చాలా రోజుల నుండి నాకు ఇష్టమైన కొన్ని సినిమా, సినిమాయేతర పాటలు ప్రస్తావిస్తూ వ్రాద్దామనుకుంటూనే బద్ధకిస్తున్నాను. ఈమధ్యనే, మలక్, జ్యోతి గారు తదితరులు వారికి ఇష్టమైన పాటలతో వ్రాసిన పోస్టులు చదివి, ప్రేరణ పొంది, బద్ధకానికి స్వస్తి చెబుదామని నిశ్చయించుకున్నాను. నాకు సినిమా పరిజ్ఞానం ఏమాత్రమూ లేదు. నాకు నచ్చే సినిమాలు, పాటలు కూడా చాలా తక్కువే. నావరకు అద్భుతంగా తోచిన, నచ్చిన పాటల తోరణాలు ఇవి :
* * *
సంగీత, సాహిత్యాలకి తెలుగు సంస్కృతితో విడదీయలేని సంబంధం ఉన్నదనేది కాదనలేని సత్యం. విశేషమేమిటంటే, సినిమాలకు సంబంధించిన కొందరు అమరగాయకులు, సంగీత దర్శకులు, చివరికి కొన్ని పాటలు కూడా తెలుగు సంస్కృతిలో భాగమయ్యారు. ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఓ ఘంటశాల చాలు. ఆయన పాట తెలియని వ్యక్తి ఖచ్చితంగా తెలుగువాడై ఉండడు. కుల, మత, ప్రాంతీయ విబేధాలకు అతీతమైన స్వరమాధుర్యంతో తెలుగు సంస్కృతితో మమేకమైన గాయకుడు ఆయన. అలానే, కొన్ని సినిమా పాటలు కూడా.
ఇప్పుడు నేను చెప్పబోయే పాట విశేషం కూడా ఇదే. ఈ పాట మారుమోగని శ్రీరామనవమి పందిరి ఉండదు. ఈ పాట లేకుండా పెళ్ళిళ్ళు జరిగే తెలుగు గడప ఉండదు. శ్రీ సీతారామ కళ్యాణం సినిమాలోని "సీతా రాముల కళ్యాణము చూతము రారండి..." పాటే ఇది. సీతారాముల కళ్యాణం బహుశా ఇలానే జరిగి ఉంటుందనేలా ఆ పాటను చిత్రీకరించిన తీరు నిజంగా అద్భుతం. ఒక పరిపూర్ణమైన నటుడిగానే కాక, ఓ దర్శకుడిగా కూడా ఎన్ టి రామారావు ప్రతిభకు నిదర్శనం ఈ పాట చిత్రీకరించిన తీరు. అలానే సంగీత దర్శకుడు గాలిపెంచల గారు - తెలుగు పెళ్ళిళ్ళల్లో చిరస్మరణీయుడైనాడు. నాకు అమితంగా నచ్చిన పాటల్లో మొట్టమొదటిది ఈ పాట.
ఈ పాటలో చివరిలో సీతా రాములు తలంబ్రాలు వేసుకునే సన్నివేశం ముఖ్యంగా గమనించండి. ఆ సన్నివేశంలో విశ్వామిత్రుడుగా గుమ్మడి కనబరచిన హావభావాలు ఆయన మహానటుడు ఎందుకనేదానికి సమాధానంగా ఉంటుంది. కేవలం రెండు మూడు సెకండ్ల క్లోజప్ షాట్ లో... ఓ దేవకార్యాన్ని పూర్తి చేయగలిగానన్న సంతృప్తి, విశ్వామిత్రుడుగా ఆయన వెలిబుచ్చిన తీరు అనితరసాధ్యం.
1980 లలో ఆంధ్రదేశాన్ని నవ్వుల్లో ముంచెత్తింది "శ్రీదేవి పెళ్ళి". మిమిక్రీ ప్రసాద్ అనే కళాకారుడు రూపొందించిన హాస్యవల్లరి ఇది. రావుగోపాలరావు పెళ్ళిపెద్దగా, శ్రీదేవి - చిరంజీవిల పెళ్ళికి హాజరయిన తెలుగు నటీనటులతో ఓ అద్భుతమైన కళాసృష్టి చేసిన ఈ ప్రసాదు గారి గురించి ఎవరికైనా వివరాలు తెలుసా?
అఫ్సర్ గారి అక్షరంలో, ఇంటర్నెట్ లో తెలుగు సాహిత్యంపై చర్చ జరుగుతున్న సందర్భంగా, ఆవకాయలో గతంలో ప్రచురింపబడిన సంపాదకుల వ్యాసం :
పొద్దు.నెట్ లో ఇటీవలనే శ్రీ కామేశ్వర రావు గారు ఇంటర్నెట్ కవిత్వ వ్యవసాయం పై చక్కటి వ్యాసం వ్రాసారు. ఆ వ్యాసంలో కామేశ్వర రావుగారు పేర్కొన్న విషయాలలో కొన్నింటి పై మా అభిప్రాయాల్ని ఈ వ్యాసంలో పొందుపరుస్తున్నాము.
సమకాలీన కవితా రంగం రెండు సమాంతర వ్యవస్థలుగా విడిపోయే ప్రమాదమున్నదని కామేశ్వర రావు గారు పేర్కొన్నారు.
ఇంటర్నెట్ వాడే పాఠకులు పత్రికల్ని, సాహిత్య సంచికలనీ చదవకపోతే ఇది ప్రమాదమే. దినపత్రికలు వారి వారి ఇంటర్నెట్ పత్రికలను నడుపుతూ ఉండడం, తమ తమ అచ్చు పత్రికల్లో వచ్చిన (అన్ని ప్రక్రియల) సాహిత్యాన్ని ఈ-పత్రికల్లో ఉంచడం వల్ల కామేశ్వర రావు గారు పేర్కొన్న చీలికను కొంత వరకూ నివారించగలుగుతున్నారు.
ఇంటర్నెట్ లో మంచి కవిత్వం వ్రాస్తున్నా అచ్చులో కనబడని కవుల గురించి ప్రస్తావించి కామేశ్వర రావు గారు ఓ మంచి విషయాన్ని వెలికిదీసారు. ఎందుకిలా జరుగుతోంది? అన్నదానికి అచ్చు పత్రికల నిర్వాహకులు విశ్లేషించాలి.
తెలిసిన మేరా తరచి చూస్తే, ప్రచురణలోని ఆలస్యం , ప్రచురింపబడిన తరువాత పాఠకుల అభిప్రాయాలు వెంటనే తెలియకపోవడం, పేరుమోసిన కవులకే అగ్రపీఠం వేసే తత్త్వం , కొండకచో రాజకీయాలు ఇంటర్నెట్ కవుల్ని అచ్చు పత్రికలనుండి దూరంగా ఉంచుతున్నాయనుకుంటాము.
పైన ఉటంకించిన వ్యాఖ్యలు చాలు, దళిత తీవ్రవాదాన్ని ఎగదోయడానికి కుహాన దళిత కామెడీ మేధావులు చేస్తున్న ప్రయత్నాలు అర్ధం చేసుకోటానికి.
శతాబ్దాల క్రితం జరిగిన అణచివేతకు, వివక్షకు ఈరోజు ఎవరిని బాధ్యుల్ని చేస్తారు? ఇకపైగా, ఆనాటి వివక్షను ఖండించి, దళితుల శ్రేయస్సు కోసం చట్టాలు చేసి, చర్యలు చేపట్టడం శాంతి మంత్రాలు జపించటమట! అంటే, దళితుల సంక్షేమం కోసం చట్టాలు చేసినా కయ్యానికి కాలుదువ్వటమే దళిత పోరాటపు ఏజెండా అన్నమాట!
అసలుదళిత ధిక్కారం మొదలయ్యింది ఈ రోజు కాదు. ధిక్కార స్వరాన్ని వినిపించింది అంబేద్కర్. దళిత పోరాటం మొదలేసింది ఈరోజు కాదు. మహాత్మా గాంధి, మహాత్మా ఫూలేలు ఆనాడే పోరాటం చేసారు. కాబట్టే, దళిత సంక్షేమమే ధ్యేయంగా ప్రత్యేక చట్టాలు రూపొందాయి.దళిత చట్టాలు సరిగా అమలుకాలేకపోతున్నాయంటే, దానికి కారణాలు వెదకాలి. దానికి కూడా అగ్రవర్ణాలని బాధ్యుల్ని చేయటం ఏమిటి?
