Thursday, September 9, 2010
సామాన్యుల పోరాటం కాదిది, మేధావుల పోరాటం - దళిత తీవ్రవాదం
Tuesday, July 27, 2010
బాబ్లీ రాజకీయాల్లో పిడకల వేట
Friday, July 16, 2010
సోంపేట స్ఫూర్తి
Saturday, March 13, 2010
జిహాదీల కన్నా, నక్సల్స్ తోనే ప్రమాదమా!
ఎవరో అల్లాటప్పాగాళ్ళు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే, దులుపుకొని వెళ్ళిపోవొచ్చు. తొమ్మిదవ ఇండియా టుడే సదస్సులో సాక్షాత్తు దేశ గృహ మంత్రి పి.చిదంబరం చేసిన వ్యాఖ్య ఇది.
నక్సలైట్ల హింసాకాండను నేను సమర్ధించనూ లేను, నిరసించనూ లేను. సమర్ధించలేకపోవటానికి ప్రధాన కారణం - వీరి వల్ల అన్నెంపున్నెం ఎరుగని అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవటం. నిరసించలేకపోవటానికి కారణం - ప్రజాస్వామ్యం మీద ఏమాత్రమూ నమ్మకంలేని వీరు తమ సిద్ధాంతాలకి అనుగుణంగానే ఆయుధాలు చేపట్టటం. మహాత్ముని వారసులమైనా, హింసలేని ఏ పోరాటమూ మన ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను కదిలించలేదని నమ్ముతాను కనుక.
ఘనత వహించిన మన ప్రజాస్వామ్య దేశంలోని అసమానతలను రూపుమాపటానికి, అన్నిటినీ వొదులుకొని, ఆయుధాలు చేపట్టిన మహామహుల చరిత్ర నక్సల్ ఉద్యమంతో పెనవేసుకుంది. వీరి ప్రధాన శత్రువు రాజ్యం అంటే ప్రభుత్వం. ప్రభుత్వానికి, ప్రభుత్వ యంత్రాంగానికి వ్యతిరేకంగా సాయుధపోరాటం చేస్తున్నారు. వీరి దృష్టిలో వీరి పోరాటపు ఉద్దేశ్యం మన దేశంలోని అణగారిన వర్గాల సంక్షేమం.
మరి జిహాదో! ఇస్లాం పేరిట పరాయి దేశమైన పాకిస్తాన్ మన దేశంలో సృష్టిస్తున్న సంక్షోభం. పాకిస్తాన్ కుట్రలో పాలు పంచుకుంటున్న దేశ విదేశి మతోన్మాదులు - అల్ ఖాయిదా, జైష్-ఎ-మొహమ్మద్, ఇండియన్ ముజాహిదీన్, సిమి. దేశాన్ని అల్లకల్లోలం చేస్తూ, ప్రజల ప్రాణాలకు విలువలేకుండా చేసిన ఈ దుర్మార్గులు మాత్రం మన ప్రభుత్వాలకు మానసపుత్రులు.!
పట్టుబడిన నక్సలైట్లను మాత్రం ఎన్ కౌంటర్ పేరిట చంపేసే దమ్మున్న ప్రజాస్వామ్యం మనది. పట్టుబడ్డ తీవ్రవాదులకు, ఉరిశిక్ష పడ్డ తీవ్రవాదులకు రాచమర్యాదలు చేస్తూ, శిక్షించాలా వద్దా అని ఏళ్ళ తరబడి తాత్సారం చేసే ప్రజాస్వామ్యం కూడా మనదే!
మతం పేరుతో ప్రజల ప్రాణాలను హరిస్తున్న జిహాదీ ఉగ్రవాదులతో పోలిస్తే, ప్రజల కోసం అన్నిటినీ వదులుకొని, ప్రాణాలు కూడా పణం పెట్టే నక్సలైట్లు దైవ సమానులు.
ఎన్ కౌంటర్ లో మృతి చెందిన శాఖమూరి అప్పారావు తదితర నక్సలైట్ల ఆత్మ శాంతి కోసం ఈ కవిత. శాఖమూరికి ఈ కవిత నిజమైన నివాళి. ఎందుకంటే, ఈ కవితలో నేను వ్యతిరేకించినట్లుగానే, ఆరేళ్ళ క్రితం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలను వ్యతిరేకించాడు శాఖమూరి అప్పారావు.
నెత్తురులో జన్మించాను
మట్టిలో కాదు
నెత్తురోడుతూ మరణిస్తాను.
ఘనీభవించిన కన్నీటికి
నెత్తురిచ్చిన రూపం నాది
గుట్టలుగా కాల్చబడ్డ
రుధిరజ్యోత్స్నల తేజం నాది
మూడున్నర దశాబ్దాల
నిర్బంధానికి, నిషేధానికి
ఊపిరి బిగపట్టుకున్న
గుత్తికొండ బిలాన్ని.
మరతుపాకుల మోతకి
కాలి గజ్జెలు ఘల్లుమంటాయి
ఎన్ కౌంటర్ తూటాని
గుండె కదుముకుంటాను.
సమాజసేద్యానికి
పేగులు తెంచుకొని
పిడికిలి బిగించిన
కొమరయ్యలు, మజుందార్లు
కామ్రెడ్లు, ఆశయాలు
చదును చేయని గతం పొరలు
చీల్చుకొచ్చిన కలుపు మొక్కలు
మంత్రులు, భూస్వాములు
అధికారాలు, అవకాశాలు
ఆకాశానికి, పాతాళానికి
మధ్యనున్న అగాథాలు...
అవి పూడ్చేటందుకు
అధికారిక చర్చలు!!
విప్లవానికి జోలపాటలా?
ఉక్కుశాసనాల
కరకు మోసమా??
నిదురపోని గతం నాది
నిదురలేని స్వప్నం నాది
ఎదిరించే నైజం నాది
ఎదురులేని నిజం నాది
మట్టిలో కలిసిపోని
ఒకేఒక్క ఇజం నాది
నెత్తురులో ఈదుతున్న
నక్సలిజం నాది.
Wednesday, March 3, 2010
కామెడీ హుస్సేన్ కోసం కన్నీళ్ళు దేనికి?
Monday, February 15, 2010
రామ రామ... గొల్లపూడి గారు ఆఖరికి మీరు కూడా....!
గొల్లపూడిగారు విస్మరించిన ఓ రెండు ముఖ్యమైన విషయాలు :
1. ఐ.పి.ఎల్. లో కోల్కతా నైట్ రైడర్సుకు షారూఖ్ ఓనరు. మై నెమీజ్ ఖాన్ విడుదలకు కొద్ది రోజుల ముందుగా జరిగిన క్రీడాకారుల వేలంపాటలో, పల్లెత్తి ఒక్కసారైనా పాకిస్తాన్ క్రీడాకారులు కావాలని కోరని వ్యక్తి, సినిమా విడుదలకు ముందు, భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు పెరగాలంటే, పాకిస్తాన్ క్రీడాకారులను ఐ.పి.ఎల్. లో ఆడించాలని చెప్పాడు. దీని వెనుక మర్మమేమిటో అర్ధం చేసుకోలేని అమాయకులు ఎవరైనా ఉంటారా? మీరు ఏ లోకంలో, ఏ కాలంలో ఉన్నారు గొల్లపూడి గారు?
2. కొన్ని నెలల క్రితం, ఆ సినిమా షూటింగు జరుగుతున్నప్పుడే, తన పేరు చివర ఖాన్ అని ఉన్నదన్న నెపంతోనే, అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు తనను రెండు గంటలపాటు అమెరికాలోని ఓ విమానాశ్రయంలో నిర్బంధించారని ఆరోపిస్తూ, ఈ సినిమా ప్రచారానికి ఆనాడే తెర లేపాడు షారూఖ్. ఈ విషయం కూడా మీరు మర్చిపోయినట్లున్నారు.
* * *
ఇకపైగా, అసలు విషయాన్ని అడుసులో తొక్కి, బాల్ థాక్రేపై కాళ్ళు కడుక్కున్న గొల్లపూడి గారి తీరు గర్హనీయం. ముంబాయిపై తీవ్రవాదుల దాడి జరిగి గట్టిగా సంవత్సరం కాలేదు. దాడి జరిగిన వెనువెంటనే, పాకిస్తాన్ తో అన్ని సంబంధాలను తిరస్కరించిన భారత ప్రభుత్వం, ఒక సంవత్సరంలోగా, పాకిస్తాన్ ఎలాంటి సకారాత్మక ధోరణి కనబరచిందని, మళ్ళీ చర్చలకు పూనుకున్నదని ప్రశ్నించరే?
