్ ని కూడా అంటకడుతున్నది మన రాజ్యాంగం. బాగుంది. వాడు ఇప్పుడు పాట మార్చి, నేను భారతీయుడినే, నేనూ ఎన్నికల్లో నిలబడతాను అంటే అడ్డంకేమీ ఉండదా?
ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందు వరుణ్ గాంధీ చేసిన ప్రసంగంపై ఎన్నికల కమిషన్ తాఖీదు పంపుతుంది. అతడిని అనర్హుడని ప్రకటిస్తుంది. కానీ, ఎన్నికల సమయంలో మైనారిటీ రిజర్వేషనులపై మాట్లాడే పార్టీలను, నేతలను ఎందుకని అనర్హులుగా ప్రకటించరు?
ఇన్ని లొసుగులతో జరుగుతున్న ఈ ఎన్నికలు 'ప్రజాస్వామ్య బద్ధమైనవనో, లౌకికమైనవనో' అనుకోటానికి ఎక్కడ ఆస్కారం ఉంది?
Subscribe to:
Posts (Atom)