ఒకటి మాత్రం నిజం. ఇస్లామిక్ తీవ్రవాదం, కాషాయ తీవ్రవాదం మూర్ఖులు నడుపుతున్నవే. అందుకే అవి హింసాత్మకంగా జరుగుతున్నాయి. కానీ, సోకాల్డ్ కుహానా దళిత మేధావుల నేతృత్వంలో మొదలైన దళిత తీవ్రవాదంలో అక్కడక్కడ తప్పించి రక్తం పారదు. కేవలం, ప్రజాస్వామికంగా చాపకింద నీరులా సామాన్య దళితుల మనసులను కలుషితం మాత్రమే చేస్తుంది. వర్గ వైషమ్యాలు పెచ్చరిల్ల చేస్తుంది. అగ్రవర్ణాల వారిని పొమ్మనకుండా పొగ బెడుతుంది.ప్రభుత్వాలు ఉపేక్షిస్తే, ఈ తీవ్రవాదం రేపు ఓ దళితస్తాన్ కావాలనే వరకు ఖచ్చితంగా కొనసాగుతుంది.
ఏ తీవ్రవాద సంస్థ అయినా వారి పోరాటానికి చెప్పే సాకులు అస్తిత్వం, అణచివేత, ఆత్మగౌరవం. ఈ దళిత తీవ్రవాదానికి కూడా ఈ సాకులే ఊతం. నిజానికి, ఈ దళిత తీవ్రవాదం సామాన్య దళితుల పోరాటం కాదు. దళిత మేధావుల పోరాటం.
అస్తిత్వం : ఇప్పుడు దళితుల అస్తిత్వానికి వచ్చిన ముప్పేమిటి? శతాబ్దాల క్రితం నాటి వివక్ష ఈరోజుల్లో ఉందా? ఈ కామెడీ మేధావుల ప్రకారం అస్తిత్వం అంటే, వారికి అధికారం కట్టబెట్టటం. దళితపోరాటం పేరుతో కోట్లు కూడబెట్టుకునే మాయావతులని, పాశ్వాన్ లని ప్రధానులుగా చేయటం!
అణచివేత : ఈ కామెడీ మేధావుల ప్రకారం అణచివేత అంటే, అయినదానికి, కాని దానికీ అగ్రవర్ణాలను నిరసించటం, వారిని అణచివేయటం. అంటే, చరిత్రను పునరావృతం చేయటం. గతంలో వారు ఏ అణచివేతకు గురయ్యారో, అదే అణచివేతను అగ్రవర్ణాలపై అమలు చేయటం. అసలు ఆ మాటకొస్తే, ఇప్పుడుమన దేశంలో ఒక్క రాజకీయ వర్గం తప్పించి మిగిలిన వర్గాలన్నీ అణచివేతకు గురౌతున్నవే.
ఆత్మగౌరవం : ఓ దళితుడిగా నేను వ్రాసిన కవిత బాగోలేదంటావా, అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరించే మేధావులు, దళితుల ఆత్మగౌరవం కాపాడటమే ధ్యేయంగా రూపొందించిన అట్రాసిటీ చట్టాలు సామాన్య దళితుల వరకు చేరవేయటంలో ఎంత వరకు కృషి చేస్తున్నారు? చట్టాలు అమలు చేయటంలోని విధివిధానాలలో ఉన్న లోపాలు ఏనాడైనా చర్చించారా?
ఈ దళిత కామెడీ మేధావులు నియో దళితిస్టు భావజాలంతో చేస్తున్న పోరాటం ఏమిటి? కాశ్మీర్ ను పాకిస్తాన్ కు, అరుణాచల్ ను చైనాకు ఇచ్చేయమనా ఈ పోరాటం? ఒక వ్యక్తిని వ్యక్తిగా విమర్శిస్తే, మా సమూహాన్ని విమర్శిస్తావా అని ధర్నాలకు దిగటమాపోరాటం? హిందువుల ఇతిహాస పురాణాలను అవహేళన చేయటమా పోరాటం? ఉన్మాదంగా, దేవతల నగ్న చిత్రాలను ప్రదర్శించి హిందువుల నమ్మకాలను నవ్వులపాలు చేయటమా పోరాటం? సభలు, సమావేశాల పేరుతో మందిని పోగుచేసి వాళ్ళ ఆలోచనలు కలుషితం చేయటం తప్పించి, దళితుల్లో నిరక్షరాశ్యత ఇంకా ఎందుకని తగ్గలేకపోతుందో, చట్టాలపై వారికున్న అవగాహనని ఎలా పెంపుచేయాలో అనే విషయాలపై ఇంతవరకూ ఈ కుహానా మేధావులెవరైనా ఆలోచనాత్మకమైన దృక్ఫధాన్ని చూపారా?
నిజానికి ఈరోజు, సామాన్య దళితులకు ముప్పు పొంచి ఉన్నది అగ్రవర్ణాల వల్ల కాదు. ఈ కామెడీ మేధావుల వల్లే ప్రమాదం. ఎందుకంటే, ఆనాడు అగ్రవర్ణాల వారు తమ దౌష్ట్యాన్ని ప్రదర్శించటానికి దళితులను వాడుకుంటే, ఈనాడు తమ స్వార్ధం కోసం ఈ దళిత మేధావులు వారిని పావులుగా చేస్తున్నారు. ఈ మేధావులు ఆశించినట్లుగా దళిత ఆత్మగౌరవ పోరాటం వీధిపోరాటాలుగా దిగజారితే, అసువులు కోల్పోయేది ఈ మేధావులు కాదు.
ప్రభుత్వాలు ఇకనైనా కళ్ళు తెరవాలి, కొరడా ఝళిపించాలి.
అప్పట్లో ఇండియన్ ఐడల్ పోటీలో, కారుణ్య తెలుగువాడు, బాగా పాడుతున్నాడు, ఒక పోటీ ఫైనల్ లో వచ్చాడు అన్న ఉద్దేశ్యంతో ఓట్లేసాను. కారుణ్య ఓడిపోయిన తర్వాత, ఆ పోటీకి అర్ధమే లేదనిపించి, తరువాతి పోటీలు లైటుగా తీసుకుంటూ వచ్చా.
ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ఐడల్ పోటీలో శ్రీరామచంద్ర చాలా బాగా పాడుతున్నాడు. అయినా లాభం ఏముంది, ఉత్తరాది ఓట్ల ముందు మనం ఎన్ని ఓట్లు వేసినా ప్రయోజనం లేదని భావించి ఇంతవరకూ ఓటు వేయలేదు. ఈరోజు యాధాలాపంగా యలమంచి కిరణ్మయి గారు ఫేస్ బుక్ లో ఇచ్చిన యు ట్యూబు లింకులో ఈ పాట విన్న తర్వాత అనిపిస్తుంది... ఇటువంటి గాయకులు ఎన్నో తరాలకు గానీ జన్మించరని. సాన పెట్టిన వజ్రం ఎక్కడైనా మెరుస్తుందనేది నిజమే అయినా, శ్రీరామచంద్ర లాంటి అద్భుతమైన గాయకుడు ఇండియన్ ఐడల్ గా నెగ్గకపోతే, ఆ పోటీ, ఓట్లు వేసే శ్రోతల సంగీతాభిమానం కూడా అనుమానాస్పదమే ఔతుంది.
ఆ మాటకొస్తే, ఈ పాట వింటే, బహుశా రాకేష్ తనంతట తనే పోటీ నుంచి విరమించుకోవచ్చు కూడా. మీ స్నేహితులకు ఈ లింకు చూపి, విన్న తర్వాతే వోట్లేయమని చెప్పండి, ప్లీజ్. ఇటువంటి గాయకుడు ఓడిపోకూడదు. ప్రాంతీయాభిమానంతో కాదు, అతని టాలెంటుకు వోటు వేయండి, వేయించండి.
Life has been so mechanical these days that we become almost indifferent to our surroundings, friends and family. There are many people with whom we interact on daily basis, but still we don’t get to know them in real sense.
One such person in my life is Mr. Narayanan Ganesan. We both have been colleagues for the past 16 years. Personally, we are very good friends too. It is only recently that I have come to know about his favorite hobby of Photography. Exceptional quality of his photography has made me speechless!
Following is a brief note on how he views PHOTOGRAPHY.