గత సంవత్సర కాలంలో, భారత పాకిస్తాన్ ల సంబంధ బాంధవ్యాలను షారూఖ్ ఏరకంగా ఉద్ధరించిందీ ప్రశ్నించరే?
గత ఆరు దశాబ్దాలుగా, క్రీడా సాంస్కృతిక రంగాల ఆసరాతో, ఇరు దేశాల మధ్య సంబంధాల పటిష్టతకు భారత్ చేయనిదేమిటి? దానికి ప్రతిఫలంగా పాకిస్తాన్ మనకు ఇచ్చిందేమిటి అన్న విషయాన్ని ఎందుకు విస్మరించారు?
బాధ్యతాయుతంగా మెలగాల్సిన వ్యక్తులు, సంకుచిత వ్యాపార దృక్ఫధంతో చేసే ఇటువంటి వ్యాఖ్యల వల్ల, ఆవేశాలు పెచ్చరిల్లే ప్రమాదమొకటైతే, గొల్లపూడి గారి లాంటి జ్ఞానవృద్ధులు (వ్యంగ్యం ఏమాత్రమూ లేదు) కూడా ఇటువంటి మాయ మాటల వలలో పడి, అసలు విషయాన్ని విస్మరించే ప్రమాదం కూడా ఉంటుందని నిరూపితమయ్యింది.
గొల్లపూడి గారు ఆఖరికి మీరు కూడా ....ఇలా కామెడీ చేస్తే ఎలా?
ఈ మొత్తం వ్యవహారంతో షారూఖ్ ఆశించినవి రెండు. ఒకటి, మై నేమీజ్ ఖాన్ కు ప్రచారం. రెండు, గతంలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని తూర్పార బెట్టి, పద్మభూషణ్ సంపాదించుకున్న అమీర్ ఖాన్ సరసన, తను కూడా పద్మభూషణుడుగా వెలిగిపోవాలని.
హిజ్ నేమ్ ఈజ్ 'కామెడీ కింగ్ ఖాన్'
Saturday, February 6, 2010
'తాగుడు' ఉద్యమం కాదు, 'నెత్తురోడిన' ఉద్యమం
తెలంగాణా సమస్య అర్ధం చేసుకోలేని బ్రహ్మ పదార్ధం కాదు. మునుపు, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతానికి జరిగిన అన్యాయాలకు వ్యతిరేకంగా, ఏ అభివృద్ధి ప్రాతిపదికన ఆంధ్రరాష్ట్ర ఉద్యమం మొదలయ్యిందో, అదే ప్రాతిపదికన ప్రత్యేక తెలంగాణా మొదలయ్యింది. ఉన్న తేడా అల్లా, చారిత్రక కోణం.
నిజాం నిరంకుశ పాదాల కింద నెత్తురోడింది తెలంగాణా. భారతజాతి యావత్తు అర్ధరాత్రి స్వాతంత్ర్యాన్ని ఆస్వాదిస్తుంటే, తెల్లవారే దిక్కేదో తెలియని స్థితిలో కొట్టుమిట్టాడింది తెలంగాణా. ఆపై సంవత్సరానికి గానీ, స్వేఛ్చావాయువులు సోకని దుర్భర పరిస్థితుల్లో, రేపటి ఉషస్సు కోసం పోరుబాటన పట్టింది తెలంగాణ. ప్రపంచంలోనే స్ఫూర్తిదాయకమైన పోరాటంలో రక్తసిక్తమైన చరిత్ర తెలంగాణాది. సంకుచిత రాజకీయ పరిధుల్లో పరిగణించాల్సిన పోరాటం కాదిది. నిజాం నిరంకుశత్వాన్ని వ్యతిరేకిస్తూ చేసిన పోరాటం ఇది. పటేల్, పట్వారీ, దేశ్ ముఖ్, దేశ్ పాండే, రజాకార్ల అరాచకాన్ని ఎదిరించిన పోరాటం ఇది. విశాల భారతంలో మమేకమవ్వాలని తెలంగాణా చెసిన పోరాటం ఇది.
అలాంటి తెలంగాణా ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం అడిగితే, ప్రత్యేక దేశం అడుగుతున్నట్లుగా చీదరింపులు దేనికి? ప్రభుత్వాలు వివక్ష చూపుతున్నాయని ప్రశ్నిస్తే, వెక్కిరింపులు దేనికి? ఆశించిన తీరులో అభివృద్ధి ఏదని అడిగితే, గేలి చేయటం దేనికి?
తెలంగాణా కె.సి.ఆర్. పోరాటం కాదు. ప్రజల పోరాటం. అందుకే, రెండు నెలలుగా స్త్రీ పురుష భేదం లేకుండా, చిన్నా పెద్దా అని లేకుండా ఉద్యమాన్ని నడుపుతున్నారు. ప్రస్తుతం, పార్టీలు పోషిస్తున్న పోరాటం కాదిది.
ఆ పోరాటానికి, ఇప్పటి పోరాటానికి ఉన్న సారూప్యమేమిటనేది అసలైన ప్రశ్న. అప్పుడు నిజాం నవాబు, వారి తాబేదార్లు దోచుకున్నారు, ఇప్పుడు ఆంధ్రావాళ్ళు ఆ పనే చేస్తున్నారనేది అసలు సారూప్యమే కాదు. కేవలం ప్రజలను, ఉద్యమాన్ని పక్కదోవ పట్టించటానికి కొందరు నాయకులు చేసే ప్రేలాపనలే అవి. విచారకరమైన విషయం ఏమిటంటే, చదువుకున్న వ్యక్తులు కూడా అటువంటి నాయకుల ప్రేలాపనలనే తెలంగాణా గుండె చప్పుడుగా పేర్కొంటూ తెలంగాణా ఉద్యమాన్ని వ్యతిరేకించటమే కాకుండా, అవమానిస్తున్నారు కూడా.
సరే, అప్పటి ప్రజల దుర్భర పరిస్థితులకి, ఇప్పటి పరిస్థితులకి పెద్దగా మార్పేమీ లేకపోవటమే ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికి ప్రధాన కారణం. జరిగిన అభివృద్ధైనా, కాలక్రమంలో జరిగినదే కానీ, కాలాతీతంగా జరిగిన అభివృద్ధి శూన్యం. భూమి లేక, భుక్తి లేక ఇక్కట్లు పడ్డ ప్రజలు అప్పుడు ఉన్నట్లే, ఇప్పుడూ ఉన్నారు. సమైక్యాంధ్రుల మాటకొస్తే, అటువంటి దుర్భర పరిస్థితులు సీమాంధ్రలలో కూడా ఉంది. అవును. అభివృద్ధి ప్రాతిపదికగా పోరాటం చేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం తెచ్చుకున్నా అభివృద్ధి జరగకపోతే, ఎవరిని తప్పు పట్టాలి? ప్రభుత్వాలని నిలదీయరే? అటు తెలంగాణా ప్రజలు, చేసిన బాసలు మరచిన ప్రభుత్వాన్ని నిలదీసి ప్రత్యేక రాష్ట్రం అడుగుతుంటే తప్పు పట్టటం ఏమిటి?
దురదృష్టవశాత్తు, ఇది రాజకీయంగా తీరాల్సిన సమస్య కాబట్టి, రాజకీయ కోణాలు వికృతంగా ఆవిష్కరింపబడుతున్నాయి. ఎన్ని రాజకీయ అభిప్రాయాలున్నా, మరెన్ని సైద్ధాంతిక విభేదాలు ఉన్నా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాస్వామిక ప్రభుత్వాలు నడవాలి. ఆ క్రమంలో ఆయా రాజకీయ పక్షాల విధివిధానాలు అడ్డు రాకూడదు. కానీ, తెలంగాణాకు సంబంధించి ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నడవడిక, తదితర రాజకీయపక్షాల నడవడిక ఆ స్ఫూర్తినే దెబ్బ తీసేదిగా ఉంది.
Friday, February 5, 2010
హిజ్ నేమ్ ఈజ్ 'కామెడీ కింగ్ ఖాన్'
మింగుడుపడని విషయం ఏమిటంటే, ఐ.పి.ఎల్. లో కోల్ కత్త నైట్ రైడర్సుకు వీడు అధినేత. ఐ.పి.ఎల్. ఆక్షన్లు జరుగుతున్నప్పుడు పల్లెత్తు మాట అనలేకపోయినవాడు, ఇప్పుడు ప్రతిఘటించటంలోని ఔచిత్యం ఏమిటి?
