Showing posts with label ఆవకాయలో. Show all posts
Showing posts with label ఆవకాయలో. Show all posts

Thursday, April 14, 2011

అన్నలదారిలో అన్నాహజారే... తెలకపల్లిగారు మీరేమంటారు?

విలేఖరి, విశ్లేషకుడు, కవి, రచయిత అయిన తెలకపల్లి రవి గారు హజారే దీక్ష-హజార్ సవాళ్లు అనే వ్యాసం తన బ్లాగులో ప్రచురించారు. నరేంద్ర మోడి, నితీష్ కుమార్ లను అన్నా హజారే ప్రశంసించటమనే కారణంతోనే, అన్నా హజారే చేపట్టిన ఉద్యమాన్ని చిన్నబుచ్చే ప్రయత్నం చేసినట్లుగా ఈ వ్యాసం చదివిన పాఠకులకు తోస్తుంది.

పురిటిలోనే సంధి కొట్టించేటట్లుగా కొనసాగిన జన లోక్ పాల్ బిల్లు ప్రతిపాదనలు ఎన్ని దశాబ్దాలుగా మనలని మభ్యపెడుతున్నాయో మనకు తెలుసు. ఆ ప్రతిపాదనలకు రూపురేఖలు కలిగిస్తున్న రాజకీయ నాయకుల అవినీతి నేపధ్యమూ తెలుసు. మరి ఇంతకాలం, లోక్ సత్తా, కమ్యూనిస్టులతో సహా ఏ రాజకీయ పార్టీ ఈ అంశంపై ఉద్యమాన్ని ఎందుకని తీసుకురాలేకపోయాయి?

ఎందుకంటే, ఈ పార్టీలన్నీ ఆ తానులోని గుడ్డలే. ఒక సాధారణ సంఘటనగా మొదలైన ఉద్యమానికి ఊహాతీతంగా లభించిన జనస్పందన పాలక, ప్రతిపక్ష పార్టీలకు దిక్కుతోచని పరిస్థితి కలిగించిందనేది వాస్తవం. అవకాశవాద రాజకీయాల్లో దిట్టలైన ఈ నేతలు, తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఉద్యమానికి మద్దతు ప్రకటించాల్సి వచ్చింది కానీ, అవినీతిపై వారికి ఉన్న విముఖత కానేకాదు.

తెలకపల్లి గారు ఓ విచిత్రమైన వాదన చేస్తూ ఇలా అన్నారు "వ్యవస్థీకృతమైన అవినీతి మూలాలు చూడకుండా కాయకల్ప చికిత్సలపై కదన శంఖాలు ఎంతగా పూరించడం వేళ్లు వదిలి కొమ్మను విరచిన చందంగానే మిగిలిపోతుంది.”........

Friday, April 8, 2011

అప్పుడు మహాత్మా గాంధి, ఇప్పుడు అన్నా హజారే

డెబ్భై ఏళ్ళు పైబడిన వయసులో అవినీతికి వ్యతిరేకంగా అన్నాహజారే చేపట్టిన సత్యాగ్రహం నిద్రాణమైన దేశానికి మేలుకొలుపు కావాలి. ప్రభుత్వాలలో అవినీతికి వ్యతిరేకంగా దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఉద్యమిస్తున్న సామాజిక కార్యకర్త అన్నాహజారే తన జీవిత చరమాంకంలో పూరించిన శంఖారావం మరో స్వాతంత్ర్య పోరాటం కావాలి.