It is five O Clock on a summer Sunday morning at the home of Narayanan Ganesan. He has packed a snack and a drink and some other bits and pieces and is about to leave home. Ganesan is a photographer in his free time, and early morning is a good time to catch the insects he specializes in as they soak up the heat of the early morning sun before their day’s activity starts.
Ganesan first took up photography some seven years ago and initially worked on landscapes. “I started with mountains. They always fascinated me,” Ganesan comments. “But during a visit to my home town in Kerala, the sound of the morning birds woke me up. I started with zoom photography, but then the little insects made me to move into macro photography. Many times what you can not see with the naked eye can be seen through a macro lens; nature’s perfection at it’s best!”
Ganesan’s interest in nature photography is not limited to his Sunday morning outings. “I arrange an exhibition every year at a local school with videos and photographs,” he explains. “The children enjoy that and it helps them learn to identify birds, insects and butterflies.”
“Some times I wait for hours for a little butterfly to spread its wings, or for a bird to fly into the nest to feed its young. Photographing insects teaches patience,” Ganesan says and continues, “That is not a bad quality to possess at work either.”
Ganesan along with some of his Photography Colleagues has also developed close links with a local research institute. “We take photographs at annual intervals of the same location and check whether the insect population level is the same, whether there are changes in coloring and so on, and we contribute our findings to the institute,” explains Ganesan. “We also get a lot of support from other professionals and learn about insect families, their behavior and so on.”
Ganesan has made his photos available to an even wider audience than the school and the institute. “I am member of a club called “TREKNATURE” and post a lot of my nature photographs on their site.
One might think that this hobby must involve international travel and a major investment in time and money. “It is true that the equipment is not cheap, and I always have a camera with me when I travel on business. Most of my pictures though are taken within five kilometers of my home, I cycle from home and my son often comes with me and takes pictures, too. We are out from 5 am to about 11 am on Sunday mornings,” smiles Ganesan.
ఓ దశాబ్దం క్రితం వరకు, అక్కడక్కడా, అప్పుడప్పుడు మాత్రమే జరుగుతున్న సంఘటనలుగా భావించే "మగవారిపై గృహహింస" ఈ మధ్య కాలంలో తరచుగా చదువుతున్నాము. అలానే, గృహ హింసపై, వరకట్న హింసలపై ఉన్న చట్టాలను కూడా కొందరు దురుపయోగం చేస్తున్న తీరు కూడా ఈమధ్య కాలంలో మరీ ఎక్కువైందనే చెప్పవచ్చు. ఈ విషయానికి సంబంధించి ఈరోజు "ముంబాయి మిర్రర్" పత్రికలో వచ్చిన ఒక వార్త 'తాడేపల్లి" గారి వాదనలోని కొన్ని భయాలను నిజం చేస్తున్నది. ఇక చదవండి :
ఎప్పుడూ పదవుల కోసం, అధికారం కోసం రాజకీయాలు నడిపే మన నేతలు మొదటిసారి ప్రజల కోసం రాజకీయాలు నడపటం ముదావహం. ఈ సంతోషానికి మరో కారణం కూడా ఉంది. ప్రజల కోసం ఉద్యమించినప్పుడు, మన ప్రజాస్వామ్య పరిరక్షకులే ఒళ్ళు హూనమయ్యేలా కుళ్ళబొడుస్తారనే ఓ నగ్న సత్యాన్ని అనుభవంతో గ్రహించారు మన తెలుగుదేశం నేతలు. అరకొర వసతుల మధ్య, మరాఠీ లాఠీ దెబ్బలతో దినదిన గండంగా అయిదురోజులు వెళ్ళబుచ్చామని చంద్రబాబు కన్నీళ్ళ పర్యంతం అయ్యారు.
ఒక్కసారి లాఠీ ఝలిపించేటప్పటికే, వాతలు తేలిన వీపు చూపిస్తు ఒక నేత, స్పృహ తప్పిన మరో మహిళా నేత, కన్నీళ్ళు తుడుచుకుంటూ వాళ్ళ నాయకుడు.... ప్రజా ఉద్యమంలో లోతుపాతులు చవిచూడటం మంచి పరిణామమే కదా!
అధికారంలో ఉన్నప్పుడు, స్త్రీలని, విద్యార్ధులని, బడుగు రైతులనీ లేకుండా అనేకానేక ఉద్యమాలను ఆయనే ఎలా అణచివేసారో కూడా ఆ అయిదు రోజుల్లో ఒక్కసారైనా ఆయనకు గుర్తుకొచ్చి ఉంటుందనే ఆశిస్తాను. అరకొర ఏంటి, అసలు వసతులే లేని ఆంధ్ర లాకప్పుల్లో ఎంతమంది మగ్గిపోతున్నారో కూడా ఆయనకు ఓ అంచనా వచ్చి ఉంటుందనే ఆశిస్తాను.
ప్రజా ఉద్యమాల లోటుపాట్లు బానే అర్ధం చేసుకున్న కాంగ్రెసీయులకు, ఎలాగూ తమ పీఠాల కింద పదవీ పీఠాలు కాపాడుకోటానికే తీరిక లేదు కాబట్టి, ఇలాంటి రాజకీయ ఉద్యమాలు నడిపే తీరిక మాత్రం ఇంకెక్కడిది? కాబట్టి కాంగ్రెస్ నేతలు బతికి బట్ట కట్టేసినట్లే.
చంద్రబాబు రాజకీయ పాచిక ఈ తెలంగాణా ఉప ఎన్నికల్లో పారిందో, వచ్చే ఎన్నికలకు తెలుగు తమ్ముళ్ళు తమ వీపులు రెడీ చేసుకోవాల్సిందే. కర్ణాటక, తమిళ్నాడు పోలీసు లాఠీలకు కూడా త్వరలోనే బోల్డు పని దొరకబోతుంది.
మనం ఎన్నుకున్న ప్రభుత్వపు విధానాలు మనకు నచ్చనప్పుడు, వ్యతిరేకత ఎలా ప్రకటించాలి? అందులోనూ, మన కనీస అవసరాలకు, అవకాశాలకు ప్రభుత్వమే గండి కొడుతున్నప్పుడు ఏం చేయాలి?
కలెక్టరుకో, మరో అధికారికో వినతి పత్రాలు సమర్పిస్తాం. అవి బుట్టదాఖలౌతుంటే, కోర్టులో కేసులు వేస్తాం. కోర్టుల చుట్టూ సంవత్సరాల తరబడి తిరిగే ఓపిక లేకపోతే, మూకుమ్మడిగా ఆందోళన చేస్తాం. దాదాపు 30 గ్రామాల ప్రజలు చేసిందదే. పర్యవసానం, పాశవికంగా ప్రభుత్వం చేసిన బలప్రయోగానికి సోంపేటలో కొందరి దుర్మరణం.
తమ సిద్ధాంతాలను వ్యతిరేకించే ప్రభుత్వ అధికారులను, పోలీసులను కాల్చి చంపే నక్సలైట్లకు, తమ విధానాలను వ్యతిరేకించే ప్రజలను పోలీసు కాల్పులతో చంపేసే ప్రభుత్వానికి తేడా ఏమిటి? నక్సలైట్లనైతే సంఘవిద్రోహులుగా ప్రకటిస్తాం. మరి ప్రభుత్వాన్నేం చేయాలి? విచిత్రమేమిటంటే, ప్రభుత్వ విధానాలను విమర్శించిన వారినందరినీ నక్సలైట్లుగా ముద్రవేసి, ప్రగతి నిరోధక శక్తులుగా ప్రచారం చేస్తుంది ఈ ప్రభుత్వం.
గ్రామ స్వరాజ్యం సాధ్యపడినప్పుడే, దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లని బోధించిన మహాత్ముని వారసులు, గ్రామ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా తెగబడటంలోని ఔచిత్యం ఏ ప్రజాస్వామిక విధాన స్ఫూర్తి?
కొన్నాళ్ళ క్రితమే, పర్యావరణ అనుమతులు అందించిన కేంద్ర పర్యావరణ శాఖ, ఈరోజు ఆ అనుమతులను వెనక్కు తీసుకున్నదని వార్తలు. అసలు, తప్పుడు సమాచారంతో పర్యావరణ అనుమతులు అధికారులు ఎలా సంపాదించారు? ఆయా అధికారులను ప్రభావితం చేసిన అంశాలేమిటి? ఇవేవీ ఇప్పుడు చర్చకు రావు. ప్రస్తుతానికి, ప్రజల గద్దింపులను సర్దిచేప్పే ప్రయత్నాలలో ఇదో భాగం మాత్రమే.