ముంబాయి దాడులు జరిగి గట్టిగా సంవత్సరం కాలేదు. ఈ సంవత్సర కాలంలో భారత్ నమ్మకాన్ని ఏరకంగా పాకిస్తాన్ సాధించిందని ఇప్పుడు ఆ దేశంతో క్రీడా సంబంధాలు పెట్టుకోవాలి? వీడికి తందనాలాడుతూ కేంద్ర హోం శాఖా మంత్రి చిదంబరం కూడా, పాకిస్తాన్ క్రీడాకారులను ఐ.పి.ఎల్. ఫ్రాంచైజీలు తీసుకుంటే అభ్యంతరంలేదని, వారి రక్షణకు ఏర్పాట్లు చేయగలమని ప్రకటించాడు!
పాకిస్తాన్ లో శిక్షణ పొందిన తీవ్రవాదుల నుంచి సామాన్య భారతీయులను రక్షించలేని ప్రభుత్వాలు, పాకిస్తాన్ క్రీడాకారులకు మాత్రం ప్రత్యేక రక్షణ కల్పిస్తామని మాట్లడటం ఏమిటి? భారతీయుల కన్నా, పాకిస్తాన్ వాళ్ళే ఈ ప్రభుత్వాలకి ముఖ్యమా?
ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడాలంటే క్రీడా సాంస్కృతిక సంబంధాలు, సంఝౌతా ఎక్స్ ప్రెస్సులు మొదలవ్వలానేదే ముఖ్యమా? గత ఆరు దశాబ్దాల కాలంలో, సంబంధాల మెరుగుదలకు భారత్ చేయనిదేమిటి, దానికి ప్రతిఫలంగా పాకిస్తాన్ మనకు ఇచ్చిందేమిటి?
కామెడీ కింగ్ ఖాన్ సినిమాలు పాకిస్తాన్ లో విడుదల చేస్తే, వాడికి వాడి నిర్మాతలకు ఉపయోగమేమో కానీ, దానివల్ల సగటు భారతీయుడికి కలుగుతున్న ప్రయోజనం ఏమిటి - తీవ్రవాదుల చేతుల్లో దాడులకు గురవ్వటం తప్ప. కామెడీ కింగ్ ఖాన్ ను వెనకేసుకొచ్చే రాజకీయ నాయకులకు కాశ్మీర్ పండితులపై జరిగే అత్యాచారాలను ప్రశ్నించే అనుపం ఖేర్ పై ఎందుకు చిన్న చూపు?
ఏదేమైనా, నేను హిందువునని గర్వంగా చెప్పుకునే ఓ భారతీయుడుగా కామెడీ కింగ్ ఖాన్ సినిమాలనే కాదు, వాడినే దేశం నుంచి బహిష్కరించాలని కోరుతున్నా. ఈ విషయంలో బాల్ థాక్రేకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నా. కామెడీ ఖాన్ నే కాదు, లౌకిక ప్రజాస్వామ్య దేశమంటే, మైనారిటీలకే ప్రత్యేక పరిరక్షణ కల్పించటమే అంటూ వత్తాసు పలికే కుహానా లౌకిక రాజకీయ నాయకులను కూడా హిందు దేశం నుంచి బహిష్కరించాలి.
Tuesday, December 22, 2009
ఆమరణ దీక్షలు - ఆరంభ శూరులు
నెల రోజుల ముందు నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తా నంటూ ఊరించి ఊరించి చివరికి దీక్ష మొదలేయక మునుపే అరెస్టు చేయించుకోబడ్డాడు కె.సి.ఆర్. అరెస్టు కావడమే తరువాయి, అయ్యవారి ఆరోగ్యం గాలిలో దీపమయ్యిందని అటు డాక్టర్లు సెలైనులు, జ్యూసులు పట్టించారు. ఒక్కరోజు కూడా నలుగురిలో కూర్చోకుండానే, పదకొండు రోజులపాటు అసుపత్రి బెడ్డుపై పడుకునే ఆమరణ నిరాహార దీక్ష చేసిన కె.సి.ఆర్. తెలంగాణా గాంధీ అట!
ఇటు విజయవాడలో మరో పెద్దమనిషి సమైక్యాంధ్ర కోసం దాదాపు ఓ ఎనిమిది రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. అయ్యవారి ఆరోగ్యం బాగోలేదని అక్కడి ఆసుపత్రిలో చేరిస్తే, కాదని పారిపోయి హైద్రాబాదు ఎన్.ఐ.ఎం.ఎస్.లో చేరారు. నిన్నటి ఈ టీవీ వార్తల్లో లగడపాటి పరుగెత్తుకెళ్ళటం చూసాక ఆయన ఎనిమిది రోజులుగా చేసిన నిరాహార దీక్ష గుర్తుకు వచ్చి ఆశ్చర్యపోవాల్సి వచ్చింది.
అటు ఆ తెలంగాణా పెద్దమనిషి ఒక్క పూటకే డంగైపోతే, ఇక్కడ సమైక్యాంధ్ర పెద్దమనిషి ఎనిమిది రోజుల దీక్ష తర్వాత కూడా పి.టి.ఉష కన్నా ఉత్సాహంగా ఉన్నారు.
ఓ రెండు రోజులు దీక్షలో కూర్చోటం ఆలస్యం - డాక్టర్ల కోసం వెంపర్లాడటం మొదలు. చావటానికి సిద్ధపడ్డ త్యాగమూర్తులు డాక్టర్ల కోసం దేబిరించటంలోనే తెలుస్తుంది వారి త్యాగనిరతి. సందుకో సత్రకాయ తయారయ్యి చేస్తున్న ఈ ఆమరణ నిరాహార దీక్షలు చూస్తుంటే, ప్చ్! ఆమరణ నిరాహార దీక్షలంటే అందరికీ ఎంత అలుసైపోయాయో అనిపిస్తుంది.
ఈ దీక్షలో కిటుకులు తెలియని మరికొందరు సత్రకాయలు మాత్రం ఇంకా రిలే నిరాహార దీక్షలు చేస్తూ ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ఆహుతిచ్చానని సంబరపడి పోతున్నారు. 80ల్లో ఎంటీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన రిజర్వేషనుల వ్యతిరేకోద్యమంలో గుంటూరులో మేము చేసాం ఈ రిలే నిరాహార దీక్షలు. అప్పట్లో, రోజుకు ఇద్దరు ముగ్గురం చొప్పున దీక్ష చేసి, ఆ మర్నాడు మాత్రమే విరమించేవాళ్ళం. ఇప్పుడు పూటకొకళ్ళు రిలే నిరహార దీక్షలు చేస్తున్నట్లున్నారు.
ఏమైనా అపరగాంధీలకు అసలైన బానిసలం కాబట్టి, నిరాహార దీక్షల్లో ఆంధ్రుల ఆరంభ శూరత్వాన్ని నిరూపిస్తూనే ఉందాం, సిగ్గు పడకుండా!
Wednesday, December 16, 2009
తెలంగాణా - శేష ప్రశ్నలు
దీక్ష కూడ మొదలు కాకుండానే, ఆసుపత్రికి తరలించబడ్డ కె.సి.ఆర్., ఆసుపత్రిలోనే చేసిన పదకొండు రోజుల "సెలైన్ నిరాహారదీక్ష" కు కేంద్ర ప్రభుత్వం నిజంగానే కదిలిపోయి దిగివచ్చిందా? గత అయిదు సంవత్సరాలు తాత్సారం చేస్తూ వచ్చిన అంశంపై పదిరోజుల్లోనే ఓ అవగాహనకు వచ్చి, రాత్రికి రాత్రి ప్రకటించటంలోని విశేషం ఏమై ఉంటుంది?
ఛీ పొమ్మన్నా, పదవులకి, అధికారానికి అంటిపెట్టుకునే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, తెలంగాణా ప్రకటన వెలువడిన తెల్లవారుఝామునే, సమైక్య ఆంధ్రకు అనుకూలంగా రాజీనామాల పర్వం మొదలేయటమేమిటి? రాజ్యాంగ సంక్షోభం కలిగించటం ఏమిటి?