ఇప్పటికే విదేశాలలో మురిగిపోతున్న లక్షల కోట్ల నల్లధనం, దానికి తోడు బోఫోర్స్ నుండి నిన్నటి స్పెక్ట్రం కుంభకోణం వరకు ఎన్ని లక్షల కోట్లు రాజకీయ నాయకుల, ప్రభుత్వ అధికారుల చేతులు మారిందో బహిరంగ రహస్యమే అయినా, ఏనాడూ, ఏ ప్రభుత్వమూ అవినీతిని అంతమొందించే దిశగా అడుగులు వేయలేదు. ఆరు దశాబ్దాల పైబడిన మన సర్వసత్తాక ప్రజాస్వామ్య దేశంలో అవినీతి నిరోధానికి సరైన చట్టం లేకపోవటం ఒక విషాదమైతే, ఆ వెసులుబాటును ఆధారంగా చేసుకొని తమ అవినీతిని నిరూపించమని సవాళ్ళు విసిరే వ్యక్తులతో మంత్రివర్గాలు నిండి ఉండటం మరో విషాదం. అధికారంలో ఉన్న వ్యక్తుల అవినీతి ఏనాటికి నిరూపించబడదనేది కటిక వాస్తవం.....

Saturday, April 2, 2011

Biggest loser India


.......For many normal citizens, it’s a joyous occasion to celebrate the unbroken record of India’s victory against Pakistan in all World Cup Cricket Matches, so far. For politicians, it’s an occasion to score few points over Indo-Pak ties.

Are we the real winners? Can this victory erase the memories of Terrorists Attacks? Can this victory wipe out the tears of the family members of the terror victims? Can this meeting be termed as path breaking in Indo-Pak stalemate? Can this meeting bring out the culprits of various Terror Attacks?

The wily Prime Minister of India seized an opportunity to divert the attention of Nation from the corruption his Government is implicated with. By shamelessly inviting Pakistan Prime Minister for the so called Cricket Diplomacy Dr. Manmohan Singh has once again proved how spineless we are, as a nation.

And the silly Prime Minister of Pakistan took the opportunity to accord his acceptance as if he is doing a great favour by attending the Cricket Match and discussing various bilateral issues!

How rotten are the minds of our politicians! So are the citizens of this great nation! We too have lost our minds in the madness of Cricket Diplomacy! We have completely lost our sensitivities and sensibilities. Do we remember that this is the same Pakistan Prime Minister, who even refused to identify Kasab as a Pakistani National, not long ago..............

Friday, March 11, 2011

మిలియన్ మిస్టేక్స్


ఏ ప్రజా ఉద్యమమైనా ఒకానొక స్థాయిలో హింసాయుతంగా పరిణమించటం సర్వసాధారణం. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేయటం ఒక ఎత్తైతే, లూటీలు మానభంగాలకు పాల్పడటం మరో ఎత్తు. వీటిని మించి, మన సంస్కృతిని మనం ధ్వంసం చేసుకోవటం మూర్ఖత్వం. ప్రజా ఉద్యమాలు హింసాయుతంగా మారటానికి గల కారణాలు విశ్లేషిస్తే, నాలుగు ముఖ్య విషయాలు గమనించొచ్చు. ప్రభుత్వాలు ఉద్యమానికి సానుకూలంగా స్పందించకపోవటం, బల ప్రయోగంతో ఉద్యమాన్ని అణచటానికి ప్రయత్నించటం, ఉద్యమంలో అసాంఘిక శక్తుల ప్రవేశం, అసమర్ధ నాయకత్వం ముఖ్యమైన కారణాలు.

ప్రత్యేక తెలంగాణా ఉద్యమం పెడదోవ పట్టటానికి ఇవన్నీ కారణాలే. ఇదివరలో ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఉద్యమం హింసాయుతంగా మారటానికి పొట్టి శ్రీరాములు బలిదానం దోహదపడింది. అంతవరకు, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం శాంతియుతంగానే కొనసాగింది. ప్రస్తుతం, అటువంటి బలిదానాలేవీ లేకుండానే ఉద్యమం పెడదోవ పట్టిందంటే కారణం అసమర్ధులు ఈ ఉద్యమానికి నాయకత్వం వహించటం. నిన్నటి టాంక్ బండ్ విధ్వంసానికి కొన్ని నిముషాల ముందే, ఉద్యమకారుల చేత శాంతియుతంగా ఆందోళన కొనసాగిస్తామని కె.సి.ఆర్. ప్రతిజ్ఞ చేయించటం, జరగబోయే విధ్వంసాన్ని చూచాయగా చెప్పినట్లే. ముందస్తు ప్రణాళికతో చేయబడిన విధ్వంసమే ఇది. అందుకే, కె.సి.ఆర్. తనకు ఎలిబీగా ఉద్యమకారుల చేత ప్రతిజ్ఞ చేయించటం.