పార్టీల కతీతంగా ఆయా గ్రామాల ప్రజలు సోంపేటలో చేసిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకం కావాలి. ప్రభుత్వాలని, తద్వారా దేశాన్ని ప్రభావితం చేయగల మధ్యతరగతి ప్రజలలో భావ చైతన్యం పెరగాలి. మునుపెవ్వరో ఏదో బ్లాగులో కామెంటు చేసినట్లు, రోజుకు 24 గంటల కరెంటుతో, 24 గంటల కేబుల్ టీవీ ప్రసారాలతో, రోజుకోసారి మునిసిపాలిటీ వారిచ్చే మంచినీటితో సంతృప్తి చెందే స్థాయి నుంచి దాటి, అభివృద్ధి పేరుతో ప్రభుత్వం మన కళ్ళకు కడుతున్న గంతలు తీసి నిజాలు నిర్ధారించుకునే స్థాయిలో విప్లవాత్మకమైన చైతన్య స్ఫూర్తి మనలో కలగాలి.
ఆ స్ఫూర్తే, మరిన్ని సోంపేటలు పునరావృతం కాకుండా ఆపగలుగుతుంది. ఆ స్ఫూర్తే అంతరాల భేషజాలు లేని ప్రజా ఐక్యతకు పునాదౌతుంది.
రచన ఒక వరంగా, వాక్య నిర్మాణం ఒక అద్బుత శిల్పంగా భావించే అరుదైన రచయితల్లో చిట్టిబాబు ఒకరు. పేరులోనే పెన్నిధి వున్న కథకుల్లో వీరిని చేర్చాలి. Author Chitti Babu మాటల్ని ఎక్కడ పొందికగా, మధురనిష్యందంగా ఉపయోగించాలో, ఎక్కడ పాఠకుల్ని తమ "గ్రిప్ "లోకి తెచ్చుకోవాలో తెలిసిన రచయితల్లో ఒకర్నిగా ఈయనను చెప్పాలి.
"ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు" చదువుతుంటే, నేను తిరుపతి ఈనాడులో పనిచేసిన రోజులు గుర్తుకువచ్చేవి. 88 చివర్లో తిరుపతి ఈనాడులో పి.ఎల్.ఎం.ఓ.గా (కంపోజింగ్ సెక్షన్) చేరాను. పదోతరగతి సెలవల నుంచి, గుమాస్తాగిరికి ఉపయోగపడుతుందనుకునే మధ్యతరగతి మనస్తత్వంలో భాగంగా, ఇంగ్లీషు, తెలుగు, హింది టైపు రైటింగు, షార్ట్ హాండు నేర్చుకోవటం మొదలేసా. డిగ్రీ అయిపొయిందే తడవుగా ఈనాడులో ఉద్యోగం రావటంతో మరేమీ ఆలోచించకుండా జాయిన్ ఐపోయాను. నిజానికి, కాలక్రమంలో ఓ జర్నలిస్టుగా స్థిరపడదామనే ఆలోచన కూడా ఈనాడులో చేరటానికి మరో ముఖ్య కారణం. రెండు సార్లు ఈనాడులో సబ్ ఎడిటర్ ఉద్యోగానికి గాను, వ్రాత పరీక్షలకు కూడా హాజరయ్యాను. అదృష్టం కొద్దీ పాస్ కాలేదు :)
నేను పని చేసిన దాదాపు ఏడెనిమిది నెలల్లో, ఈనాడులో నాకు నచ్చిన ఓ మంచి విషయం ఏదైనా ఉన్నదంటే, అది జీతం. బెత్తెడు జీతమే (స్టైఫండ్) అయినా ఠంచనుగా నెలాఖరుకల్లా వచ్చేది. ఆ రోజుల్లో, మా రూం మేట్లుగా ఉన్న ఆంధ్రజ్యోతి, ఉదయం పత్రికల ఉద్యోగులు మాత్రం నానా బాధలు పడేవారు జీతం సమయానికి రాక. బచావత్ ట్రిబ్యునల్ సిఫార్సుల ఆధారంగా జీతాలు ఇవ్వాళ పెరుగుతాయి, రేపు పెరుగుతాయి అనుకుంటూనే, దాదాపు ఓ అయిదేళ్ళు గడిచిపోయాక గానీ, ఈనాడులో జీతాలు పెరగలేదని చెప్పేవారు, ఆ తర్వాత నా జర్నలిస్టు స్నేహితులు.
జర్నలిస్టులు ఎలా పీడింపబడేవారో నాకైతే తెలియదు కానీ, మమ్మల్ని మాత్రం సబ్ ఎడిటర్లు పీల్చి పిప్పి చేసేవారు. అలానే, సీనియర్లు కూడా చెండుకు తినేవారు. కొత్తగా వచ్చామని మాకు డే షిఫ్టు ఉండేది, కంప్యూటర్ లో తెలుగు టైపు చేయటం నేర్చుకోటానికి వీలుగా. ఎందుకంటే, డే షిఫ్టులో ఎక్కువ పని కూడా ఉండేది కాదు, కాబట్టి ఆ సమయంలో మాకు మా షిఫ్టు ఇన్ ఛార్జి టైపు చేయటం, అలానే, ప్రకటనలు చేయటం నేర్పేవాడు. కానీ, చేరిన కొత్తలో ఓ రెండు వారాలు మినహా, మళ్ళీ ఏనాడు ఆ షిఫ్టులో పని చేయలేదు. సీనియర్లు అడ్జస్టుమెంట్లని వేధించేవారు. కుదరదంటే వాళ్ళ చాకిరి కూడా మా మీద రుద్దేవారు. మా షిఫ్టు ఇన్ ఛార్జి మాత్రం చాలా మంచివాడు. నాకు వ్యక్తిగతంగా కూడా సహాయం చేసేవాడు. అతని పేరు తాతబ్బాయి. తిరుపతికి కొత్త కావటంతో, మాకు అద్దె గది వెతుక్కోటంలో, వీక్లీ ఆఫ్ రోజు ఇంటికి పిలిచి మంచి భోజనం పెట్టటం చేసేవాడు. అలానే, ఓవర్ టైం చేయించి, కంపెన్సేటరీ సెలవలు కూడా ఇచ్చేవాడు. రెండో షిఫ్టు ఇన్ ఛార్జి (భీమారావు) అంటే అప్పట్లో ఎందుకో టెర్రర్ గా ఉండేది. మనిషి మాట తీరే కఠినంగా ఉంటుంది కానీ, మంచివాడే అని ఆ తర్వాత తెలిసింది.
ఇక ఈ సబ్ ఎడిటర్లు... ఈనాడులో సబ్ ఎడిటర్ అనేప్పటికి ఏవో కొమ్ములు మొలిచినట్లు, కంపోజింగ్ సెక్షనులో ఉన్న మేమేదో పనికిమాలినవాళ్ళమైనట్లు చూసేవారు. వారు వ్రాసి ఇచ్చే వార్తలు, నిజం చెప్పాలంటే నవ్వొచ్చేది. ఏదో వ్రాసుకుపోవటమే కానీ, స్పార్క్ ఏకోశానా కనిపించేవిధంగా ఉండేవి కాదు. స్థానిక వార్తలకు ప్రాధాన్యం ఇచ్చే ఉద్దేశ్యంతో మొదలైన జిల్లా ఎడిషనుల వల్ల, వార్తలలో పస తగ్గిపోయిందేమో అనిపించేది. మడకశిరలో మడత మంచాల పంపిణీ,.. అనంతపురంలో ఆత్మహత్య... కుళాయి తగాదాలో కన్నుమూత... ఇలా సాగేవి వార్తల శీర్షికలు. ఇక వీళ్ళ చేతివ్రాత చూస్తే కళ్ళు బైర్లు కమ్మేవి. ఎవరో ఒకరిద్దరు తప్ప, మరెవరి చేతివ్రాత అర్ధమయ్యేది కాదు. నమ్మండి, నమ్మకపోండి... నేను, రమణ బాబు అనే మరోతను కలిసి నాలుగు జిల్లా ఎడిషన్లు పూర్తిగా కంపోజ్ చేసేవాళ్ళం, పోటీ పడి మరీ. ఇక మమ్మల్ని రెచ్చగొడుతూ, సీనియర్లు వాళ్ళ పని కూడా మాకు పురమాయించేవాళ్ళు.
