Thursday, February 25, 2010
"ఊరి చివర" - చిన్న వివరణ
Wednesday, February 24, 2010
"ఊరి చివర" ఉప్పెనలా కవిత్వం
అడపాదడపా అంతర్జాలంలో చదవటమే అఫ్సర్ గారి కవిత్వాన్ని. అక్కడక్కడ, ఆయనని మాటల్లో దించి సందేహాలకు సమాధానాలు వెతుక్కునేవాడిని ఆయన వ్యాసాల్లో. అంతకు మించి ఆయనతో ఎటువంటి పరిచయం లేదు. అంతర్జాలంలో సాహితీ సహవాసానికి, ఆ మాత్రం పరిచయం సరిపోతుందేమో కదా! "ఊరి చివర" ఉప్పెనలా పొంగిన అఫ్సర్ గారి కవిత్వంపై నా అభిప్రాయమే ఈ వ్యాసం.Tuesday, February 23, 2010
అనుకోని అతిథి
కొన్ని సంఘటనలు ఎందుకు జరుగుతాయో అంచనాలకు అందదు. మరీ ముఖ్యంగా ఆధ్యాత్మిక సాధనామార్గంలో ఉన్నప్పుడు కలిగే అనుభవాలు. జరిగే ప్రతి సంఘటనా, కలిగే ప్రతి అనుభవం ఎక్కడో ఎప్పటికో లింకు కలిగే ఉంటుంది. అది ఏమిటనేది మాత్రం ఆ సమయానికి స్ఫురించదు.
అది 16 ఫిబ్రవరి, 2010. యధాప్రకారం రాత్రి 11 కు పడుకున్నా. కానీ, 2 గంటలకే నిద్ర ఎగిరి పోయింది. దానికి సగం కారణం "కొత్తపాళి" గారైతే, మరో సగం కారణం "అఫ్సర్" గారు. :))
నిద్రలేమితో అలా పొర్లుతూ ఉండగానే, 3.30 కు అలారం మోగింది. దాన్నో అరగంట ముందుకు జరిపి మళ్ళీ పొర్లుతూనే ఉన్నా. దాదాపుగా నాలుగైంది. లేవగానే, ముందస్తుగా పూజ గదిలో అమ్మవారిని చూడాల్సిందే. లైటు వేసుకుంటే, నా మొహమే చూడాల్సొస్తుందనే భయంతో అలానే బయలుదేరుతా.
ఆ క్రమంలో స్టడీ రూము దాటుతుండగా పక్కనే ఓ కుప్పలా కనిపించింది. మాములుగా అయితే, కాళ్ళు తుడిచే పట్టాగా భావించి ఓ పక్కకు నెడతాను. ఎందుకో ఆ సమయంలో మాత్రం సం థింగీజ్ రాంగ్ అనిపించింది. పిల్లల స్కూలు బ్యాగో, గుడ్డలో అయ్యుంటాయిలే అని సర్దిచెప్పుకుంటూ, పక్కన పెడదామని కొద్దిగా వంగితే వెంటనే స్ఫురించింది అదో పాము అని!
వెంటనే బెడ్రూములో మా ఆవిడను నిద్రలేపి చెప్పి, తిరిగి వచ్చి చూస్తే, పాము మాయం. మళ్ళీ ఓ అనుమానం. అదసలు పామేనా, లేక నిద్రమత్తులో నా భ్రమా! భ్రమ అయినా ఫర్వాలేదు కానీ, అది నిజమైన పామే అయ్యుంటే, ఏ మూలకు వెళ్ళిందో? వెంటనే లైటేసి మరో అర నిముషం వెతికితే, వాషింగ్ మెషీన్ వెనుక పడుకొని, మమ్మల్ని చూస్తూ కనిపించింది. నిజానికి భయంకన్నా, బెదిరిపోయిన మాట మాత్రం వాస్తవమే కానీ, అదే బెడ్రూములోకి వెళ్ళుంటే అన్న ఆలోచన మాత్రం ఇప్పటికీ వణుకు తెప్పిస్తుంది.