కేంద్ర మంత్రిపదవుల్లోను, కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లోనూ అన్యాయం జరుగుతున్నా పెదవి విప్పని కాంగ్రెస్ నాయకులు, అధినేత్రికే వ్యతిరేకంగా రాజీనామాలు చేసారంటే నమ్మశక్యం కాదు. తనకు, తన తమ్ముడికి, తన కొడుక్కి పదవులు ఇవ్వలేదని గుక్కలు పట్టిన రాయపాటి లాంటి నేత రాజీనామా చేయటం, అనవసరమైన ప్రతిసారీ వీర విధేయత ప్రకటించే లగడపాటి అధిష్టానానికి కాకుండా స్పీకర్ కే రాజీనామా సమర్పించటం అస్సలు నమ్మలేం.
కాంగ్రెస్ బాటలోనే తెలుగుదేశానికి, ప్రజారాజ్యంకు చెందిన ఆంధ్ర రాయల సీమ ఎమ్మెల్యేలు కూడా హడావుడిగా రాజీనామాలు చేయటం కూడా అంతే ఆశ్చర్యకరం, అంతకు మించిన అసహజ పరిణామం. దానికితోడు, తెలంగాణా తెలుగుదేశం కావాలని చంద్రబాబుపై వత్తిడి కూడా తెస్తున్నట్లు కొందరు నాయకులు ప్రకటించటం కూడా విస్మయం కలిగిస్తున్నది. పరాకుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ వేసిన పాచికలకు, ఎదురు వేస్తున్న చంద్రబాబు ఎత్తుగడా ఈ డబుల్ గేం?
ఎప్పుడూ నోరు పారేసుకునే తెలంగాణా కాంగ్రెస్ నేతలు, ఈ మొత్తం వ్యవహారంలొ ఎక్కువ చడీచప్పుడు లేకుండా ఉండటం కూడా మరింత ఆశ్చర్యకరంగా ఉంది.
నిరాహార దీక్షకు నెల రోజుల ముందు నుంచే కె.సి.ఆర్. చేసిన ప్రకటనలు కూడా అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. అసలు, నిరాహార దీక్షను నెల రోజుల ముందే ప్రకటించాల్సిన అవసరం ఏమిటి? ఆనక, రోజు విడిచి రోజు నిరాహార దీక్షలో ఉండే తనను అరెస్టు చేయాలని ప్రయత్నిస్తే ఊరుకోమని ఉరమటం, నిరాహార దీక్ష భగ్నం చేయాలని చూస్తే ఆత్మహత్య చేస్తుకుంటానని బెదిరించటం... ఇవన్నీ నెల రోజుల ముందు నుంచే ఎందుకు చేయాల్సి వచ్చింది?
తన నిరాహార దీక్షకు దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణా ప్రకటించిందని భావిస్తుంటే, సోనియమ్మకు సాగిలబడి ప్రణామాలు చేస్తానని కె.సి.ఆర్. చేసే ప్రకటనల్లోని మర్మం ఏమిటి?
ప్రత్యేక తెలంగాణాపై తమ చిత్తశుద్ధిని ప్రదర్శించటానికి (ప్రకటించటానికి కాదు) కాంగ్రెస్ ఆడిన నాటకమా? లేక, రాజకీయంగా బోర్లపడ్డ తె.రా.స.ను కాంగ్రెస్ గూటికి చేర్చాలని చేసిన ప్రయత్నమా ఇది? లేక, ఆకస్మికంగా ఇలాంటి నిర్ణయాన్ని తీసుకొని, తెలుగుదేశం పార్టీని గుక్క తిప్పుకోకుండా చీల్చివేయాలని వేసిన పన్నాగమా ఇది? ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ళ సమయం ఉంది కాబట్టి, ఎన్నికల లబ్ది కోసం చేసింది మాత్రం కాదని స్పష్టమౌతుంది.
ఏది ఏమైనా, అందరూ అనుకుంటున్నట్లుగా ఇది కేంద్రం తీసుకున్న హఠాత్ నిర్ణయం మాత్రం కాదు. ఆచి తూచి వేసిన పాచికలే ప్రత్యేక తెలంగాణా ప్రకటన, ఆపైని మొదలేసిన సమైక్యవాద ఉద్యమపు డ్రామా. ఏమి ఆశించి అన్నది మాత్రం ప్రస్తుతానికి ఓ శేష ప్రశ్నే.
Friday, December 11, 2009
భంగపడ్డ తెలంగాణా
"రాష్ట్ర శాసనసభలో ప్రవేశ పెట్టే తీర్మానం వల్ల దమ్మిడీ ఉపయోగం లేదు. అలానే, ఓసారి మోసపుచ్చిన సోనియా మాటలకు మరోసారి మోసపోవాలనుకోవటం మూర్ఖత్వం. కేవలం పార్లమెంటులో ప్రత్యేక తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టటమే కాకుండా, ఆ బిల్లును ఆమోదించిన తర్వాతనే కె.సి.ఆర్. దీక్ష విరమించుకోవటం అవసరం."
పదకొండు రోజులు ఆపసోపాలు పడి, అమ్మవారి హామీ కోసం పరితపించి, చివరాఖరికి హడావుడీగా, బ్రతుకు జీవుడా అనుకుంటూ కె.సి.ఆర్. ఆమరణ నిరాహార దీక్ష విరమించాడు. గొంతులో ముద్ద కూడా దిగకుండానే, అమ్మవారి హామిలోని పితలాటకాలు ఒక్కటొక్కటిగా ఇప్పుడు బైటపడుతుంటే, ఖంగు తినటం తప్పనిసరయ్యింది ఈయనకు.
కె.సి.ఆర్. పుణ్యమా అని, వెన్నెముక లేని కాంగ్రెస్ నాయకులు కూడా సోనియాకు అవిధేయత ప్రకటించటం ఆశ్చర్యకరం. కేంద్ర మంత్రి పదవుల పందేరంలోను, జనరల్, రైల్వే బడ్జెట్లలో రాష్ట్రానికి మొండి చేయి చూపించినప్పుడు, కరువు, వరదల బీభత్సానికి అతలాకుతలమైన రాష్ట్రానికి చేయూతనందించటంలో తిథి, వార, నక్షత్రాలు లెక్కపెట్టిన కేంద్రాన్ని ఏనాడూ ప్రశ్నించని నాయకులు, ఈరోజు ప్రజాభీష్టం మేరకే తమతమ పదవులకు రాజీనామాలు ఇచ్చారంటే ఆశ్చర్యంగానూ ఉంది, అసహజంగానూ ఉంది.
గత ఆరు సంవత్సరాలకు పైగా నలుగుతున్న తెలంగాణా విషయంపై, ఆయా పార్టీల నాయకత్వం ఆయా పార్టీల సభ్యుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోలేదని ఎలా చెబుతున్నారో అర్ధం కావటంలేదు. ఒకప్పుడు, దొరికిన అవకాశాన్నే కాక, దొరకని అవకాశాన్ని కూడా అందిపుచ్చుకొని తెలంగాణాపై సోనియా నిర్ణయమే శిరోధార్యమన్న నాయకులే వీళ్ళు.
విచిత్రమేమిటంటే, తెలంగాణా కాంగ్రెస్ నాయకులు మాత్రం ఇప్పటికీ నోరు మెదపటంలేదు. ఇదంతా చూస్తుంటే, గూడుపుఠానీలా అనిపిస్తున్నది. కోస్తా సీమ నాయకుల నుంచి పార్టీల కతీతంగా ఐకమత్యంగా ఉండటం కనీసమాత్రంగానైనా తెలంగాణా నాయకులు ఎప్పుడు నేర్చుకుంటారో?
కోస్తా, సీమల ఎమ్మెల్యేలు మెజారిటీగా ఉన్న శాసనసభలో తెలంగాణా బిల్లు ఏరకంగా ఆమోదింపబడుతుందని తెలంగాణా మేథావులు విశ్లేషించారు? సోనియా హామీలకే దిక్కులేని పరిస్థితుల్లో, చిదంబరాలు, మన్మోహన్లు చేసే హామీల విలువ ఏపాటిది? మొన్నటిదాకా, తెలంగాణాపై నాంచుడు ధోరణితో ఆరేళ్ళు లాక్కొచ్చిన కాంగ్రెస్, "చిదంబర హామీతో" మరో అరేళ్ళు లాక్కొస్తుందనటంలో ఎటువంటి అనుమానము లేదు.
చేవలేని చవటల నాయకత్వంలో 'ప్రత్యేక తెలంగాణా'కు మరోమారు భంగపాటు తప్పదు.