వ్యక్తిగతంగా, నేను నైట్ షిఫ్టు కోరుకునేవాడిని. ఎందుకంటే, ఆ సమయంలో సబ్ ఎడిటర్లతో కూర్చొని నేను కూడా వార్తలు వ్రాసే అవకాశం దొరికేది. అప్పట్లో విశ్వప్రసాద్ గారు చిత్తూరు డెస్కు ఇన్ ఛార్జిగా ఉండేవారు. వాళ్ళ డెస్కుకు పని తగ్గుతుందనేమో తెలియదు కానీ, ఆయన చాలా ప్రోత్సహించేవారు. అప్పటి ఓ విషయం నాకింకా గుర్తే. గాలి ముద్దుకృష్ణమ నాయుడు విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి, కొన్నిపనులు ఎందుకు చేయలేకపోతున్నది (దాదాపుగా ఇదే అర్ధంలో) వివరణ ఇచ్చారు. రిపోర్టరు ఇచ్చిన ఆ వార్తకు "ముద్దు" మాటలు "గాలి"కే అనే శీర్షిక పెట్టి ఆ వార్తను ఎడిట్ చేసా. విశ్వప్రసాదుగారు నవ్వి, ఆ శీర్షిక తీసి, ఇంకోటి పెట్టారు.
మమ్మల్ని వేధించిన వాళ్ళలో మరో ముఖ్య వ్యక్తి అక్కడి పర్సనల్ మేనేజర్. పేరు సరిగా గుర్తులేదు... రాజేంద్రబాబు అనుకుంటా. కంప్యూటర్ సెక్షనులో ఏ.సి. ఉండేది. దాదాపు ఎనిమిది గంటలు కూర్చోవాలంటే ఇబ్బందిపడేవళ్ళం. మధ్యలో ఓ పది నిముషాలు బ్రేక్ తీసుకొని బయట జేబులో చేతులు పెట్టుకు నుంచుంటే... "ఏరా, జేబులో చేతులు పెట్టి XXXX పిసుక్కుంటున్నారు... ఇలాగైతే ప్రొబేషన్ పెంచేస్తా..." అని అరిచేవాడు. సగం ఈయన కూడా కారణమే, నేను ఈనాడు వదిలేసి వెళ్ళిపోటానికి. ఇక ఆ మేనేజరు... గోవిందరావో, గోపాలరావో ఉత్సవవిగ్రహంలా మాత్రమే ఉండేవాడు. అసలు ఆయన చేసే పనేంటో మాకు అర్ధం అయ్యేది కాదు. అంతా రాజేంద్రబాబు హవానే నడిచేది.
ఇంత చెప్పీ, రెడ్డెమ్మ మెస్ గురించి చెప్పకపోతే ఎలా? చాలా చౌకగా భోజనం పెట్టేది. ఈనాడు ఆఫీసు నుంచి, రైల్వే లైను దాకా నడుచుకుంటూ వచ్చి లైనుకు అవతల ఉన్న రెడ్డెమ్మ మెస్ లో భోజనం చేసేవాళ్ళం. కానీ, నాలాంటి వాళ్ళకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఎందుకంటే, శాఖాహారం, మాంసాహారం రెండు వండేది. అంతా ఒకేచోట కూర్చొని తినాల్సి వచ్చేది. తాగుబోతు భర్తని, ఆకతాయి మొదటి భార్య పిల్లవాడిని భరిస్తూ, ఎలా పని చేయాల్సి వస్తున్నదో నసుగుతూ వడ్డించేది.
ఇక, తెల్లవారుఝామున మూడు గంటలకు బయలుదేరి, లారీలు ఆపుకుంటూ తిరుపతి చేరేవాడిని. వదిలేసే ముందు రేణిగుంటకు మకాం మార్చాను. కంపోజింగ్ సెక్షనులో అప్పటి నా మిత్రులు వాసుదేవ రావు, లక్ష్మణ రావు, రమణ బాబు, దుర్గా ప్రసాద్, మురళీమోహన రావు, నాయుడు, కృష్ణమూర్తి.... ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో!
On April 2nd 2010 at 6 pm, my father, Sri.C.Subba Rao’s book, “Talks and Articles” was launched at the tastefully decorated Mini Conference Hall in the famous Ravindra Bharathi complex in Hyderabad. Prof.C.Subba Rao, former Chairman of the Council of Higher Education ,the Govt.of Andhra Pradesh, presided over the function. Prof I.V.Chalapathi Rao, former Registrar of the Central Institute of English and Foreign Languages and also Chief Editor of Triveni at present, was the distinguished Chief Guest, who launched the Book. Prof.S.S.Prabhakar Rao, former JNTU professor was the Guest of Honour. I had the privilege and good fortune of sharing the stage with these stalwarts as one of the speakers and as another Guest of Honour (I had written the Foreword for my father’s book). Of course, my father was on the stage immaculately dressed as usual on such formal occasions.
The meeting commenced with an invocation to Lord Ganesha rendered melodiously in the classical style bringing out all the devotional aura of the Sloka by my brother-in-law Sri.Chaitanya.Then came the launching of the book by Prof I.V.Chalapathi Rao.
ఏ సందర్భంలో ఆరుద్రగారు వ్రాసారో కానీ, నానీల పేరుతో ఈమధ్యకాలంలో విశృంఖలంగా వస్తున్న కవితలనబడే సాహిత్యాన్ని చూసినప్పుడల్లా గుర్తొచ్చే పంక్తులవి.
పద్దెనిమిది పేజీలేమో కానీ, పది లైనులు కూడా వ్రాయలేని ప్రబుద్ధులందరూ ఒక ఇమేజరీతో ఒక ప్రకటనతో నాలుగులైనులు గిలికేసి, దాన్నే కవిత్వంగా సరిపుచ్చే ధోరణి ప్రబలిపోతున్నది.
అసలు హైకులు, మినీకవితలు వంటి ప్రక్రియలు ప్రత్యేకించి ఉండగా ఈ నానీలని తవ్వి తలకెత్తుకోవలసిన విశేషం ఏమైఉంటుందనేది ఈ విమర్శనాత్మక వ్యాసపు ప్రధానోద్దేశ్యం.
ఈ వ్యాసానికి ఉపకరించిన పుస్తకం నానీల ఏడవ వార్షికోత్సవం సందర్భంగా నానీల నాన్నగారి (ఈ వ్యాసంలో 'నా.నా. గారూ - ఎన్. గోపి గారు) తొలివారసుడుగా (ఈ వ్యాసంలో నా.వా.గారు) ఎస్. ఆర్.భల్లం గారు సంపుటీకరించిన వ్యాసాల, సమీక్షల, జనవాక్యాల సమ్మేళనం 'నానీల సమాలోచనం' అనే పుస్తకం.
"హైకూలు రాసే కవులు కూడా ఈ నానీని పోటీ కవితా ప్రక్రియగా భావించక, సహృదయతతో అక్కున చేర్చుకొన్నారు" అంటూ నా.వా.గారు వ్రాసిన సంపాదక వాక్యంలోనే నానీ ప్రక్రియకు దోహదంచేసిన కారణాలు అన్యాపదేశంగా ప్రకటీకృతమౌతున్నాయి.
"నానీల కవితా పరివ్యాప్తి" అనే వ్యాసంలో, నా.వా.గారు "హైకు రచన వేరు. నానీ నిర్మాణం వేరు! నానీ నిర్మాణానికి సామాజిక వాస్తవికత గొప్ప ఉత్ప్రేరకం" అంటారు.
అసలు "హైకు" అనేది అనుభవాన్ని అనుభవంగా ప్రకటించే కవితా ప్రక్రియ. అందులోనూ ముఖ్యంగా మార్మికత సంతరించుకున్న తాత్వికత హైకు ప్రక్రియకు జవజీవం. కానీ, ఈ రెంటికి మించి "సామాజికత" నానీలలో ముఖ్యమైన అంశం అని నా.వా.గారి ఉవాచ.
