"ఎమ్.ఎఫ్. హుస్సేన్ దోహాలో ఉంటే ఎవరికేంటి నష్టం" అని సుప్రీం కోర్ట్ న్యాయమూర్తులు ప్రశ్నించిన తీరు అద్భుతంగా అనిపించింది.
"భారతదేశం గర్వించదగ్గ కలాకారుడైన హుస్సేను"పై దాఖలైన వందకు పైగా కేసుల్ని ఎత్తివేయాలని ఎవడో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్ట్ మొట్టికాయవేసి మోకాలితో తోసి తన్ని అవతల పారేసింది.
ఇంతా జరిగాక ఘనత వహించుకొన్న కొంతమంది మేతావులు విమర్శల గడ్డిపోచల్ని నెమరేయడం ఖాయం. సదరు మేతావుల తోకాత్మలు కొన్ని గిలగిలా కొట్టుకోవడమూ సంభవనీయమే! ఏది ఏమైనా "కామెడీ కేతిగాళ్ళ" సందడి మళ్లీ మొదలౌతుంది.
"జిహాదీ ఉగ్రవాదం కన్నా, నక్సలిజంతోనే దేశానికి అధిక ముప్పు"!
ఎవరో అల్లాటప్పాగాళ్ళు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే, దులుపుకొని వెళ్ళిపోవొచ్చు. తొమ్మిదవ ఇండియా టుడే సదస్సులో సాక్షాత్తు దేశ గృహ మంత్రి పి.చిదంబరం చేసిన వ్యాఖ్య ఇది.
నక్సలైట్ల హింసాకాండను నేను సమర్ధించనూ లేను, నిరసించనూ లేను. సమర్ధించలేకపోవటానికి ప్రధాన కారణం - వీరి వల్ల అన్నెంపున్నెం ఎరుగని అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవటం. నిరసించలేకపోవటానికి కారణం - ప్రజాస్వామ్యం మీద ఏమాత్రమూ నమ్మకంలేని వీరు తమ సిద్ధాంతాలకి అనుగుణంగానే ఆయుధాలు చేపట్టటం. మహాత్ముని వారసులమైనా, హింసలేని ఏ పోరాటమూ మన ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను కదిలించలేదని నమ్ముతాను కనుక.
ఘనత వహించిన మన ప్రజాస్వామ్య దేశంలోని అసమానతలను రూపుమాపటానికి, అన్నిటినీ వొదులుకొని, ఆయుధాలు చేపట్టిన మహామహుల చరిత్ర నక్సల్ ఉద్యమంతో పెనవేసుకుంది. వీరి ప్రధాన శత్రువు రాజ్యం అంటే ప్రభుత్వం. ప్రభుత్వానికి, ప్రభుత్వ యంత్రాంగానికి వ్యతిరేకంగా సాయుధపోరాటం చేస్తున్నారు. వీరి దృష్టిలో వీరి పోరాటపు ఉద్దేశ్యం మన దేశంలోని అణగారిన వర్గాల సంక్షేమం.
మరి జిహాదో! ఇస్లాం పేరిట పరాయి దేశమైన పాకిస్తాన్ మన దేశంలో సృష్టిస్తున్న సంక్షోభం. పాకిస్తాన్ కుట్రలో పాలు పంచుకుంటున్న దేశ విదేశి మతోన్మాదులు - అల్ ఖాయిదా, జైష్-ఎ-మొహమ్మద్, ఇండియన్ ముజాహిదీన్, సిమి. దేశాన్ని అల్లకల్లోలం చేస్తూ, ప్రజల ప్రాణాలకు విలువలేకుండా చేసిన ఈ దుర్మార్గులు మాత్రం మన ప్రభుత్వాలకు మానసపుత్రులు.!
పట్టుబడిన నక్సలైట్లను మాత్రం ఎన్ కౌంటర్ పేరిట చంపేసే దమ్మున్న ప్రజాస్వామ్యం మనది. పట్టుబడ్డ తీవ్రవాదులకు, ఉరిశిక్ష పడ్డ తీవ్రవాదులకు రాచమర్యాదలు చేస్తూ, శిక్షించాలా వద్దా అని ఏళ్ళ తరబడి తాత్సారం చేసే ప్రజాస్వామ్యం కూడా మనదే!
మతం పేరుతో ప్రజల ప్రాణాలను హరిస్తున్న జిహాదీ ఉగ్రవాదులతో పోలిస్తే, ప్రజల కోసం అన్నిటినీ వదులుకొని, ప్రాణాలు కూడా పణం పెట్టే నక్సలైట్లు దైవ సమానులు.