ప్రత్యేక తెలంగాణా ఉద్యమం మరోసారి మొదలు పెట్టినప్పటి నుంచి కె.సి.ఆర్. చేసింది ఉద్యమం కాదు, మోసం. సామూహిక జన మోసం. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవటం, పదవుల కోసం వెంపర్లాడటం........ ,

Thursday, February 24, 2011

కలాపోసన! మళ్ళింకెప్పుడో!

"ఉత్తినే తిని తొంగుంటే మడిసి గొడ్డుకి తేడా ఏటుంటదని" విడమర్చి చెప్పిన బాపూ మాటల కాంట్రాక్టర్ ముళ్ళపూడి వెంకటరమణ నిదురించే ఏ తోటలోకో పాటలా వెళ్ళిపోయారు. రేవు బావురుమంటోదని బాపూ గుండె అంటూనే ఉంటుందిప్పుడు.

పాపం బుడుగు, సీగానపెసూనాంబ, దీక్షితులు లాంటి ఎవర్ గ్రీన్ అల్లరి పిల్లలు ఇంక మీదట మౌనంగా అల్లరి చేస్తారా? చెయ్యగలరా? చేసినా మనం ఆస్వాదించగలమా?

మిగతా కొత్త ఆవకాయలో...

Friday, February 18, 2011

చిరంజీవి కాదు ఓ "చిరు జీవి"


మూడు దశాబ్దాల సినిజీవితంలో, దాదాపు రెండు దశాబ్దాలు చిరంజీవి ఆడిందే ఆటగా, పాడిందే పాటగా, చేసిందే డాన్సుగా తెలుగు వెండితెర వెలుగులు చిమ్మింది. రెండు సంవత్సరాల రాజకీయ జీవితం మాత్రం దీనికి పూర్తిగా విరుద్ధంగా ముగిసింది. రఫ్ఫాడించేస్తానన్న చిరంజీవి ఇప్పుడు హస్తం పార్టీతో చేతులు కలిపేసాడు. ఇంతవరకూ, ఎవరి విశ్లేషణలు వారు చేసుకొని, చివరికి చిరంజీవి ప్రజాదోహ్రం చేసాడని ఆరోపిస్తున్నాయి అన్ని పార్టీలు.

విచిత్రం ఏమిటంటే, గత ఎన్నికలలో గెలుచుకుంది 18 అసెంబ్లీ సీట్లే అయినా, 16 శాతం వరకు ఓట్లను చీల్చగలిగింది ప్రజారాజ్యం. తను బాగుపడిందేదీ లేకపోయినా, మా పొట్టలను కొట్టింది ఈ ప్రజారాజ్యం అని అప్పట్లో చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డిలు వాపోయారు కూడా. సామాజిక న్యాయమే పరమార్ధంగా పెద్దయెత్తున మొదలైన ప్రజారాజ్యం ఈరోజు చతికిలపడటానికి కారణం ఏమిటి? రాజకీయ పరిణతి లేని చిరంజీవా? వ్యాపారంతో రాజకీయాలు చేయాలనుకుని ఒంటెద్దు పోకడలతో పార్టీని నడిపిన బావమరిదా? ఉన్న పార్టీలలో ఉనికి ఏమాత్రమూ లేకపోయినా, పదవుల కోసం ప్రజారాజ్యంలోకి పాక్కుంటూ వచ్చిన పాత నాయకులా?

కొత్తగా!