మూడు లైనుల్లో, 17 అక్షారాలలో చెప్పలేని సామాజిక వాస్తవాన్ని, నాలుగు లైనుల్లోను, 25 అక్షరాల నియతితో ఎలా చెప్పగలరని ఈయన ఉద్దేశం? ఇంత చెప్పిన ఈ పెద్దమనిషి తమకు తాము విధించుకున్న నియతిని ఖచ్చితంగా పాటించారా అంటే అదీలేదు. ఈ ఉదాహరణలు చూడండి.
వాడేంటి
ఇన్ని చక్కర్లు కొడుతున్నారు
అవును
వాడిది ఆషాఢభూతి అంశ (26 అక్షరాలు)
రైతుకీ
ధాన్యానికి బంధం తెగిపోయింది
మిల్లులో నలిగేవి
బతుకులు కూడా (27 అక్షరాలు)
మొదటి నానీలో ఏ సామాజికత దీన్ని కవిత్వం చేస్తున్నదో!! అలాగే, రెండో నానీ వార్తాపత్రికలో శీర్షికలా మాత్రమే నాకనిపిస్తున్నది కానీ, కవిత్వమైతే కనిపించటంలేదు.
ఏతావాతా తేలేదేమిటంటే, "సామాజికతను" క్లుప్తంగా కవిత్వంలో చొప్పించటానికి వీరికి ఓ నాలుగుకాళ్ళ వాహనం కావల్సివచ్చింది. దానికీ పాతిక అక్షరాల మెలికతో ఒక తోక.
ఈ పుస్తకంలోనే, డా. తలతోటి పృధ్వీరాజ్ గారు "నానీలు" అనే వ్యాసంలో యశశ్రీ రంగనాయకిగారు చెప్పినట్లుగా ఉటంకించిన వాక్యం చూడండి. "...యోగి వేమన పద్యాలు గన్ షాట్ లు అయితే, ఆ వేమన్న వాదం వినిపించిన గోపిగారి నానీలు పెన్ షాట్ లు".
అసలు విషయాన్ని చాలా చక్కగా వివరించారు ఆ ఒక్క వాక్యంతో. ఈటెల్లాంటి ఆటవెలది పద్యాలతో వేమన స్పృశించని ఏ సామాజిక కోణాన్ని ఈ "నానీ ప్రక్రియ" స్పృశిస్తున్నదో!
ఆ మాటకొస్తే, "ఓ కూనలమ్మా" అనే మకుటాన్ని మినహాయిస్తే, ఆరుద్ర గారు మూడు లైనుల్లో "నానీ"ల కన్నా అద్భుతంగా కూనలమ్మ పదాలు వినిపించారు మరి. నిన్నగాక మొన్న జనార్ధన మహర్షి వ్రాసిన "వెన్నముద్దలు" దాదాపు ఈ కోవలోవే. వీళ్ళెవరూ పనిగట్టుకొని, అవో ప్రత్యేక కవితా రీతిగా దరువులు వేసుకోలేదే!
"ఒక ఉద్వేగభరితమైన నిరంతర సంవేద మూలం" నానీల ఆవిర్భావానికి కారణంగా నా.నా.గారి వివరణ. హైకూలైనా, మినీకవితలైనా, ఆఖరికి విశ్వంభరలాంటి కావ్యాలైనా, ఒకానొక ఉద్వేగం నుంచి జనించినవే. ఆ విషయంలో చిన్నకవులు వ్రాసినా, చితక కవులు వ్రాసినా ఆయా రాతలలో "ఉద్వేగానికి" మినహాయింపు ఉండదు. కాబట్టి, ఆయన నానీల ఆవిర్భావానికి ఇచ్చిన ఈ వివరణ తేలికగా కొట్టిపారేయదగ్గదే.
అసలు హైకు అంటే ఏమిటి?
మూడు పాదాలు ఉంటాయి.
ఒకటి మూడు పాదాలలో అయిదేసి అక్షారాలుంటాయి.
రెండవ పాదంలో ఏడు అక్షరాలుంటాయి.
మొత్తానికి మూడు లైనులతో, పదిహేడు అక్షరాలతో జపనీస్ భాషలో జెన్ బౌద్ధం స్ఫూర్తితో వచ్చిన ప్రక్రియ హైకు.
మన తెలుగు భాషలో ఈ ప్రక్రియలో వ్రాయటంలోని సావకాశం తక్కువే. నాలుగు పాదాలలో అక్షర నియమాన్ని ఉల్లంఘిస్తూ వచ్చిన హైకులు విదేశీ భాషలలోనూ ఉన్నాయి. కాని అర్ధంకాని విషయం ఏమిటంటే, నాలుగు పాదాలు, 25 అక్షరాల వెసులుబాటు కల్పించుకొని, తానేదో కొత్త ప్రక్రియ కనిపెట్టానన్న ఢమరుకపు మోతలెందుకో ఈ నా.నా. గారికి, వారి వారసులకి!!
రెంటికీ చెడ్డ రేవడిలా, అటు హైకులకి ఎక్కువ, ఇటు మినీ కవితలకి తక్కువగా అసంబద్ధంగా నానీ కవిత్వం ఉన్నదనేది నిష్ఠూరమైనా నిజం. చాలా వరకు నానీలు ఉపదేశాలకో, ప్రకటనలకో పరిమితమైపోయాయి.
పిల్లి గుడ్డిదైతే, ఎలుకేదో చేసిందని, తెలుగు సాహితీ విమర్శకులు నానీల విషయంలో మిన్నకుండిపోవటం వల్లనే, ఇప్పుడు నానోల పేరుతో నాలుగు పదాల చిల్లర కొట్టు కవిత్వం విశ్వవ్యాప్తం చేసే ధోరణి మొదలయ్యింది.
ఏదేమైనా, నా.నా.గారు, వారి వారసులు నానీ కవిత్వం విషయంలో, తవ్వి తలకెత్తుకోదగ్గ కొత్త కవితా విశేషమేమీ కనిపెట్టకుండానే డప్పు వాయించుకోవటం విపరీతం!!
నా అభిప్రాయంలో :
ఛందోబంధాలు వద్దు అనుకున్నప్పుడు, దాదాపు అటువంటివే అయిన సరళీకరించబడిన బంధాలు మాత్రం దేనికి? హైకులని చూసి వాత పెట్టుకున్న బంధాలే అవి అని స్పష్టంగా తెలుస్తున్నది.
మకుటం వదిలేస్తే, మూడు పాదాల్లో వేమన వ్రాసిన పద్యాలకు కూడా నానీలు నకలే.
హైకూలనే మరో వాక్యంతో విస్తరింపచేసి, అందులో సామాజికతే ముఖ్యమని మభ్యపెట్టిన పసలేని ప్రయోగమే నానీలు.
నిజానికి, నాలుకు లైనులు కూడా సరిగ్గ వ్రాయలేని ప్రబుద్ధులను కవులుగా చలామణి చేసి, ఆధునిక కవిత్వాన్ని నాలుగు లైనులకు దిగజార్చటంలో నానీల బాధ్యత చాలా వరకు ఉంది.
కవిత్వంలో శైలి పై అలోక్ వాస్తవ్ గారి వ్యాసం ఆవకాయ.కామ్ లో....
"కలౌ దుష్టజనాకీర్ణే" అని "అజ్ఞాన వ్యాకులే లోకే" అని చాలామంది తిట్టిపోస్తుంటారు. మామూలు ప్రపంచం మాటెట్లున్నా ప్రస్తుతం తెలుగునేల్లో ముఖ్యంగా సాహిత్యసీమలో ఈ తిట్లు అక్షర సత్యాలు.
చాలా బ్లాగుల్లో యితరుల రాతల్ని తిట్టిపోసుకొంటూ attacking is the best defense అన్నట్టు తమతమ రాతల్ని కాపాడుకొనే వో విచిత్ర వ్యవహారం ప్రబలిపోయింది. యే ఎడిటరూ అవసరంలేదని, మా బాగోగులు మాకే బాగా తెల్సుననే గదా బ్లాగు ప్రచురణల్ని జేసుకొనేది! పొగిడేస్తే పరమ ఆప్తులు. కొంచెం అటుయిటూ గాక గోడ మీది పిల్లి వ్యాఖ్యలు జేస్తే వాళ్ళు అతిథులు. చెడమడా తిట్టేస్తే సాహిత్య ద్రోహులు. యిల్లా వొహరి రాతల్ని మరొహరు "విమర్శించటం" యే లోకనీతో? ఆయా "విమర్శల్ని" ఖండిస్తూ పేజీల కొద్దీ తిట్లకు లంకించుకోడం యే సత్సాంప్రదాయమో? రాసిన రాతల్లోనే పసలేనప్పుడు వాటిపై వొచ్చే విమర్శలు తిట్లకి యెక్కువ - బూతులకి తక్కువనే జెప్పాలి.