Wednesday, December 9, 2009
తెలంగాణా - మరోసారి మోసపోవద్దు
ఇప్పటి వరకూ, ఒక్క కాంగ్రెస్ తప్ప, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోని దాదాపు అన్ని పార్టీలు "తెలంగాణ" పై తమ తమ అభిప్రాయలను ప్రకటించాయి. అయినా, మెజారిటీ అభిప్రాయాన్ని తోసిరాజని, ఏకాభిప్రాయ సాధన కోసం కృషిచేస్తున్నామని ఎ.ఐ.సి.సి. ప్రకటించటం ఎవరిని మోసగించాలని చేసే ప్రయత్నం? ఎంతమంది ప్రజల ఏకాభిప్రాయంతో ఈ కాంగ్రెస్ ప్రధాని దేశాన్ని, ఈ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు?
రాష్ట్ర కాంగ్రెస్ లో తెలంగాణా అంశంపై భిన్నాభిప్రాయలు ఉన్నాయని రోశయ్య ప్రకటించారు. అందుకని ఏ తీర్మానమూ కుదరదట! ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసినప్పుడు కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయే మరి! అయినా, ముఖ్యమంత్రి పదవి ఆయన అధిష్టించలేదా?
తాడో పేడో తేల్చుకోవాలసిన దశలో ఉన్న పోరాటాన్ని తె.రా.స. అర్ధంపర్ధంలేని షరతులతో ఆపేయదనే ఆశిద్దాం. ఎందుకంటే, రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసినా, సోనియా గాంధి హామీ ఇచ్చినా, పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టినా దీక్షవిరమిస్తానని కె.సి.ఆర్. ప్రకటించటం మరో తప్పటడుగు.
రాష్ట్ర శాసనసభలో ప్రవేశ పెట్టే తీర్మానం వల్ల దమ్మిడీ ఉపయోగం లేదు. అలానే, ఓసారి మోసపుచ్చిన సోనియా మాటలకు మరోసారి మోసపోవాలనుకోవటం మూర్ఖత్వం. కేవలం పార్లమెంటులో ప్రత్యేక తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టటమేకాకుండా, ఆ బిల్లును ఆమోదించిన తర్వాతనే కే.సి.ఆర్. దీక్ష విరమించుకోవటం అవసరం.
కాదు కూడదు, ఇక దీక్ష కొనసాగించటం వల్ల కాదు అనుకుంటే, రాజకీయ సన్యాసం తీసుకొని, నేతృత్వాన్ని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకునే నాయకుడి చేతుల్లో పెట్టటం తెలంగాణా ఉద్యమానికి మంచిది. తెలంగాణా మేథావులు సరైన దిశగా, స్పష్టమైన అవగాహనతో నిర్ణయాలు తీసుకుని మరోసారి మోసపోరనే ఆశిద్దాం.
Monday, November 30, 2009
ఉద్యమాన్ని నీరుగార్చిన కె.సి.ఆర్.
ఆనాడు, స్వతంత్ర భారతంలో పరాధీనగా మిగిలిన "కోటి రతనాల వీణ" చేసిన ఆ సాయుధపోరాటంలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలు, ఈరోజు కె.సి.ఆర్. వలన బూడిదలో పోసిన పన్నీరైనాయి. అంతకు మించిన ఆవేదన ఏమిటంటే, ఈ రోజు "ప్రత్యేక తెలంగాణా' ఉద్యమం కే.సి.ఆర్. లాంటి నేత వలన ఓ జోక్ గా మిగిలిపోయింది.
ప్రజాభీష్టానికి, మొదటి ఎస్సార్సీ ప్రతిపాదనలకు విరుద్ధంగా "విశాలాంధ్ర" ఏర్పడిందనేది సత్యం. ప్రస్తుతానికి ఆ విషయం జోలికి పోకుండా, ఒక ఉద్యమాన్ని కె.సి.ఆర్. తన స్వార్ధ రాజకీయాల కోసం, ఎలా పక్కదోవ పట్టించింది ఓసారి నెమరువేసుకుందాం.
పోరాటంతో సాధించాల్సిన తెలంగాణాను, అడుక్కుని, దేబిరించే స్థాయికి దిగజార్చిన ఘనుడు కె.సి.ఆర్. ప్రత్యేక తెలంగాణాయే లక్ష్యంగా ఆవిర్భవించిన తె.రా.స., కె.సి.ఆర్. నాయకత్వంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు తప్పటడుగులు వేస్తూనే వచ్చింది.
చెన్నారెడ్డి నేతృత్వంలో కొనసాగిన తెలంగాణా ఉద్యమాన్ని కాంగ్రెస్ ఎలా నీరుకార్చిందో తెలిసినా, ఏ నమ్మకంతో కె.సి.ఆర్., ముందుగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారో ఇప్పటికీ అర్ధం కాదు. అప్పుడు ఫలితాలు వచ్చిన తర్వాతైనా పరిస్థితులు సమీక్షించుకోకుండా ఆనాడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రి పదవుల కోసం సాగిలపడ్డ విషయం ఇంకా మరచిపోలేదు.
ఏ విభాగమూ లేకపోయినా మంత్రి పదవిలో కొనసాగిన కే.సి.ఆర్. ఆనాటి కేంద్రప్రభుత్వ ఉమ్మడి కార్యక్రమంలో ప్రత్యేక తెలంగాణా చేర్చాలని ఎందుకు పోరాడలేదు?
ప్రజాస్వామ్య దేశంలో పది రకాల అభిప్రాయాల కన్న, మెజారిటీ అభిప్రాయానికే విలువ ఎక్కువన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, ఏకాభిప్రాయ సాధన కోసం కృషి చేస్తున్నామని కల్లబొల్లి కబుర్లు చెప్పింది ఏమాశించి?
తెలంగాణా పై నిజాయితీ నిరూపించుకుంటానని, ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానన్న నేత, అర పూట కూడా ఉపవాసం ఉండలేక, అప్పటి లోక్ సభ స్పీకర్ మొహమాటానికి అన్నదే తడవుగా దీక్ష విరమించుకోలేదా? చిత్తశుద్ధి లేకుండా చేసే చండీ యాగాల వలనా తెలంగాణా వచ్చేది?
తెలంగాణా ప్రజలు, నిజంగానే తనను, ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని సమాదరిస్తారనుకుని ఉంటే, నిరుటి ఎన్నికలలో తె.దే.పా., కమ్యూనిస్టులతో చేతులు ఎందుకు కలపటం? ఒంటరి పోరు ఎందుకని సాగించలేదు. తన నిజాయితీని తెలంగాణా ప్రజలు అంతకు మునుపు జరిగిన ఉప ఎన్నికల్లో శంకించారని తెలుసు కాబట్టే, ఇతర పార్టీలతో జట్టు కట్టింది అనే విషయం అర్ధం చేసుకోలేని అమాయకులు కాదు తెలంగాణా ప్రజలు.
తన నిజాయితీ మీద, తెలంగాణాపై తన నిబద్ధత మీద ప్రజలకు నమ్మకం లేదని గ్రహించబట్టే, గ్రేటర్ ఎన్నికల్లో తె.రా.స. పోటీ చేయకుండా కె.సి.ఆర్. అడ్డుపడ్డాడనేది వాస్తవం కాదా?
తెలంగాణా వచ్చుడో, కె.సి.ఆర్. సచ్చుడో అన్న నాయకుడు, నెల రోజుల ముందరే ఆర్భాటంగా ప్రకటించిన ఆమరణ నిరాహార దీక్షకి ఇప్పుడు కూడా అదే గతి పట్టటం ఆశ్చర్యం కాదు.
చేవలేని నాయకుడు చేసే పోరాటం వల్ల, ఆ ఉద్యమమే భ్రష్టు పట్టే అవకాశం ఉంటుందని కె.సి.ఆర్. నిరూపించాడు. కె.సి.ఆర్. చేత బలవంతంగా రాజకీయ సన్యాసం చేయించి, పొట్టి శ్రీరాములు లాంటి మరో నిస్వార్ధ నాయకుడిని ఎన్నుకోవటం వలన మాత్రమే, ప్రత్యేక తెలంగాణా సాధ్యమౌతుందని తెలంగాణా ప్రజలు గ్రహించాలి.