ఎన్ కౌంటర్ లో మృతి చెందిన శాఖమూరి అప్పారావు తదితర నక్సలైట్ల ఆత్మ శాంతి కోసం ఈ కవిత. శాఖమూరికి ఈ కవిత నిజమైన నివాళి. ఎందుకంటే, ఈ కవితలో నేను వ్యతిరేకించినట్లుగానే, ఆరేళ్ళ క్రితం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలను వ్యతిరేకించాడు శాఖమూరి అప్పారావు.
గుత్తికొండ బిలం
మట్టిలో కాదు
నెత్తురులో జన్మించాను
మట్టిలో కాదు
నెత్తురోడుతూ మరణిస్తాను.
ఘనీభవించిన కన్నీటికి
నెత్తురిచ్చిన రూపం నాది
గుట్టలుగా కాల్చబడ్డ
రుధిరజ్యోత్స్నల తేజం నాది
మూడున్నర దశాబ్దాల
నిర్బంధానికి, నిషేధానికి
ఊపిరి బిగపట్టుకున్న
గుత్తికొండ బిలాన్ని.
మరతుపాకుల మోతకి
కాలి గజ్జెలు ఘల్లుమంటాయి
ఎన్ కౌంటర్ తూటాని
గుండె కదుముకుంటాను.
చిడతల కామెడీ స్వాముల వారు దేవతల నగ్న విగ్రహాల ఫొటోలను తమ బ్లాగులో ప్రదర్శనకు పెట్టారు. స్వామివారి ఉద్దేశ్యం "దేవతలను నగ్నంగా చిత్రించడం హిందు సాంప్రదాయం కాదంటున్న మూఢులకు జ్ఞానబోధ కాకపోయినా, మరికొందరు మూఢులుగా తయారు కాకుండ ఉండటానికి" ఈ ప్రదర్శన ఏర్పాటు చేసారు.
నిజానికి అయ్యవారి అసలు ఉద్దేశ్యం వేరు. హుస్సేన్ గాడు చేసింది తప్పు అనేవారు, హిందు సాంప్రదాయాన్ని కూడా తప్పు అనాలి. లేదా, అది హిందు సాంప్రదాయమే అనేట్లయితే, హుస్సేన్ గాడిని అక్కున చేర్చుకోవాలి, లాలించాలి, బుజ్జగించాలి. మానసిక పరిపక్వత లేని పరిస్థితుల్లో ఇటువంటి "చీప్ ట్రిక్సు"కు పాల్పడతారు ఈ దొంగ స్వాములు.
ఏతావాతా, కామెడీ స్వామి వారు తీర్మానించిన విషయం దేవతలని నగ్నంగా చిత్రించటం హిందు సాంప్రదాయం అని. అయ్యా, ఏ ఆగమ, వాస్తు శాస్త్రాల ప్రకారం దేవతా విగ్రహాలను, దేవాలయాల గోడలపై బొమ్మలను నగ్నంగా చిత్రించాలని ఉందో చెబితే సంతోషిస్తాం.
నాకు తెలిసీ, ఆయా కాలాలలోని సామాజిక పరిస్థితుల కనుగుణంగాను, ఆయా రాజుల, శిల్పకళాకారుల, ఆగమశాస్త్ర నిపుణుల ఆధ్యాత్మిక పరిణతికి అనుగుణంగాను, ఆయా దేవాలయాలను నిర్మించాలనుకున్న "థీం"కు అనుగుణంగాను అవి నిర్మించబడ్డాయి. నగ్న విగ్రహాలే ఉండి తీరలన్న సాంప్రదాయమనేది ఉండి ఉంటే, దేశంలోని అన్ని దేవాలయాలలోనూ ఇదే పరిస్థితి ఉండాలే!
అయోధ్యలోని రామ మందిరమే కాదు, దేశంలోని ఏ రాములవారి గుడి అయినా, హనుమంతులవారి గుడిలోనైనా, సీతారాముల, హనుమంతులవారి విగ్రహాలు నగ్నంగా ఉండవు. మరి హుస్సేన్ గాడు చిత్రించిన సీత, హనుమంతులవారి నగ్న చిత్రాలకు ఆధారం ఏమిటి? ఇక "లజ్జ గౌరి" లాంటి తీవ్ర దేవతలకు, మన ప్రాంతాలలోని గ్రామ దేవతలకు సంబంధించిన విషయాలు వేరు. అవి అర్ధం కావాలంటే, కొద్దిగానైనా మంత్ర, తంత్ర పరిజ్ఞానం అవసరం.
చెప్పొచ్చేదేమిటంటే, ఈ హుస్సేన్ గాడికి అంత సృజనశీలత ఏమీ లేదు. కేవలం హిందువుల మనోభావాలు గాయపరచటానికి, విదేశాలలో భారత పురాణేతిహాసాల దేవతల చిత్రాలు అమ్ముకోటానికి మాత్రమే నగ్నత్వం కావల్సి వచ్చింది. వాడి అమ్మనో, అయ్యనో, పెళ్ళాం పిల్లలనో నగ్నంగా చిత్రిస్తే కొనేవాడు ఎవడు?