సరే. యీ భేషజాలు పక్కనెట్టి మళ్ళీ కవిత్వం విషయాన్ని జూసినప్పుడు, మొన్న చెప్పుకొన్న కొన్ని సంగతులతోబాటు ఇంకొన్ని జేర్చాలని అనిపించింది.
జాడీలోని ఆవకాయ లాలాజలోత్పత్తికి తొలిమెట్టైతే దుశ్శబ్దపు జాడీల్లోని బూజు భావాలు తిరకాసు కవిత్వానికి ఆఖరి మెట్లుగా మారతాయని జాలం జగ్గేశ పండితుడు రాసిన "నవవర్ణశాల"లో వుంది. ఇదో తిర్యక్ సృష్టిపరిణామక్రమమని, కోతి మనిషిగా మారినట్టుగానే శబ్దం నిశ్శబ్దం కాబోయి దుశ్శబ్దమైందని కూడా జగ్గేశ పండితుడు చెప్పాడు.
మీకు అక్షరాలు వచ్చునా? వాటిల్తో వాక్యాలు రాయడమూ వచ్చునా? "రా! కూర్చో!" అని కాక "కూర్చోడానికి రా!" అని డొంకతిరుగుడుగా చెప్పడం వచ్చునా? అలా కాస్త ముందు కెళ్ళి "కూర్చోడానికి రా! నాలుకపై మైసూర్ పాకులా!" అని చెప్పగలరా"? అక్కడితో ఆగక "కూర్చోడానికి రా! నాలుకపై మైసూర్ పాకులా! నగ్నంగా, నైపుణ్యంగా, వంకరగా, వాలుగా, చేవ్రాలుగా" అని సుత్తికొట్టడం కూడా చేతనౌనా? ఇంకేం మీరు కూడా కవిత్వం రాసేయొచ్చు. గుర్రం కదం తొక్కాలంటే గుగ్గిళ్ళు జోరుగా దట్టించాలి. మీ కలం కదం తొక్కాలంటే బోలెడు పదాల్ని దట్టించాలి.
దళిత కవిత్వం ఉంది. స్త్రీవాద కవిత్వం ఉంది. అభ్యుదయ, విప్లవ కవిత్వాలు కలియుగారంభం నుండీ ఉన్నాయి. ఉన్నవి చాలుననుకొంటే అజీర్ణమని మన తెలుంగుల బాధ. మన ఆకలికి ఈ నాలుగైదు రకాల అరకాసు కవిత్వాలు చాలవుగా! అందుకనే కొత్తవి కనిపెట్టుకొన్నాం. నానీలు వచ్చాయి. కంశ్రీలు వచ్చాయి. నానోలూ వచ్చాయి. ఏకాక్షరాలూ ఊడిపడ్డాయి. వీటికి తోడు నంజుడు కోసమని కధన కవిత్వం, వ్యాస కవిత్వం వంటివి కూడా వచ్చాయి.
అలోక్ వాస్తవ్ గారు వ్రాసిన "కవిత్వం గురించి కొన్ని మాటలు" ఆవకాయలో...
కవిత్వం వొంటరిగా వున్న మనసులో పుట్టుకొచ్చినప్పుడు కవి మాత్రమే దాని సాక్షి. మూగవాడు సాక్ష్యం చెప్పాలంటే యెంత కష్టమో వొంటరితనంలో జరిగిన అంతర్మధనాన్ని బైట ప్రపంచానికి పరిచయం చైడం గూడా అంతే కష్టం. యిల్లా అష్టకష్టాలు పడి జీవితకాలంలో పట్టుమని పది కవితలు రాయడం గొప్ప. గానీ మన తెలుగునేలలో సంవత్సరానికో సంకలనం అదీ కనీసం 50-70 కేకలు పెడబొబ్బల్తో విసర్జించే ఘనాపాఠీలున్నారంటే సదరు కవిత్వం పుట్టుక యెల్లాంటిదో వూహించడం సులువు.
.....
మెప్పుకోసమో, సానుభూతి కోసమో రాసేది కవిత్వం కాలేదు. అరువు దెచ్చుకొన్న ఆవేశాలతో కవితలు పుట్టవు. పెట్టుడు మీసాలు గిన్నీసుబుక్కులోకి యెక్కవు. దుక్కిదున్ని, విత్తు విత్తకండానే సంకలనాల కొద్దీ కవిత్వ వ్యవసాయం జేయడమనేది వో మానసిక రోగం. నిజమైన బాధతో మాట్లాడినప్పుడు పచ్చి తాగుబోతు గూడా కవిత్వంలాంటిదే చెప్తాడు. దానికంటే హీనంగా రాసి కవిత్వమని బుకాయించడం "ఆత్మలోకంలో దివాలా" అనే జెప్పాలి.
"ఎమ్.ఎఫ్. హుస్సేన్ దోహాలో ఉంటే ఎవరికేంటి నష్టం" అని సుప్రీం కోర్ట్ న్యాయమూర్తులు ప్రశ్నించిన తీరు అద్భుతంగా అనిపించింది.
"భారతదేశం గర్వించదగ్గ కలాకారుడైన హుస్సేను"పై దాఖలైన వందకు పైగా కేసుల్ని ఎత్తివేయాలని ఎవడో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్ట్ మొట్టికాయవేసి మోకాలితో తోసి తన్ని అవతల పారేసింది.
ఇంతా జరిగాక ఘనత వహించుకొన్న కొంతమంది మేతావులు విమర్శల గడ్డిపోచల్ని నెమరేయడం ఖాయం. సదరు మేతావుల తోకాత్మలు కొన్ని గిలగిలా కొట్టుకోవడమూ సంభవనీయమే! ఏది ఏమైనా "కామెడీ కేతిగాళ్ళ" సందడి మళ్లీ మొదలౌతుంది.
"జిహాదీ ఉగ్రవాదం కన్నా, నక్సలిజంతోనే దేశానికి అధిక ముప్పు"!
ఎవరో అల్లాటప్పాగాళ్ళు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే, దులుపుకొని వెళ్ళిపోవొచ్చు. తొమ్మిదవ ఇండియా టుడే సదస్సులో సాక్షాత్తు దేశ గృహ మంత్రి పి.చిదంబరం చేసిన వ్యాఖ్య ఇది.
నక్సలైట్ల హింసాకాండను నేను సమర్ధించనూ లేను, నిరసించనూ లేను. సమర్ధించలేకపోవటానికి ప్రధాన కారణం - వీరి వల్ల అన్నెంపున్నెం ఎరుగని అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవటం. నిరసించలేకపోవటానికి కారణం - ప్రజాస్వామ్యం మీద ఏమాత్రమూ నమ్మకంలేని వీరు తమ సిద్ధాంతాలకి అనుగుణంగానే ఆయుధాలు చేపట్టటం. మహాత్ముని వారసులమైనా, హింసలేని ఏ పోరాటమూ మన ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను కదిలించలేదని నమ్ముతాను కనుక.
ఘనత వహించిన మన ప్రజాస్వామ్య దేశంలోని అసమానతలను రూపుమాపటానికి, అన్నిటినీ వొదులుకొని, ఆయుధాలు చేపట్టిన మహామహుల చరిత్ర నక్సల్ ఉద్యమంతో పెనవేసుకుంది. వీరి ప్రధాన శత్రువు రాజ్యం అంటే ప్రభుత్వం. ప్రభుత్వానికి, ప్రభుత్వ యంత్రాంగానికి వ్యతిరేకంగా సాయుధపోరాటం చేస్తున్నారు. వీరి దృష్టిలో వీరి పోరాటపు ఉద్దేశ్యం మన దేశంలోని అణగారిన వర్గాల సంక్షేమం.