Tuesday, November 24, 2009
ముంబాయి మృతవీరులకు శ్రద్ధాంజలి
రేపటికి ముంబాయి దాడులు జరిగి సరిగ్గా సంవత్సరం. సంవత్సరం క్రితం మహారాష్ట్రలో ఏ ప్రభుత్వం ఉందో అదే ఇప్పుడూ ఉంది. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉందో అదే ఇప్పుడూ ఉంది. దాడులలో పట్టుబడ్డ "కసబ్" అలానే ఉన్నాడు. పాకిస్తాన్ అప్పుడు ప్రకటించినట్లుగానే, మరిన్ని సాక్ష్యాలు కావాలని ఇప్పటికీ అంటున్నది. పాకిస్తాన్ కు ఇచ్చిన సాక్ష్యాలు సరిపోతాయన్న మాటే, మన ప్రభుత్వమూ ఇప్పటికీ అంటున్నది. తీవ్రవాదుల మీద పాకిస్తాన్ సత్వరమే చర్యలు తీసుకోవాలని అమెరికా ఇప్పటికీ హూంకరిస్తుంటే, అలా బెదిరించమని ఇండియా ఇంకా దేబిరిస్తూనే ఉంది.ఈ కేసుకు సంబంధించి, పోలీసుల, కోర్టుల పనితీరులో ఎలాంటి మార్పు లేదు. ఈ దాడుల్లో పాకిస్తాన్ ప్రమేయాన్ని చాటిచెబుతూ భారత ప్రభుత్వం విడుదల చేసిన సాక్ష్యాలు, కసబ్ ను దోషిగా నిర్ధారించటంలో ఎందుకు ఉపయోగపడటంలేదో మనకు అర్ధం కాదు.
సంవత్సరకాలంగా మారని ఈ పరిస్థితుల మధ్య, మారింది ఒక్క పౌరుడే. ఒకప్పుడు స్వేచ్ఛగా తిరిగిన ఈ పౌరుడే, ఇప్పుడు బితుకు బితుకు మంటూ తిరుగుతున్నాడు. ఒకప్పుడు, ప్రతి తీవ్రవాద ఘాతుకం తర్వాత, పడి లేచిన కెరటంలా ఉవ్వెత్తున ఎగసిన పౌరుడు, ఇప్పుడు నిస్సత్తువగా ఉన్నాడు.
ఉగ్రవాదాన్ని ఉక్కుపాదాల కింద అణచివేస్తామన్న ఆనాటి ప్రధాని, తన గుండెకు పడిన గాయానికి చికిత్స చేయించుకొని మళ్ళీ ప్రధాని అయ్యాడు. దేశానికి తూట్లుపొడుస్తున్న తీవ్రవాదాన్ని అంతమొందించటానికి తీసుకున్న చర్య మాత్రం ఒక్కటీ లేదు.
తీవ్రవాదుల దాడి జరిగిన ప్రతిసారి పాకిస్తాన్ ను వేలెత్తి చూపించి సరిపెట్టేసే ప్రభుత్వం, దేశద్రోహులకు, వారి మతానికి లంకె పెట్టి పార్లమెంటు దాడి కేసులో ఉరిశిక్షపడిన "అఫ్జల్ గురుకు" ఇంత వరకూ శిక్ష అమలు పరచని ప్రభుత్వం, "కసబ్" విషయంలో ఎలా రాజకీయాలు ఆడగలదో ఊహించుకోటానికే సిగ్గు వేస్తుంది. మైనారిటీ దేశద్రోహులను, వారికి వంతపాడే రాజకీయాలను చేష్టలుడిగి ఇంకా అలా చూస్తూనే ఉన్నారు మెజారిటీ దేశభక్తులు! దేశభక్తుల సహనాన్ని దేశప్రభుత్వమే పరీక్షించటం మన లౌకిక ప్రజాస్వామ్యంలోనే సాధ్యం!
మతాన్ని రాజకీయాలతోను, దేశంతోను ముడిపెట్టిన జిన్నా వారసులు జాతీయ చిహ్నాలను అవమానించటం మొదలేసినప్పుడే వాటిని ఆపే ప్రయత్నాలు చేసి ఉంటే పరిస్థితులు ఇంత దూరం వచ్చి ఉండేవి కావు. ఇందిర హత్యానంతరం జరిగిన సిక్కుల దారుణ ఊచకోతకు స్పందించని, హిందువుల ఓట్ల కోసం అయోధ్యలో శిలాన్యాసం చేసి తదనంతర పరిణామాలలో బాబ్రీ మసీదు కుప్పకూలిపోవటానికి పరోక్ష కారకుడైన రాజీవ్ గాంధీ సరైన నిర్ణయాలు తీసుకొని ఉంటే మన దేశంలో మతవిద్వేషాలు ఈ తీరుగా చెలరేగేవే కావు.
అఫ్జల్ గురు ను విడుదల చేయకపోతే, కాశ్మీరులో హింసాకాండ చెలరేగుతుందని భయపెట్టే గులాంనబీ అజాద్ లాంటి ముఖ్యమంత్రులు, రిపబ్లిక్ డే వేడుకలను బహిష్కరించమనే షాబుద్దీన్ లు, వందేమాతరాన్ని పాడము అని తేల్చి చెప్పే ఉలేమాలు - రేపు జాతీయ గీతాన్ని, జాతీయ జండాను కూడా అవమానించినా లౌకిక ప్రజాస్వామ్య దేశంలో అవి మైనారిటీ హక్కుల కిందే జమ చేసే నీతిలేని రాజకీయ జాతులున్న ఈ దేశంలో ఆ విషయాలు వేలెత్తి చూపినా తప్పే.
అపి స్వర్ణమయి లంకానాం నమే లక్ష్మణ రోచతే
జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి
మాతృదేశం కన్నా, మతానికి విలువనిచ్చే ప్రతి దౌర్భాగ్యుడూ దేశద్రోహే. వాళ్ళని తరిమి కొట్టనంతవరకూ ముంబాయి తరహా దాడులు మనం ఎదుర్కొనక తప్పదు.
ముంబాయి మృతవీరులకు శ్రద్ధాంజలులతో...
Friday, October 9, 2009
ఒబామా కాదు, మన్మోహన్ సింగే నిజంగా అర్హుడు
ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ ల పరిస్థితుల్లో మార్పు లేదు. నిన్నటికి మొన్న, పాకిస్తాన్ పూర్వ రాష్ట్రపతి ముషర్రాఫ్ తన హయాంలో ఏవిధంగా అమెరికా సహాయాన్ని భారత్ కు వ్యతిరేకంగా ఉపయోగించారో చెప్పినా, రెండు రోజుల తర్వాతే పాకిస్తాన్ కు మరింత సహాయాన్ని ప్రకటించిన ఒబామా ప్రభుత్వం ప్రపంచ శాంతిని ఏరకంగా ఉద్ధరించిందో!
మహాత్మా గాంధిని, మార్టిన్ లూథర్ కింగ్ ను మాటిమాటికి జ్ఞప్తికి తెచ్చుకోవటమే ప్రపంచశాంతికి దోహదపడటమైతే, మన దేశంలో ఇంతకు వందింతలమందికి నోబెల్ శాంతి బహుమతి ప్రకటించాల్సి ఉంటుంది. ఆ మాటకొస్తే, ఒబామా కన్నా, మన ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ పురస్కారానికి అన్నివిధాలా అర్హుడు.
ఇటు సరిహద్దుల్లో పాకిస్తాన్ సాగిస్తున్న కాల్పులపై నోరు మెదపడు. అటు, అరుణాచల్ ప్రదేశ్ లో చైనా చొరబాటుపై పెదవి విప్పడు. దేశం నడిమధ్యలో తీవ్రవాదుల ఘాతుకంపై అడిగినా అదే చూపు, పార్లమెంటుపై దాడి కేసులో ఉరి శిక్షపడ్డ అఫ్జల్ గురు గురించి అడిగినా అదే చూపు. చివరాఖరికి నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ లు బెదిరించే పోకడలు పోతున్నా కిమ్మనడు. ఏంతో శాంతికాముకుడైతే తప్ప, సామాన్యులు అలా స్థితప్రజ్ఞత చూపలేరు.
మన కాంగ్రెస్ పార్టీ, అణు ఒప్పందం విషయంలో ఎలాగైతే లాబీయింగ్ నడిపిందో, అలానే, మన ప్రధానికి నోబెల్ శాంతి బహుమతి కోసం లాబీయింగ్ చేస్తే బాగుంటుంది.