ప్రజల మధ్య అగాధాలు సృష్టించే హుస్సేన్ గాడిలాంటివాళ్ళను అడ్డుకోకపోతే, అహంకారం తప్పించి అణుమాత్రమైనా ఆలోచన లేని కామెడీ మూఢ స్వాముల ఆసరాతో, రేపు మరో దావూద్ ఇబ్రహిం బయలుదేరతాడు. సుప్రభాతాలు, సహస్రనామాలు బూతు మయం, నేను వ్రాసే బూతు పాటలతో పూజలు చేసుకొమ్మంటాడు. అటువంటి ఉపద్రవాలు రాకుండా, ప్రజల మధ్య విద్వేషాలు పొడచూపకుండా ఉండాలంటే, దేశద్రోహులైన కేతిగాళ్ళకు ప్రభుత్వం పగ్గాలు వేయాలి.
ఆవిషయంపక్కనపెట్టి, స్థూలంగా "చివరికిమిగిలేది" ఒకకథలామాత్రమేపరిగణించిపరికిస్తే, కథనంలో కవిత్వాత్మకవచనం, ఆత్మసంశోధనా, సంవేదనభరితమైనకొన్నిరసవత్తరఘట్టాలుతప్పించి, ఓ సామాన్యమైన కథే కనిపిస్తుంది. "కన్యాశుల్కం" లాంటిరచనలతోపోలిస్తే, అక్కడక్కడస్త్రీస్వామ్య భావజాలాన్నిప్రదర్శించటంతప్పించి, ప్రత్యేకించిఎన్నదగ్గసామాజికవిలువలుకూడాలేవు.
చెప్పుకోదగ్గంతగాలేనిసామాజికవిలువలకారణంగాఈపుస్తకానికిపట్టంకట్టలేనిపరిస్థితిఒకవైపైతే, పేలవమైనకథ కారణంగా, కథనంలోనిఅద్భుతమైనసాహితీవిలువలకుపట్టంకట్టలేనిదుస్థితిమరోవైపు. నాఆక్రోశంకూడాఅదే!
కాటికి పోవాల్సిన కామెడీ హుస్సేన్, కతర్ కు పోయాడట. మొత్తానికి ముంబాయిలో తంతే, కతర్ లో వెళ్ళి పడ్డాడు - భారతదేశ లౌకిక ప్రజా"స్వాముల" కళా సామ్రాట్ - మక్బూల్ ఫిదా హుస్సేన్. 95 సంవత్సరాల పండు వయసులో అష్టకష్టాలు పడుతూ దేశంకాని దేశంలో తలదాచుకోవాల్సి రావటం సామాన్య భారతీయులందరినీ కలచివేస్తున్నదట! అంతర్జాతీయంగా భారత్ కు అప్రదిష్ట కలిగించిన పరిణామంగా కూడా పేర్కొన్నారు సంభాషణ అనే బ్లాగు రచయిత.
"ఒకరు ఒక రచయితను, మరొకరు మరో రచయితను నిషేధించడమో, ప్రవాసంలోకో, నిర్బంధంలోకో పంపడం చేస్తూ పోతే - చివరకు సమాజంలో భావ ప్రకటనే ఉండదు" అంటారు ఈ బ్లాగరు.
మన ప్రజాస్వామ్య దేశంలో ఉన్న వాక్స్వాతంత్ర్యం, భావప్రకటనా స్వేచ్ఛకు ప్రజలు (ముఖ్యంగా హిందువులు) కట్టుబడి ఉన్న కారణంగానే, నిన్న మొన్నటి వరకు ఎమ్మెఫ్ హుస్సేన్ భారత్ లో ఉండ గలిగాడు. హద్దులు మీరిన స్వాతంత్ర్యం, అడ్డగోలు స్వేచ్ఛ పుచ్చుకోవాలని ప్రయత్నించి చేతులు కాల్చుకున్నది హుస్సేనే. దేశంలోని మెజారిటీ ప్రజల భావోద్వేగాలను ఛీత్కరిస్తూ, హిందు దేవతల, దేవుళ్ళ చిత్రాలను నగ్నంగా చిత్రించటమే కాకుండా, దేశ ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నించిన ఇటువంటి దేశద్రోహులు పరాయిదేశంలో స్థిరపడితే, హిందు దేశానికి వచ్చిన నష్టమేమీ లేదు.