గతే శోకో న కర్తవ్యో, భవిష్యం నైవ చింతయేత్
వర్తమానేన కాలేన వర్తయంతి విచక్షణాః

అర్థం: గతం గురించి శోకించడం వ్యర్థం, భవిష్యత్తు గురించి చింతించడం అనవసరం. వర్తమానాన్ని అనుసరించి విచక్షణతో మెలగాలి.

****

ఆవకాయ.కామ్ ఈరోజు నుంచి సరికొత్త రూపంలో మీ ముందుకు తెస్తున్నందుకు సంతోషంగా ఉంది.

గతమంతా ఘనకీర్తి కాకపోయినా ఆవకాయ.కామ్ హతభాగ్యం మాత్రం కాదు. వేలాది పాఠకులు గత మూడు సంవత్సరాలుగా ఆదరించారు. యాభైకి పైగా రచయితలు, 2,300 పైగా రచనలను పొందుపరిచారు.

Sunday, September 26, 2010

శ్రీదేవి పెళ్ళి - ఓ అద్భుత కళాసృష్టి

1980 లలో ఆంధ్రదేశాన్ని నవ్వుల్లో ముంచెత్తింది "శ్రీదేవి పెళ్ళి". మిమిక్రీ ప్రసాద్ అనే కళాకారుడు రూపొందించిన హాస్యవల్లరి ఇది. రావుగోపాలరావు పెళ్ళిపెద్దగా, శ్రీదేవి - చిరంజీవిల పెళ్ళికి హాజరయిన తెలుగు నటీనటులతో ఓ అద్భుతమైన కళాసృష్టి చేసిన ఈ ప్రసాదు గారి గురించి ఎవరికైనా వివరాలు తెలుసా?

రేడియోచిల్లీ లో శ్రీదేవి పెళ్ళి వినండి :

Saturday, September 25, 2010

కవిత్వం - సమాంతర వ్యవస్థలు

అఫ్సర్ గారి అక్షరంలో, ఇంటర్నెట్ లో తెలుగు సాహిత్యంపై చర్చ జరుగుతున్న సందర్భంగా, ఆవకాయలో గతంలో ప్రచురింపబడిన సంపాదకుల వ్యాసం :

పొద్దు.నెట్ లో ఇటీవలనే శ్రీ కామేశ్వర రావు గారు ఇంటర్నెట్ కవిత్వ వ్యవసాయం పై చక్కటి వ్యాసం వ్రాసారు. ఆ వ్యాసంలో కామేశ్వర రావుగారు పేర్కొన్న విషయాలలో కొన్నింటి పై మా అభిప్రాయాల్ని ఈ వ్యాసంలో పొందుపరుస్తున్నాము.

సమకాలీన కవితా రంగం రెండు సమాంతర వ్యవస్థలుగా విడిపోయే ప్రమాదమున్నదని కామేశ్వర రావు గారు పేర్కొన్నారు.

ఇంటర్నెట్ వాడే పాఠకులు పత్రికల్ని, సాహిత్య సంచికలనీ చదవకపోతే ఇది ప్రమాదమే. దినపత్రికలు వారి వారి ఇంటర్నెట్ పత్రికలను నడుపుతూ ఉండడం, తమ తమ అచ్చు పత్రికల్లో వచ్చిన (అన్ని ప్రక్రియల) సాహిత్యాన్ని ఈ-పత్రికల్లో ఉంచడం వల్ల కామేశ్వర రావు గారు పేర్కొన్న చీలికను కొంత వరకూ నివారించగలుగుతున్నారు.

ఇంటర్నెట్ లో మంచి కవిత్వం వ్రాస్తున్నా అచ్చులో కనబడని కవుల గురించి ప్రస్తావించి కామేశ్వర రావు గారు ఓ మంచి విషయాన్ని వెలికిదీసారు. ఎందుకిలా జరుగుతోంది? అన్నదానికి అచ్చు పత్రికల నిర్వాహకులు విశ్లేషించాలి.