Wednesday, August 26, 2009
భారతీయ జనతా పార్టీ - ఓ ప్రహసనం
దేశంలోనే మొట్టమొదటి నాన్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేరళలో ఏర్పాటు చేయగలిగిన నంబూద్రిపాద్ నాయకత్వంలోని కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని బర్త్ రఫ్ చేసేంతవరకూ నెహ్రూ నిద్రపోలేదంటే నమ్మటానికి కష్టమే. కానీ, అది చారిత్రక సత్యం. ఆ పెడధోరణుల వారసత్వ రాజకీయాలే కాంగ్రెస్ దాదాపుగా కొనసాగించింది. ఈ రాజకీయ వికృతత్వం చివరికి దేశంలో అత్యవసర పరిస్థితికి కూడా దారి తీసింది. దాదాపుగా ప్రతిపక్షమనే మాటే వినబడకుండా దేశాన్ని ఏలాలనే ఇందిర నిరంకుశత్వ ధోరణి ఆ అత్యవసర పరిస్థితికి మూలకారణం.
సరే, ఆ సమయంలో జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో జనతా పార్టీ ఏర్పాటు కావటం జరిగింది. అప్పటి జనసంఘ్ ఆ క్రమంలోనే జనతా పార్టీలో భాగమయ్యింది. అప్పటి ఎన్నికలలో విజయకేతనం ఎగురవేసిన జనతా పార్టీ, సద్దుమణగని అంతర్గత వివాదాల, నేతల అధికార దాహాల మధ్య ఒక ప్రయోగంగానే విఫలమైంది. ఎవరు తెచ్చుకున్న కుంపట్లు వాళ్ళు వెనక్కి తీసుకొని మళ్ళీ సొంత కాపురాలు పెట్టుకోవటం కూడా జరిగింది. అనాటి జనసంఘ్, అవే ఆదర్శాలతో ఇప్పటి 'భారతీయ జనతా పార్టీగా' రూపాంతరం చెందింది.
అరువు తెచ్చుకున్న ఆదర్శాలతో, వామపక్షాలు కూడా ఒకటి రెండు రాష్ట్రాలు మినహా కాంగ్రెస్ కు సరి అయిన ప్రత్యామ్నాయం కాలేకపోయారు. దానికితోడు వామపక్షాల మధ్య ఉన్న విభేదాలు కాంగ్రెస్ అనుకూలంగా మలచుకోవటంలోనూ కృతకృత్యమయ్యింది. నైతికవిలువలతో, నైతికాదర్శాలతో రాజకీయాల్లో దూసుకెళదామని వచ్చిన భా.జ.పా. కూడా ఓటర్లపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేకపోయింది.
జన్ సంఘ్ కాలం నుంచి పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న హిందువులను 'లౌకిక ఆదర్శాల' పేరుతో వంచిస్తున్న కాంగ్రెస్ కు ధీటైన ప్రతిపక్షంగా నిలవాలంటే, మెజారిటీ అభిప్రాయాలను గౌరవించాలని భా.జ.పా. గ్రహించేటప్పటికే దాదాపుగా ఒక దశాబ్దం పట్టింది. ఆ సమయంలో పార్టీకి అధ్యక్షుడుగా ఉన్న అద్వాని హిందుత్వ ఏజెండాతో మొదలు పెట్టిన 'రామ్ రథ్ యాత్ర' కు దేశప్రజలు నీరాజనాలు అర్పించారు. అప్పటివరకూ నామమాత్రపు పార్టీగా ఉన్న భా.జ.పా. కొన్ని రాష్ట్రాలలో అధికారం చేపట్టటమే కాక, 1991 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి ఎదిగింది.
ఇక అసలు ప్రహసనం మొదలయ్యింది 1996 ఎన్నికల తర్వాత. పదమూడు రోజుల ప్రధాని పదవి అనుభవించిన వాజ్ పేయి తదితర నాయకులు, ఆ స్థాయికి చేర్చిన హిందువులను మరచిపోయింది ఆ సమయంలోనే. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ ప్రధాని పదవి పగ్గాలే ధ్యేయంగా అవకాశవాద పార్టీలతో అవకాశవాద పొత్తులు పెట్టుకొని మూల సిద్ధాంతాలను కాలదన్నింది 1998 ఎన్నికల సమయంలో.
అధికార దాహం, పదవీ లాలసత ఎంతటివారినైనా దుర్బలులని చేస్తుంది అనటానికి ప్రత్యక్ష తార్కాణం వాజ్ పేయి, అద్వానీ తదితర నేతలు. హిందుత్వ ఏజెండాతో అద్వానీ చేపట్టిన రామ్ రథ్ యాత్రకు అడ్డు చెప్పని వాజ్ పేయి ఆ తర్వాత అయోధ్య విషయంలోను, గోథ్రా మారణకాండ నేపథ్యంలోనూ కొనసాగించిన రాజకీయాలు కేవలం పదవిని నిలుపుకోటానికి పడిన తాపత్రయంగానే కనిపిస్తుంది. అటువంటి రాజకీయాలు చేసి 'లౌకికవాది'గా ముద్ర వేయించుకోవాలనే తపనే కనిపిస్తుంది.
అత్యధిక స్థానాలు గెలిపించిన హిందువులను కాదని, కొసరు పార్టీల సహకారంతో అధికారపు అందలం ఎక్కిన భా.జ.పా., హిందువులకు చేసింది శూన్యం. 1998లో తాకట్టు పెట్టిన సిద్ధాంతాలను 2004 ఎన్నికలకు బయటకు తీసినా హిందువులు నమ్మలేదు. హిందువులు కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం కావాలనుకున్నారే కానీ, కాంగ్రెస్ కు కాంగ్రెస్ లాంటి పార్టీనే ప్రత్యామ్నాయం కావాలనుకోలేదు.
ఈ నీచ రాజకీయాలను ఛీత్కరిస్తూ తదుపరి ఎన్నికలలో కూడా హిందువులు భా.జ.పా.కు బానే బుద్ధి చెప్పారు. రక్తాన్ని మరిగిన పులిలా, అధికారానికి అయిదేళ్ళు అలవాటుపడ్డ భా.జ.పా. నేతలు ఆ అధికారం చేజిక్కించుకోటానికి చేయని ప్రయత్నం లేదు. ఆ ప్రయత్నాలలో భాగంగానే సిద్ధాంతాల రాద్ధాంతం మొదలయ్యింది. ఇదంతా ముసుగులో గుద్దులాటగానే సాగింది గత అయిదేళ్ళల్లో. ఇప్పుడు మాత్రం తెరపైనే ఈ ప్రహసనాన్ని కొనసాగిస్తున్నారు.
ఈ జన్మకోసారైనా ప్రధాని కావాలనుకునే అద్వాని, తన కోరిక తీర్చుకోటానికి తాను తీర్చిదిద్దిన పార్టీని, తనను తీర్చిదిద్దిన సిద్ధాంతాలనే రూపుమాపే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో వెన్నుదన్నుగా ఉన్న హిందువులను, కార్యకర్తలను కూడా బలిపశువులుగా చేసేందుకు వెనుకాడటంలేదు.
కాంగ్రెస్ బాపతు లౌకిక పార్టీలకు మన దేశంలో కొరతలేదు. ఉన్న పార్టీలన్నీ దాదాపుగా ఆ తాను గుడ్డలే. మైనారిటీల ప్రాపకం కోసం, భా.జ.పా.ను కూడా ఆ తానులో భాగంగా చేర్చే ప్రయత్నంలో, భా.జ.పా. నేతలు ఆ పార్టీకే సమాధి కడుతున్నామని గ్రహించలేకపోవటం విచారకరం. రంగు మార్పిడి రాజకీయాలను ప్రజలు, ముఖ్యంగా హిందువులు హర్షించలేదనటానికి గత రెండు సార్వత్రిక ఎన్నికలు ఉదాహరణ.
గోథ్రా దారుణానికి ప్రతిచర్యగా కొనసాగిన గుజరాత్ మారణహోమానికి నరేంద్ర మోడిని సార్వత్రిక ఎన్నికల సమయంలోనే వాజ్ పేయ్ బాధ్యుడిని చేయటం హిందువులనే కాదు, అందరినీ నివ్వెరపరచింది. ఆ సార్వత్రిక ఎన్నికల ముందు జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పల్లెత్తుమాట అనని వాజ్ పేయి ఆ వెంటనే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రంగుమార్చిన వైనం ఆ పార్టీ నాయకత్వపు సందిగ్ధస్థితినే తెలుపుతుంది.
ఓటు బ్యాంకు రాజకీయాలాడే కాంగ్రెస్ కే పాఠాలు చెప్పే విధంగా భా.జ.పా. నేతలు ప్రవర్తించిన తీరు ఆ పార్టీపై హిందువులకున్న సానుభూతిని కూడా కోల్పోయేలా చేసింది. అందుకు జిన్నాపై అద్వాని చేసిన ప్రకటనలు ప్రబల సాక్ష్యం. ఇప్పుడు జస్వంత్ సింగ్.
