Wednesday, April 14, 2010

కవిత్వంలో శైలి

కవిత్వంలో శైలి పై అలోక్ వాస్తవ్ గారి వ్యాసం ఆవకాయ.కామ్ లో....

"కలౌ దుష్టజనాకీర్ణే" అని "అజ్ఞాన వ్యాకులే లోకే" అని చాలామంది తిట్టిపోస్తుంటారు. మామూలు ప్రపంచం మాటెట్లున్నా ప్రస్తుతం తెలుగునేల్లో ముఖ్యంగా సాహిత్యసీమలో ఈ తిట్లు అక్షర సత్యాలు.

చాలా బ్లాగుల్లో యితరుల రాతల్ని తిట్టిపోసుకొంటూ attacking is the best defense అన్నట్టు తమతమ రాతల్ని కాపాడుకొనే వో విచిత్ర వ్యవహారం ప్రబలిపోయింది. యే ఎడిటరూ అవసరంలేదని, మా బాగోగులు మాకే బాగా తెల్సుననే గదా బ్లాగు ప్రచురణల్ని జేసుకొనేది! పొగిడేస్తే పరమ ఆప్తులు. కొంచెం అటుయిటూ గాక గోడ మీది పిల్లి వ్యాఖ్యలు జేస్తే వాళ్ళు అతిథులు. చెడమడా తిట్టేస్తే సాహిత్య ద్రోహులు. యిల్లా వొహరి రాతల్ని మరొహరు "విమర్శించటం" యే లోకనీతో? ఆయా "విమర్శల్ని" ఖండిస్తూ పేజీల కొద్దీ తిట్లకు లంకించుకోడం యే సత్సాంప్రదాయమో? రాసిన రాతల్లోనే పసలేనప్పుడు వాటిపై వొచ్చే విమర్శలు తిట్లకి యెక్కువ - బూతులకి తక్కువనే జెప్పాలి.

సరే. యీ భేషజాలు పక్కనెట్టి మళ్ళీ కవిత్వం విషయాన్ని జూసినప్పుడు, మొన్న చెప్పుకొన్న కొన్ని సంగతులతోబాటు ఇంకొన్ని జేర్చాలని అనిపించింది.

మిగతా ఆవకాయ.కామ్ లో... 

పాఠకులకు ఓ గమనిక : ఈ వ్యాస రచయితను నేను కాదు. ఆవకాయ.కామ్ లో ప్రచురింపబడిన ఈ వ్యాసాన్ని అందరికీ అందుబాటులో తీసుకువద్దామని ఇక్కడ లింకు ఇవ్వటం జరిగింది.

Sunday, April 11, 2010

దుశ్శబ్దపు జాడీల్లో

జాడీలోని ఆవకాయ లాలాజలోత్పత్తికి తొలిమెట్టైతే దుశ్శబ్దపు జాడీల్లోని బూజు భావాలు తిరకాసు కవిత్వానికి ఆఖరి మెట్లుగా మారతాయని జాలం జగ్గేశ పండితుడు రాసిన "నవవర్ణశాల"లో వుంది. ఇదో తిర్యక్ సృష్టిపరిణామక్రమమని, కోతి మనిషిగా మారినట్టుగానే శబ్దం నిశ్శబ్దం కాబోయి దుశ్శబ్దమైందని కూడా జగ్గేశ పండితుడు చెప్పాడు.

మీకు అక్షరాలు వచ్చునా? వాటిల్తో వాక్యాలు రాయడమూ వచ్చునా? "రా! కూర్చో!" అని కాక "కూర్చోడానికి రా!" అని డొంకతిరుగుడుగా చెప్పడం వచ్చునా? అలా కాస్త ముందు కెళ్ళి "కూర్చోడానికి రా! నాలుకపై మైసూర్ పాకులా!" అని చెప్పగలరా"? అక్కడితో ఆగక "కూర్చోడానికి రా! నాలుకపై మైసూర్ పాకులా! నగ్నంగా, నైపుణ్యంగా, వంకరగా, వాలుగా, చేవ్రాలుగా" అని సుత్తికొట్టడం కూడా చేతనౌనా? ఇంకేం మీరు కూడా కవిత్వం రాసేయొచ్చు. గుర్రం కదం తొక్కాలంటే గుగ్గిళ్ళు జోరుగా దట్టించాలి. మీ కలం కదం తొక్కాలంటే బోలెడు పదాల్ని దట్టించాలి.


దళిత కవిత్వం ఉంది. స్త్రీవాద కవిత్వం ఉంది. అభ్యుదయ, విప్లవ కవిత్వాలు కలియుగారంభం నుండీ ఉన్నాయి. ఉన్నవి చాలుననుకొంటే అజీర్ణమని మన తెలుంగుల బాధ. మన ఆకలికి ఈ నాలుగైదు రకాల అరకాసు కవిత్వాలు చాలవుగా! అందుకనే కొత్తవి కనిపెట్టుకొన్నాం. నానీలు వచ్చాయి. కంశ్రీలు వచ్చాయి. నానోలూ వచ్చాయి. ఏకాక్షరాలూ ఊడిపడ్డాయి. వీటికి తోడు నంజుడు కోసమని కధన కవిత్వం, వ్యాస కవిత్వం వంటివి కూడా వచ్చాయి.

మిగతా ఆవకాయలో ...

పాఠకులకు ఓ గమనిక : ఈ వ్యాస రచయితను నేను కాదు. ఆవకాయ.కామ్ లో ప్రచురింపబడిన ఈ వ్యాసాన్ని అందరికీ అందుబాటులో తీసుకువద్దామని ఇక్కడ లింకు ఇవ్వటం జరిగింది.

Thursday, April 1, 2010

కవిత్వం గురించి కొన్ని మాటలు

అలోక్ వాస్తవ్ గారు వ్రాసిన "కవిత్వం గురించి కొన్ని మాటలు" ఆవకాయలో...

కవిత్వం వొంటరిగా వున్న మనసులో పుట్టుకొచ్చినప్పుడు కవి మాత్రమే దాని సాక్షి. మూగవాడు సాక్ష్యం చెప్పాలంటే యెంత కష్టమో వొంటరితనంలో జరిగిన అంతర్మధనాన్ని బైట ప్రపంచానికి పరిచయం చైడం గూడా అంతే కష్టం. యిల్లా అష్టకష్టాలు పడి జీవితకాలంలో పట్టుమని పది కవితలు రాయడం గొప్ప. గానీ మన తెలుగునేలలో సంవత్సరానికో సంకలనం అదీ కనీసం 50-70 కేకలు పెడబొబ్బల్తో విసర్జించే ఘనాపాఠీలున్నారంటే సదరు కవిత్వం పుట్టుక యెల్లాంటిదో వూహించడం సులువు.

.....
మెప్పుకోసమో, సానుభూతి కోసమో రాసేది కవిత్వం కాలేదు. అరువు దెచ్చుకొన్న ఆవేశాలతో కవితలు పుట్టవు. పెట్టుడు మీసాలు గిన్నీసుబుక్కులోకి యెక్కవు. దుక్కిదున్ని, విత్తు విత్తకండానే సంకలనాల కొద్దీ కవిత్వ వ్యవసాయం జేయడమనేది వో మానసిక రోగం. నిజమైన బాధతో మాట్లాడినప్పుడు పచ్చి తాగుబోతు గూడా కవిత్వంలాంటిదే చెప్తాడు. దానికంటే హీనంగా రాసి కవిత్వమని బుకాయించడం "ఆత్మలోకంలో దివాలా" అనే జెప్పాలి.

పూర్తి వ్యాసం ఇక్కడ ....