వెంటనే, మా వాచ్ మన్ ను పిలచి, పాము కదలికలు కనిపెడుతూ అక్కడే కూర్చున్నాం. పక్కింటతనికి (జితేంద్ర కాంబ్లే) రెండు సార్లు ఫోను చేస్తే, రెండుసార్లూ కట్ చేసాడు. తర్వాత ఓ పది నిముషాలకు అతను ఫోను చేసి, అంతకు ముందు మోగింది అలారం అనుకొని కట్ చేసాను ఏమిటి విషయం అని అడిగాడు. మొత్తం చెప్పగానే, వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చాడు.
అంత తెల్లవారుజామున ఏం చేయాలో తోచటంలేదు. పామును చూస్తూనే ముప్పావు గంట గడిచింది. సరిగ్గా, అప్పుడు మా పక్కింటతను కార్పొరేటర్ అశోక్ ఘోర్పడెకు ఫోను చేసాడు. అంత తెల్లవారుఝామున ఫోను చేసినా, ఎంతో స్వాంతనగా మాట్లాడి, ఓ పావుగంటలో మనిషిని పంపిస్తానని చెప్పారు అశోక్ ఘోర్పడె. చెప్పినట్లుగానే దాదాపు 5.15 కు నితిన్ అనే స్నేక్ కాచర్ వచ్చాడు. అప్పటికి, దాదాపు గంటసేపు కదలకుండా, మెదలకుండా వాషింగ్ మెషీన్ వెనుకే ఉన్న మా అతిథి మెల్లగా, పక్కనే ఉన్న పుస్తకాల రాక్ క్రిందకు పాకి వెళ్ళింది.
పామును పట్టుకోటానికి అయిదు నిముషాలు పడితే, దానిని గోతాంలో వేయటానికి అంతకన్నా ఎక్కువే పట్టింది. మొత్తానికి 5.30 కు ఊపిరి పీల్చుకున్నాం.
ఆల్ ఈజ్ వెల్, దట్ ఎండ్స్ వెల్. జవాబులేని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి ఈ సంఘటనలో.
My humble gratitude to our Corporator – Mr. Ashok Ghorpade, for timely help in those odd hours.
My sincere thanks to Nitin – The Snake Catcher, my neighbour – Jitendra Kamble and our Watchman – Gopal Bahadur.
Monday, February 15, 2010
రామ రామ... గొల్లపూడి గారు ఆఖరికి మీరు కూడా....!
గొల్లపూడిగారు విస్మరించిన ఓ రెండు ముఖ్యమైన విషయాలు :
1. ఐ.పి.ఎల్. లో కోల్కతా నైట్ రైడర్సుకు షారూఖ్ ఓనరు. మై నెమీజ్ ఖాన్ విడుదలకు కొద్ది రోజుల ముందుగా జరిగిన క్రీడాకారుల వేలంపాటలో, పల్లెత్తి ఒక్కసారైనా పాకిస్తాన్ క్రీడాకారులు కావాలని కోరని వ్యక్తి, సినిమా విడుదలకు ముందు, భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు పెరగాలంటే, పాకిస్తాన్ క్రీడాకారులను ఐ.పి.ఎల్. లో ఆడించాలని చెప్పాడు. దీని వెనుక మర్మమేమిటో అర్ధం చేసుకోలేని అమాయకులు ఎవరైనా ఉంటారా? మీరు ఏ లోకంలో, ఏ కాలంలో ఉన్నారు గొల్లపూడి గారు?
2. కొన్ని నెలల క్రితం, ఆ సినిమా షూటింగు జరుగుతున్నప్పుడే, తన పేరు చివర ఖాన్ అని ఉన్నదన్న నెపంతోనే, అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు తనను రెండు గంటలపాటు అమెరికాలోని ఓ విమానాశ్రయంలో నిర్బంధించారని ఆరోపిస్తూ, ఈ సినిమా ప్రచారానికి ఆనాడే తెర లేపాడు షారూఖ్. ఈ విషయం కూడా మీరు మర్చిపోయినట్లున్నారు.