మరి జిహాదో! ఇస్లాం పేరిట పరాయి దేశమైన పాకిస్తాన్ మన దేశంలో సృష్టిస్తున్న సంక్షోభం. పాకిస్తాన్ కుట్రలో పాలు పంచుకుంటున్న దేశ విదేశి మతోన్మాదులు - అల్ ఖాయిదా, జైష్-ఎ-మొహమ్మద్, ఇండియన్ ముజాహిదీన్, సిమి. దేశాన్ని అల్లకల్లోలం చేస్తూ, ప్రజల ప్రాణాలకు విలువలేకుండా చేసిన ఈ దుర్మార్గులు మాత్రం మన ప్రభుత్వాలకు మానసపుత్రులు.!
పట్టుబడిన నక్సలైట్లను మాత్రం ఎన్ కౌంటర్ పేరిట చంపేసే దమ్మున్న ప్రజాస్వామ్యం మనది. పట్టుబడ్డ తీవ్రవాదులకు, ఉరిశిక్ష పడ్డ తీవ్రవాదులకు రాచమర్యాదలు చేస్తూ, శిక్షించాలా వద్దా అని ఏళ్ళ తరబడి తాత్సారం చేసే ప్రజాస్వామ్యం కూడా మనదే!
మతం పేరుతో ప్రజల ప్రాణాలను హరిస్తున్న జిహాదీ ఉగ్రవాదులతో పోలిస్తే, ప్రజల కోసం అన్నిటినీ వదులుకొని, ప్రాణాలు కూడా పణం పెట్టే నక్సలైట్లు దైవ సమానులు.
ఎన్ కౌంటర్ లో మృతి చెందిన శాఖమూరి అప్పారావు తదితర నక్సలైట్ల ఆత్మ శాంతి కోసం ఈ కవిత. శాఖమూరికి ఈ కవిత నిజమైన నివాళి. ఎందుకంటే, ఈ కవితలో నేను వ్యతిరేకించినట్లుగానే, ఆరేళ్ళ క్రితం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలను వ్యతిరేకించాడు శాఖమూరి అప్పారావు.
గుత్తికొండ బిలం
మట్టిలో కాదు
నెత్తురులో జన్మించాను
మట్టిలో కాదు
నెత్తురోడుతూ మరణిస్తాను.
ఘనీభవించిన కన్నీటికి
నెత్తురిచ్చిన రూపం నాది
గుట్టలుగా కాల్చబడ్డ
రుధిరజ్యోత్స్నల తేజం నాది
మూడున్నర దశాబ్దాల
నిర్బంధానికి, నిషేధానికి
ఊపిరి బిగపట్టుకున్న
గుత్తికొండ బిలాన్ని.
మరతుపాకుల మోతకి
కాలి గజ్జెలు ఘల్లుమంటాయి
ఎన్ కౌంటర్ తూటాని
గుండె కదుముకుంటాను.
చిడతల కామెడీ స్వాముల వారు దేవతల నగ్న విగ్రహాల ఫొటోలను తమ బ్లాగులో ప్రదర్శనకు పెట్టారు. స్వామివారి ఉద్దేశ్యం "దేవతలను నగ్నంగా చిత్రించడం హిందు సాంప్రదాయం కాదంటున్న మూఢులకు జ్ఞానబోధ కాకపోయినా, మరికొందరు మూఢులుగా తయారు కాకుండ ఉండటానికి" ఈ ప్రదర్శన ఏర్పాటు చేసారు.
నిజానికి అయ్యవారి అసలు ఉద్దేశ్యం వేరు. హుస్సేన్ గాడు చేసింది తప్పు అనేవారు, హిందు సాంప్రదాయాన్ని కూడా తప్పు అనాలి. లేదా, అది హిందు సాంప్రదాయమే అనేట్లయితే, హుస్సేన్ గాడిని అక్కున చేర్చుకోవాలి, లాలించాలి, బుజ్జగించాలి. మానసిక పరిపక్వత లేని పరిస్థితుల్లో ఇటువంటి "చీప్ ట్రిక్సు"కు పాల్పడతారు ఈ దొంగ స్వాములు.
ఏతావాతా, కామెడీ స్వామి వారు తీర్మానించిన విషయం దేవతలని నగ్నంగా చిత్రించటం హిందు సాంప్రదాయం అని. అయ్యా, ఏ ఆగమ, వాస్తు శాస్త్రాల ప్రకారం దేవతా విగ్రహాలను, దేవాలయాల గోడలపై బొమ్మలను నగ్నంగా చిత్రించాలని ఉందో చెబితే సంతోషిస్తాం.
నాకు తెలిసీ, ఆయా కాలాలలోని సామాజిక పరిస్థితుల కనుగుణంగాను, ఆయా రాజుల, శిల్పకళాకారుల, ఆగమశాస్త్ర నిపుణుల ఆధ్యాత్మిక పరిణతికి అనుగుణంగాను, ఆయా దేవాలయాలను నిర్మించాలనుకున్న "థీం"కు అనుగుణంగాను అవి నిర్మించబడ్డాయి. నగ్న విగ్రహాలే ఉండి తీరలన్న సాంప్రదాయమనేది ఉండి ఉంటే, దేశంలోని అన్ని దేవాలయాలలోనూ ఇదే పరిస్థితి ఉండాలే!
అయోధ్యలోని రామ మందిరమే కాదు, దేశంలోని ఏ రాములవారి గుడి అయినా, హనుమంతులవారి గుడిలోనైనా, సీతారాముల, హనుమంతులవారి విగ్రహాలు నగ్నంగా ఉండవు. మరి హుస్సేన్ గాడు చిత్రించిన సీత, హనుమంతులవారి నగ్న చిత్రాలకు ఆధారం ఏమిటి? ఇక "లజ్జ గౌరి" లాంటి తీవ్ర దేవతలకు, మన ప్రాంతాలలోని గ్రామ దేవతలకు సంబంధించిన విషయాలు వేరు. అవి అర్ధం కావాలంటే, కొద్దిగానైనా మంత్ర, తంత్ర పరిజ్ఞానం అవసరం.
చెప్పొచ్చేదేమిటంటే, ఈ హుస్సేన్ గాడికి అంత సృజనశీలత ఏమీ లేదు. కేవలం హిందువుల మనోభావాలు గాయపరచటానికి, విదేశాలలో భారత పురాణేతిహాసాల దేవతల చిత్రాలు అమ్ముకోటానికి మాత్రమే నగ్నత్వం కావల్సి వచ్చింది. వాడి అమ్మనో, అయ్యనో, పెళ్ళాం పిల్లలనో నగ్నంగా చిత్రిస్తే కొనేవాడు ఎవడు?
ప్రజల మధ్య అగాధాలు సృష్టించే హుస్సేన్ గాడిలాంటివాళ్ళను అడ్డుకోకపోతే, అహంకారం తప్పించి అణుమాత్రమైనా ఆలోచన లేని కామెడీ మూఢ స్వాముల ఆసరాతో, రేపు మరో దావూద్ ఇబ్రహిం బయలుదేరతాడు. సుప్రభాతాలు, సహస్రనామాలు బూతు మయం, నేను వ్రాసే బూతు పాటలతో పూజలు చేసుకొమ్మంటాడు. అటువంటి ఉపద్రవాలు రాకుండా, ప్రజల మధ్య విద్వేషాలు పొడచూపకుండా ఉండాలంటే, దేశద్రోహులైన కేతిగాళ్ళకు ప్రభుత్వం పగ్గాలు వేయాలి.
ఆవిషయంపక్కనపెట్టి, స్థూలంగా "చివరికిమిగిలేది" ఒకకథలామాత్రమేపరిగణించిపరికిస్తే, కథనంలో కవిత్వాత్మకవచనం, ఆత్మసంశోధనా, సంవేదనభరితమైనకొన్నిరసవత్తరఘట్టాలుతప్పించి, ఓ సామాన్యమైన కథే కనిపిస్తుంది. "కన్యాశుల్కం" లాంటిరచనలతోపోలిస్తే, అక్కడక్కడస్త్రీస్వామ్య భావజాలాన్నిప్రదర్శించటంతప్పించి, ప్రత్యేకించిఎన్నదగ్గసామాజికవిలువలుకూడాలేవు.
చెప్పుకోదగ్గంతగాలేనిసామాజికవిలువలకారణంగాఈపుస్తకానికిపట్టంకట్టలేనిపరిస్థితిఒకవైపైతే, పేలవమైనకథ కారణంగా, కథనంలోనిఅద్భుతమైనసాహితీవిలువలకుపట్టంకట్టలేనిదుస్థితిమరోవైపు. నాఆక్రోశంకూడాఅదే!