ఏదేమైనా, అధికారం కోసం అర్రులు చాస్తున్న భా.జ.పా. నేతలు తమ మూలాలు మళ్ళీ వెతుక్కోవటం అవసరం. అధికారం కావాలంటే, మెజారిటీ ప్రజల మనసులు గెలుచుకోవటం అవసరం అని గ్రహించాలి. వస్తాయో రావో తెలీని మైనారిటీ ఓట్లకు వెంపర్లాడుతూ ఉన్నవి ఊడబెరుక్కునే వెర్రి నేతల తతంగానికి ఇకనైనా ముగింపు పలకాలి. అసలు ఇప్పటి పార్టీ స్వరూపస్వభావాలనే సంపూర్తిగా మార్చాల్సిన తరుణం ఆసన్నమయ్యింది.
70 పైన వయసు పడ్డ నేతలను నిర్మొహమాటంగా తొలగించాలి. మూల సిద్ధాంతాలకు మసిపూస్తున్న నేతలను కూడా నిష్కర్షగా తొలగించాలి. అవసరమైతే, ఆరెస్సెస్సె ప్రత్యక్ష రాజకీయాల్లో దిగాలి.
Friday, August 21, 2009
లౌకికవాదిగా జిన్నా - ఓ 'కామెడీ' అవగాహన
జిన్నా మతవాది అవునా కాదా అనే విషయంలో చాలానే అపోహలు ఉన్నాయి. మతాల ప్రామాణికంగా రెండు దేశాల సిద్ధాంతాన్ని పట్టుకు వేలాడిన జిన్నా, తన వ్యక్తిగత జీవితంలో 'మతాన్ని ఏనాడు పాటించలేదు' అంటూ 'జిన్నా భూతం' గురించి వ్రాయబడ్డ 'కామెడీ పోస్టులో' అయ్యవారు తన అభిప్రాయాన్ని అలా ఆపాదించారు.
తమ వాదనను వెలిబుచ్చే ఇతరులకు చరిత్ర పుస్తకాలు చదవమని సలహాలిచ్చే అయ్యవారు, తన విషయం వచ్చేసరికి, తనో చరిత్రను తిరగేసిన మేధావిగా ఎందుకు ఫీలవుతారో నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఏదేమైనా, అయ్యవారి పోస్టులు 'కామెడీ పోస్టులే' గాని 'చారిత్రక పోస్టులు' కావు కాబట్టి, కాసేపు నవ్వుకొని వదిలేద్దాం.
ఆ మాటకొస్తే, అసలు జిన్నా వ్యక్తిగతంగా 'లౌకికవాదా' అనే విషయం మనకు అనవసరం. రాజకీయంగా ఆయన ఏ పరిమితుల మధ్య తన అభిప్రాయాలు వ్యక్తం చేసాడు, ఏ ఆశయాలతో పని చేసాడు అనేదే ముఖ్యం. తన రాజకీయ లబ్దికి జిన్నా మతాన్ని వాడుకున్నాడనే విషయంలో ఎవ్వరికీ అనుమానం లేదు. చివరాఖరుకు 'కామెడీ అయ్యవారి కమ్యూనిస్టు హిస్టారియన్లతో సహా'. కావాలంటే, కామెడీ పోస్టులో చివరి పేరాలో మొదటి లైను చదవండి.
"ఆరంభంలో భారతీయ చరిత్రకారులు జిన్నాను ఒక విలన్ గా చిత్రీకరించడం nation building process లో భాగంగా మనం అర్థం చేసుకున్నా, ఇప్పుడు జిన్నాను "సరిగ్గా" అర్థం చేసుకోవడం అవసరం. సమస్యాత్మకం చేసుకోవడం అనవసరం."
సరే, అసలు జిన్నా మతవాది అవునా కాదా అనేది ఆయన వ్యక్తం చేసిన ఈక్రింది అభిప్రాయాల్లోనే అర్ధమౌతుంది. కాబట్టి, 'కామెడీ వారి' అభిప్రాయాలని బుట్ట దాఖలు చేసి, పాఠకులు వారి వారి అభిప్రాయాలు ఏర్పరచుకోండి. ఇక్కడ కోట్ చేయబడుతున్న జిన్నా ప్రసంగ పాఠాలు, నేను వ్రాసినవి కాదు. అవి రికార్డు చేయబడిన చారిత్రక సత్యాలు.
ముందుగా 'ముస్లీంలీగ్' అధ్యక్షుడుగా మార్చి 22-23, 1940లో లాహోరులో ఆయన చేసిన ప్రసంగం :
It is extremely difficult to appreciate why our Hindu friends fail to understand the real nature of Islam and Hinduism. They are not religions in the strict sense of the word, but are, in fact, different and distinct social orders, and it is a dream that the Hindus and Muslims can ever evolve a common nationality, and this misconception of one Indian nation has troubles and will lead India to destruction if we fail to revise our notions in time. The Hindus and Muslims belong to two different religious philosophies, social customs, litterateurs. They neither intermarry nor interdine together and, indeed, they belong to two different civilizations which are based mainly on conflicting ideas and conceptions. Their aspect on life and of life are different. It is quite clear that Hindus and Mussalmans derive their inspiration from different sources of history. They have different epics, different heroes, and different episodes. Very often the hero of one is a foe of the other and, likewise, their victories and defeats overlap. To yoke together two such nations under a single state, one as a numerical minority and the other as a majority, must lead to growing discontent and final destruction of any fabric that may be so built for the government of such a state.
ఇక, సెప్టెంబరు 1945లో ఈద్ పండుగ సందర్బంగా ఆయన చేసిన ప్రసంగం :
In the message of Eid to the Muslims in September 1945 he said, "Every Mussalman knows that the injunctions of the Holy Quran are not confined to religious and moral duties. From the Atlantic to the Ganges, says Gibbon, the Holy Quran is acknowledged as the fundamental code, not only of theology, but of civil and criminal jurisprudence, and the laws which regulate the action and the property of mankind are governed by immutable sanctions of the will of God". Everyone, except those who are ignorant, knows the Holy Quran is the general code of the Muslims".
11 ఆగస్టు, 1947 పాకిస్తాన్ రాజ్యాంగసభలో ఆయన చేసిన ప్రసంగం :
"You may belong to any religion or caste or creed -- that has nothing to do with the business of the state ...... We are starting with this fundamental principle that we are all citizens and citizens of one state....... in the course of time Hindus would cease to be Hindus and Muslims would cease to be Muslims, not in the religious sense, because that is the personal faith of each individual, but in the political sense as citizens of the state".
పాకిస్తాన్ రాజ్యాంగసభలో ఆయన చేసిన ప్రసంగానికి, జిన్నా ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన అప్పటి జాతీయోద్యమ నాయకులు చెప్పినదానికి ఏమైనా తేడా ఉందా? దీన్నిబట్టి, మతాన్ని తన స్వార్దపూరిత రాజకీయ ఆకాంక్షలకు జిన్నా ఉపయోగించుకున్నాడని స్పష్టంగా తెలుస్తున్నది కదా! మరి అలాంటి వ్యక్తి 'లౌకికవాది' ఎలా అయ్యాడు?
అయ్యవారి ఆర్టికిల్లోని చివరిపేరాలోని 'కామెడీ కారుకూతలు' మరోసారి.
"ఆరంభంలో భారతీయ చరిత్రకారులు జిన్నాను ఒక విలన్ గా చిత్రీకరించడం nation building process లో భాగంగా మనం అర్థం చేసుకున్నా, ఇప్పుడు జిన్నాను "సరిగ్గా" అర్థం చేసుకోవడం అవసరం. సమస్యాత్మకం చేసుకోవడం అనవసరం. ముఖ్యంగా అది బిజేపీ చెయ్యడం వారి తెలియనితనాన్నే సూచిస్తోంది."
Nation Building Process లో భాగంగా జిన్నాను విలన్ గా చిత్రీకరించారా! ఇప్పుడు జిన్నాను 'సరిగ్గా' అర్ధం చేసుకోవాలా!! సరిగా అర్ధం చేసుకోకుండా చరిత్రకు కామ్రేడ్లు ఎర్ర అద్దాలు కప్పేసారని ఈ అయ్యవారు ఇప్పుడు ఒప్పుకుంటున్నట్లేనా? మొత్తానికి 'కామెడీవారు' 'కామ్రెడ్లని' కూడా వెంగళప్పలు చేసేస్తున్నారు.