* * *
ఇకపైగా, అసలు విషయాన్ని అడుసులో తొక్కి, బాల్ థాక్రేపై కాళ్ళు కడుక్కున్న గొల్లపూడి గారి తీరు గర్హనీయం. ముంబాయిపై తీవ్రవాదుల దాడి జరిగి గట్టిగా సంవత్సరం కాలేదు. దాడి జరిగిన వెనువెంటనే, పాకిస్తాన్ తో అన్ని సంబంధాలను తిరస్కరించిన భారత ప్రభుత్వం, ఒక సంవత్సరంలోగా, పాకిస్తాన్ ఎలాంటి సకారాత్మక ధోరణి కనబరచిందని, మళ్ళీ చర్చలకు పూనుకున్నదని ప్రశ్నించరే?
గత సంవత్సర కాలంలో, భారత పాకిస్తాన్ ల సంబంధ బాంధవ్యాలను షారూఖ్ ఏరకంగా ఉద్ధరించిందీ ప్రశ్నించరే?
గత ఆరు దశాబ్దాలుగా, క్రీడా సాంస్కృతిక రంగాల ఆసరాతో, ఇరు దేశాల మధ్య సంబంధాల పటిష్టతకు భారత్ చేయనిదేమిటి? దానికి ప్రతిఫలంగా పాకిస్తాన్ మనకు ఇచ్చిందేమిటి అన్న విషయాన్ని ఎందుకు విస్మరించారు?
బాధ్యతాయుతంగా మెలగాల్సిన వ్యక్తులు, సంకుచిత వ్యాపార దృక్ఫధంతో చేసే ఇటువంటి వ్యాఖ్యల వల్ల, ఆవేశాలు పెచ్చరిల్లే ప్రమాదమొకటైతే, గొల్లపూడి గారి లాంటి జ్ఞానవృద్ధులు (వ్యంగ్యం ఏమాత్రమూ లేదు) కూడా ఇటువంటి మాయ మాటల వలలో పడి, అసలు విషయాన్ని విస్మరించే ప్రమాదం కూడా ఉంటుందని నిరూపితమయ్యింది.
గొల్లపూడి గారు ఆఖరికి మీరు కూడా ....ఇలా కామెడీ చేస్తే ఎలా?
ఈ మొత్తం వ్యవహారంతో షారూఖ్ ఆశించినవి రెండు. ఒకటి, మై నేమీజ్ ఖాన్ కు ప్రచారం. రెండు, గతంలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని తూర్పార బెట్టి, పద్మభూషణ్ సంపాదించుకున్న అమీర్ ఖాన్ సరసన, తను కూడా పద్మభూషణుడుగా వెలిగిపోవాలని.
హిజ్ నేమ్ ఈజ్ 'కామెడీ కింగ్ ఖాన్'
Saturday, February 6, 2010
'తాగుడు' ఉద్యమం కాదు, 'నెత్తురోడిన' ఉద్యమం
తెలంగాణా సమస్య అర్ధం చేసుకోలేని బ్రహ్మ పదార్ధం కాదు. మునుపు, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతానికి జరిగిన అన్యాయాలకు వ్యతిరేకంగా, ఏ అభివృద్ధి ప్రాతిపదికన ఆంధ్రరాష్ట్ర ఉద్యమం మొదలయ్యిందో, అదే ప్రాతిపదికన ప్రత్యేక తెలంగాణా మొదలయ్యింది. ఉన్న తేడా అల్లా, చారిత్రక కోణం.
నిజాం నిరంకుశ పాదాల కింద నెత్తురోడింది తెలంగాణా. భారతజాతి యావత్తు అర్ధరాత్రి స్వాతంత్ర్యాన్ని ఆస్వాదిస్తుంటే, తెల్లవారే దిక్కేదో తెలియని స్థితిలో కొట్టుమిట్టాడింది తెలంగాణా. ఆపై సంవత్సరానికి గానీ, స్వేఛ్చావాయువులు సోకని దుర్భర పరిస్థితుల్లో, రేపటి ఉషస్సు కోసం పోరుబాటన పట్టింది తెలంగాణ. ప్రపంచంలోనే స్ఫూర్తిదాయకమైన పోరాటంలో రక్తసిక్తమైన చరిత్ర తెలంగాణాది. సంకుచిత రాజకీయ పరిధుల్లో పరిగణించాల్సిన పోరాటం కాదిది. నిజాం నిరంకుశత్వాన్ని వ్యతిరేకిస్తూ చేసిన పోరాటం ఇది. పటేల్, పట్వారీ, దేశ్ ముఖ్, దేశ్ పాండే, రజాకార్ల అరాచకాన్ని ఎదిరించిన పోరాటం ఇది. విశాల భారతంలో మమేకమవ్వాలని తెలంగాణా చెసిన పోరాటం ఇది.