హిందువుల సహనానికి పరీక్ష పెట్టే, కుహానా లౌకికవాదులు హిందు దేవతలను నగ్నంగా చిత్రించినప్పుడు హుస్సేన్ ను అధిక్షేపించలేదే? ఆ పని చేసిన హిందువులను మాత్రం మతవాదులుగా చిత్రీకరించటంలోని ఔచిత్యం ఏమిటి? మహమ్మద్ ప్రవక్తను నగ్నంగా చిత్రించగలడా ఈ హుస్సేన్? తన భార్యల పొందులో కేరింతలు కొట్టే మహమ్మద్ ప్రవక్త కేళీ విలాసాన్ని నగ్నంగా చిత్రించగలడా ఈ హుస్సేన్? తన మతానికో రూలు, పక్క మతానికో రూలూనా? ఇకపైగా, ఇది భావ ప్రకటనా స్వేచ్ఛా! చదువుకున్నవాళ్ళే, కళ్ళు మూసుకొని కబోదులుగా నటిస్తూ, తమను తాము లౌకిక ప్రజాస్వామ్యవాదులుగా పరిగణించుకోవటం "మహా కామెడీ". అది ఈ దేశంలోనే సాధ్యం.
మన పురాణాలను, పురాణ పాత్రలను "సి" గ్రేడు స్థాయికి దిగజార్చి చేసే రచనలకు సాహిత్య అకాడమీ అవార్డులు ఇస్తాం. వావి వరసలు లేకుండా దేవుళ్ళను, దేవతలను నగ్నంగాను, అనౌచిత్యంగాను చిత్రించే వాడికోసం కన్నీళ్ళు కారుస్తాం. ఓ కమర్షియల్ పెయింటరుకు, దలైలామాకు పోలిక పెట్టి, మన మీద మనం ఉమ్మేసుకుంటాం. పడ్డవాడికి లౌకిక స్ఫూర్తి లేదంటాం, చెడ్డవాడిని నెత్తిన పెట్టుకుంటాం. ఒక్కసారి, అద్దంలో తమ ముఖాన్ని తాము చూసుకుంటూ, తమను తాము నిజాయితీగా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఈ "లౌకిక ప్రజాస్వామ్యవాదులకు" ఉంది.
ఆ బ్లాగు రచయిత ఇంకా అంటారు "భావప్రకటనాస్వేచ్ఛ అంటే ఎవరైనా ఏదైనా రాయవచ్చునని కాదు. కానీ, రచనారంగంలో ఉన్నవారిని కట్టడి చేయడానికి మంచి మార్గంలో పెట్టడానికి రచనారంగానికి సంబంధించిన పోరాటరూపాలనే ఎంచుకోవాలి. విమర్శను విమర్శతో ఎదుర్కొనాలి. రచయితలు కూడా సందర్భాన్ని గుర్తెరిగి, సున్నితత్వాలను పరిగణనలోనికి తీసుకుని వ్యవహరించాలి. ఎవరైనా హద్దు మీరిన ట్టు భావిస్తే, దాన్ని అదే పాఠకుల మధ్య ఎంతటి తీవ్రమైన విమర్శ ద్వారానైనా పూర్వపక్షం చేయవచ్చు. ఆరోగ్యకరమైన, పరిణతి చెందిన ప్రజాస్వా మ్యం లక్షణం అది.”
అయ్యా, మీరు చెప్పిన ప్రజాస్వామ్య లక్షణాలలో భాగంగానే, హుస్సేన్ మీద కేసులు వేయటం జరిగింది. ఆ కేసులు ఇంకా నడుస్తుండగానే, దేశం విడిచి పారిపోయిన వ్యక్తిని మీరు వెనకేసుకు రావటంలో అర్ధం లేదు. నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రదర్శించే వ్యక్తి అయితే, ఆ కేసులు పూర్తయ్యేదాకా ఇక్కడే ఉండేవాడు. కనీసం, చేసిన తప్పుకు క్షమాపణ చెప్పేవాడు. ఇవేమీ చేయకుండా, దుబాయికి పారిపోయాడంటేనే తెలుస్తుంది వాడు ఎంత క్రిమినల్ అనే విషయం.
పక్కవాడి స్వేచ్ఛకు విఘాతం కలిగించనంతవరకు మాత్రమే, మన స్వేచ్ఛ ఉంటుందని గ్రహించలేని వ్యక్తి కోసం మీరు అన్నేసి కన్నీళ్ళు పారబోసుకోవాల్సిన అవసరం లేదు. విమర్శనాత్మక విచక్షణా జ్ఞానం కలిగి ఉండాలని ఆదేశ సూత్రాలలో చెప్పిన విషయాన్ని తుంగలో తొక్కే హుస్సేన్ లాంటి దుర్మార్గులకు నిజానికి దేశంలోనే ఉరిశిక్ష పడి ఉండాల్సింది. కనీసం ఈరకంగా బహిష్కరింపబడినందుకు సంతోషం.