తెలిసిన మేరా తరచి చూస్తే, ప్రచురణలోని ఆలస్యం , ప్రచురింపబడిన తరువాత పాఠకుల అభిప్రాయాలు వెంటనే తెలియకపోవడం, పేరుమోసిన కవులకే అగ్రపీఠం వేసే తత్త్వం , కొండకచో రాజకీయాలు ఇంటర్నెట్ కవుల్ని అచ్చు పత్రికలనుండి దూరంగా ఉంచుతున్నాయనుకుంటాము.

Sunday, July 4, 2010

అధ్యాయం- 1 పల్నాటి వీరభారతం

తెలి వులిపిరి తెరల మధ్య తెల్లవారీ ఆరకముందే, పక్షులన్నీ గూళ్ళనుంచి బైటికి వొచ్చీ రాకముందే - తేనెటీగలు పూవుల మీద ముసిరీ ముసరకముందే, "జిట్టగామాలపాడు" ఉత్తరాన వున్న బీళ్ళలో ఆరవల్లి రామిరెడ్డి అరక దున్నుతున్నాడు.

సూర్యుడు మబ్బుల మీద షికారుకు బైల్దేరినవేళ రామిరెడ్డి "చుట్ట" అంటించుకోవటానికి నిలబడ్డాడు. చేను నానుకుని, నాలుగ్గజాల దూరంలో, గట్టు మీద పెద్ద పాముపుట్ట ఉంది. రామిరెడ్డికి సుప్రభాతపు వెలుగు పర్చుకుంటున్నప్పుడు "కేర్ ... కేర్ .." మనే ఏడుపు వినిపించింది.

అతను ఛటక్కున ఆగిపోయాడు.

అరక దున్నే దాపలిగిత్త "అంబా" అన్నది.

రామిరెడ్డి చుట్టుపక్కల కలయజూసాడు.

పచ్చటి వెలుగు వ్యాపించుకుంటున్న పల్లెల మీద పడి మెరుస్తున్న నీరెండ.

మళ్ళా "కేర్ ... కేర్ .."మన్న రోదన.

మిగతా ఆవకాయ.కామ్ లో... 

Sunday, June 27, 2010

పల్నాటి వీరభారతం-ముందుమాటలు

ప్రచురణ కర్తల మాటల్లో రచయిత పరిచయం:

రచన ఒక వరంగా, వాక్య నిర్మాణం ఒక అద్బుత శిల్పంగా భావించే అరుదైన రచయితల్లో చిట్టిబాబు ఒకరు. పేరులోనే పెన్నిధి వున్న కథకుల్లో వీరిని చేర్చాలి. Author Chitti Babu మాటల్ని ఎక్కడ పొందికగా, మధురనిష్యందంగా ఉపయోగించాలో, ఎక్కడ పాఠకుల్ని తమ "గ్రిప్ "లోకి తెచ్చుకోవాలో తెలిసిన రచయితల్లో ఒకర్నిగా ఈయనను చెప్పాలి.

Monday, May 17, 2010

Talks and Articles by Sri C. Subba Rao

Book Release Report by Dr. Vaidehi Sasidhar :

On April 2nd 2010 at 6 pm, my father, Sri.C.Subba Rao’s book, “Talks and Articles” was launched at the tastefully decorated Mini Conference Hall in the famous Ravindra Bharathi complex in Hyderabad. Prof.C.Subba Rao, former Chairman of the Council of Higher Education ,the Govt.of Andhra Pradesh, presided over the function. Prof I.V.Chalapathi Rao, former Registrar of the Central Institute of English and Foreign Languages and also Chief Editor of Triveni at present, was the distinguished Chief Guest, who launched the Book. Prof.S.S.Prabhakar Rao, former JNTU professor was the Guest of Honour. I had the privilege and good fortune of sharing the stage with these stalwarts as one of the speakers and as another Guest of Honour (I had written the Foreword for my father’s book). Of course, my father was on the stage immaculately dressed as usual on such formal occasions.