అలాంటి తెలంగాణా ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం అడిగితే, ప్రత్యేక దేశం అడుగుతున్నట్లుగా చీదరింపులు దేనికి? ప్రభుత్వాలు వివక్ష చూపుతున్నాయని ప్రశ్నిస్తే, వెక్కిరింపులు దేనికి? ఆశించిన తీరులో అభివృద్ధి ఏదని అడిగితే, గేలి చేయటం దేనికి?
తెలంగాణా కె.సి.ఆర్. పోరాటం కాదు. ప్రజల పోరాటం. అందుకే, రెండు నెలలుగా స్త్రీ పురుష భేదం లేకుండా, చిన్నా పెద్దా అని లేకుండా ఉద్యమాన్ని నడుపుతున్నారు. ప్రస్తుతం, పార్టీలు పోషిస్తున్న పోరాటం కాదిది.
ఆ పోరాటానికి, ఇప్పటి పోరాటానికి ఉన్న సారూప్యమేమిటనేది అసలైన ప్రశ్న. అప్పుడు నిజాం నవాబు, వారి తాబేదార్లు దోచుకున్నారు, ఇప్పుడు ఆంధ్రావాళ్ళు ఆ పనే చేస్తున్నారనేది అసలు సారూప్యమే కాదు. కేవలం ప్రజలను, ఉద్యమాన్ని పక్కదోవ పట్టించటానికి కొందరు నాయకులు చేసే ప్రేలాపనలే అవి. విచారకరమైన విషయం ఏమిటంటే, చదువుకున్న వ్యక్తులు కూడా అటువంటి నాయకుల ప్రేలాపనలనే తెలంగాణా గుండె చప్పుడుగా పేర్కొంటూ తెలంగాణా ఉద్యమాన్ని వ్యతిరేకించటమే కాకుండా, అవమానిస్తున్నారు కూడా.
సరే, అప్పటి ప్రజల దుర్భర పరిస్థితులకి, ఇప్పటి పరిస్థితులకి పెద్దగా మార్పేమీ లేకపోవటమే ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికి ప్రధాన కారణం. జరిగిన అభివృద్ధైనా, కాలక్రమంలో జరిగినదే కానీ, కాలాతీతంగా జరిగిన అభివృద్ధి శూన్యం. భూమి లేక, భుక్తి లేక ఇక్కట్లు పడ్డ ప్రజలు అప్పుడు ఉన్నట్లే, ఇప్పుడూ ఉన్నారు. సమైక్యాంధ్రుల మాటకొస్తే, అటువంటి దుర్భర పరిస్థితులు సీమాంధ్రలలో కూడా ఉంది. అవును. అభివృద్ధి ప్రాతిపదికగా పోరాటం చేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం తెచ్చుకున్నా అభివృద్ధి జరగకపోతే, ఎవరిని తప్పు పట్టాలి? ప్రభుత్వాలని నిలదీయరే? అటు తెలంగాణా ప్రజలు, చేసిన బాసలు మరచిన ప్రభుత్వాన్ని నిలదీసి ప్రత్యేక రాష్ట్రం అడుగుతుంటే తప్పు పట్టటం ఏమిటి?
దురదృష్టవశాత్తు, ఇది రాజకీయంగా తీరాల్సిన సమస్య కాబట్టి, రాజకీయ కోణాలు వికృతంగా ఆవిష్కరింపబడుతున్నాయి. ఎన్ని రాజకీయ అభిప్రాయాలున్నా, మరెన్ని సైద్ధాంతిక విభేదాలు ఉన్నా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాస్వామిక ప్రభుత్వాలు నడవాలి. ఆ క్రమంలో ఆయా రాజకీయ పక్షాల విధివిధానాలు అడ్డు రాకూడదు. కానీ, తెలంగాణాకు సంబంధించి ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నడవడిక, తదితర రాజకీయపక్షాల నడవడిక ఆ స్ఫూర్తినే దెబ్బ తీసేదిగా ఉంది.
Friday, February 5, 2010
హిజ్ నేమ్ ఈజ్ 'కామెడీ కింగ్ ఖాన్'
మింగుడుపడని విషయం ఏమిటంటే, ఐ.పి.ఎల్. లో కోల్ కత్త నైట్ రైడర్సుకు వీడు అధినేత. ఐ.పి.ఎల్. ఆక్షన్లు జరుగుతున్నప్పుడు పల్లెత్తు మాట అనలేకపోయినవాడు, ఇప్పుడు ప్రతిఘటించటంలోని ఔచిత్యం ఏమిటి?
ముంబాయి దాడులు జరిగి గట్టిగా సంవత్సరం కాలేదు. ఈ సంవత్సర కాలంలో భారత్ నమ్మకాన్ని ఏరకంగా పాకిస్తాన్ సాధించిందని ఇప్పుడు ఆ దేశంతో క్రీడా సంబంధాలు పెట్టుకోవాలి? వీడికి తందనాలాడుతూ కేంద్ర హోం శాఖా మంత్రి చిదంబరం కూడా, పాకిస్తాన్ క్రీడాకారులను ఐ.పి.ఎల్. ఫ్రాంచైజీలు తీసుకుంటే అభ్యంతరంలేదని, వారి రక్షణకు ఏర్పాట్లు చేయగలమని ప్రకటించాడు!
పాకిస్తాన్ లో శిక్షణ పొందిన తీవ్రవాదుల నుంచి సామాన్య భారతీయులను రక్షించలేని ప్రభుత్వాలు, పాకిస్తాన్ క్రీడాకారులకు మాత్రం ప్రత్యేక రక్షణ కల్పిస్తామని మాట్లడటం ఏమిటి? భారతీయుల కన్నా, పాకిస్తాన్ వాళ్ళే ఈ ప్రభుత్వాలకి ముఖ్యమా?
ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడాలంటే క్రీడా సాంస్కృతిక సంబంధాలు, సంఝౌతా ఎక్స్ ప్రెస్సులు మొదలవ్వలానేదే ముఖ్యమా? గత ఆరు దశాబ్దాల కాలంలో, సంబంధాల మెరుగుదలకు భారత్ చేయనిదేమిటి, దానికి ప్రతిఫలంగా పాకిస్తాన్ మనకు ఇచ్చిందేమిటి?
కామెడీ కింగ్ ఖాన్ సినిమాలు పాకిస్తాన్ లో విడుదల చేస్తే, వాడికి వాడి నిర్మాతలకు ఉపయోగమేమో కానీ, దానివల్ల సగటు భారతీయుడికి కలుగుతున్న ప్రయోజనం ఏమిటి - తీవ్రవాదుల చేతుల్లో దాడులకు గురవ్వటం తప్ప. కామెడీ కింగ్ ఖాన్ ను వెనకేసుకొచ్చే రాజకీయ నాయకులకు కాశ్మీర్ పండితులపై జరిగే అత్యాచారాలను ప్రశ్నించే అనుపం ఖేర్ పై ఎందుకు చిన్న చూపు?
ఏదేమైనా, నేను హిందువునని గర్వంగా చెప్పుకునే ఓ భారతీయుడుగా కామెడీ కింగ్ ఖాన్ సినిమాలనే కాదు, వాడినే దేశం నుంచి బహిష్కరించాలని కోరుతున్నా. ఈ విషయంలో బాల్ థాక్రేకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నా. కామెడీ ఖాన్ నే కాదు, లౌకిక ప్రజాస్వామ్య దేశమంటే, మైనారిటీలకే ప్రత్యేక పరిరక్షణ కల్పించటమే అంటూ వత్తాసు పలికే కుహానా లౌకిక రాజకీయ నాయకులను కూడా హిందు దేశం నుంచి బహిష్కరించాలి.