The meeting commenced with an invocation to Lord Ganesha rendered melodiously in the classical style bringing out all the devotional aura of the Sloka by my brother-in-law Sri.Chaitanya.Then came the launching of the book by Prof I.V.Chalapathi Rao.

Wednesday, April 14, 2010

కవిత్వంలో శైలి

కవిత్వంలో శైలి పై అలోక్ వాస్తవ్ గారి వ్యాసం ఆవకాయ.కామ్ లో....

"కలౌ దుష్టజనాకీర్ణే" అని "అజ్ఞాన వ్యాకులే లోకే" అని చాలామంది తిట్టిపోస్తుంటారు. మామూలు ప్రపంచం మాటెట్లున్నా ప్రస్తుతం తెలుగునేల్లో ముఖ్యంగా సాహిత్యసీమలో ఈ తిట్లు అక్షర సత్యాలు.

చాలా బ్లాగుల్లో యితరుల రాతల్ని తిట్టిపోసుకొంటూ attacking is the best defense అన్నట్టు తమతమ రాతల్ని కాపాడుకొనే వో విచిత్ర వ్యవహారం ప్రబలిపోయింది. యే ఎడిటరూ అవసరంలేదని, మా బాగోగులు మాకే బాగా తెల్సుననే గదా బ్లాగు ప్రచురణల్ని జేసుకొనేది! పొగిడేస్తే పరమ ఆప్తులు. కొంచెం అటుయిటూ గాక గోడ మీది పిల్లి వ్యాఖ్యలు జేస్తే వాళ్ళు అతిథులు. చెడమడా తిట్టేస్తే సాహిత్య ద్రోహులు. యిల్లా వొహరి రాతల్ని మరొహరు "విమర్శించటం" యే లోకనీతో? ఆయా "విమర్శల్ని" ఖండిస్తూ పేజీల కొద్దీ తిట్లకు లంకించుకోడం యే సత్సాంప్రదాయమో? రాసిన రాతల్లోనే పసలేనప్పుడు వాటిపై వొచ్చే విమర్శలు తిట్లకి యెక్కువ - బూతులకి తక్కువనే జెప్పాలి.

సరే. యీ భేషజాలు పక్కనెట్టి మళ్ళీ కవిత్వం విషయాన్ని జూసినప్పుడు, మొన్న చెప్పుకొన్న కొన్ని సంగతులతోబాటు ఇంకొన్ని జేర్చాలని అనిపించింది.

మిగతా ఆవకాయ.కామ్ లో... 

పాఠకులకు ఓ గమనిక : ఈ వ్యాస రచయితను నేను కాదు. ఆవకాయ.కామ్ లో ప్రచురింపబడిన ఈ వ్యాసాన్ని అందరికీ అందుబాటులో తీసుకువద్దామని ఇక్కడ లింకు ఇవ్వటం జరిగింది.

Sunday, April 11, 2010

దుశ్శబ్దపు జాడీల్లో

జాడీలోని ఆవకాయ లాలాజలోత్పత్తికి తొలిమెట్టైతే దుశ్శబ్దపు జాడీల్లోని బూజు భావాలు తిరకాసు కవిత్వానికి ఆఖరి మెట్లుగా మారతాయని జాలం జగ్గేశ పండితుడు రాసిన "నవవర్ణశాల"లో వుంది. ఇదో తిర్యక్ సృష్టిపరిణామక్రమమని, కోతి మనిషిగా మారినట్టుగానే శబ్దం నిశ్శబ్దం కాబోయి దుశ్శబ్దమైందని కూడా జగ్గేశ పండితుడు చెప్పాడు.

మీకు అక్షరాలు వచ్చునా? వాటిల్తో వాక్యాలు రాయడమూ వచ్చునా? "రా! కూర్చో!" అని కాక "కూర్చోడానికి రా!" అని డొంకతిరుగుడుగా చెప్పడం వచ్చునా? అలా కాస్త ముందు కెళ్ళి "కూర్చోడానికి రా! నాలుకపై మైసూర్ పాకులా!" అని చెప్పగలరా"? అక్కడితో ఆగక "కూర్చోడానికి రా! నాలుకపై మైసూర్ పాకులా! నగ్నంగా, నైపుణ్యంగా, వంకరగా, వాలుగా, చేవ్రాలుగా" అని సుత్తికొట్టడం కూడా చేతనౌనా? ఇంకేం మీరు కూడా కవిత్వం రాసేయొచ్చు. గుర్రం కదం తొక్కాలంటే గుగ్గిళ్ళు జోరుగా దట్టించాలి. మీ కలం కదం తొక్కాలంటే బోలెడు పదాల్ని దట్టించాలి.


దళిత కవిత్వం ఉంది. స్త్రీవాద కవిత్వం ఉంది. అభ్యుదయ, విప్లవ కవిత్వాలు కలియుగారంభం నుండీ ఉన్నాయి. ఉన్నవి చాలుననుకొంటే అజీర్ణమని మన తెలుంగుల బాధ. మన ఆకలికి ఈ నాలుగైదు రకాల అరకాసు కవిత్వాలు చాలవుగా! అందుకనే కొత్తవి కనిపెట్టుకొన్నాం. నానీలు వచ్చాయి. కంశ్రీలు వచ్చాయి. నానోలూ వచ్చాయి. ఏకాక్షరాలూ ఊడిపడ్డాయి. వీటికి తోడు నంజుడు కోసమని కధన కవిత్వం, వ్యాస కవిత్వం వంటివి కూడా వచ్చాయి.

మిగతా ఆవకాయలో ...

పాఠకులకు ఓ గమనిక : ఈ వ్యాస రచయితను నేను కాదు. ఆవకాయ.కామ్ లో ప్రచురింపబడిన ఈ వ్యాసాన్ని అందరికీ అందుబాటులో తీసుకువద్దామని ఇక్కడ లింకు ఇవ్వటం జరిగింది.

Thursday, April 1, 2010

కవిత్వం గురించి కొన్ని మాటలు

అలోక్ వాస్తవ్ గారు వ్రాసిన "కవిత్వం గురించి కొన్ని మాటలు" ఆవకాయలో...

కవిత్వం వొంటరిగా వున్న మనసులో పుట్టుకొచ్చినప్పుడు కవి మాత్రమే దాని సాక్షి. మూగవాడు సాక్ష్యం చెప్పాలంటే యెంత కష్టమో వొంటరితనంలో జరిగిన అంతర్మధనాన్ని బైట ప్రపంచానికి పరిచయం చైడం గూడా అంతే కష్టం. యిల్లా అష్టకష్టాలు పడి జీవితకాలంలో పట్టుమని పది కవితలు రాయడం గొప్ప. గానీ మన తెలుగునేలలో సంవత్సరానికో సంకలనం అదీ కనీసం 50-70 కేకలు పెడబొబ్బల్తో విసర్జించే ఘనాపాఠీలున్నారంటే సదరు కవిత్వం పుట్టుక యెల్లాంటిదో వూహించడం సులువు.

.....
మెప్పుకోసమో, సానుభూతి కోసమో రాసేది కవిత్వం కాలేదు. అరువు దెచ్చుకొన్న ఆవేశాలతో కవితలు పుట్టవు. పెట్టుడు మీసాలు గిన్నీసుబుక్కులోకి యెక్కవు. దుక్కిదున్ని, విత్తు విత్తకండానే సంకలనాల కొద్దీ కవిత్వ వ్యవసాయం జేయడమనేది వో మానసిక రోగం. నిజమైన బాధతో మాట్లాడినప్పుడు పచ్చి తాగుబోతు గూడా కవిత్వంలాంటిదే చెప్తాడు. దానికంటే హీనంగా రాసి కవిత్వమని బుకాయించడం "ఆత్మలోకంలో దివాలా" అనే జెప్పాలి.

పూర్తి వ్యాసం ఇక్కడ ....

Friday, March 26, 2010

అపానకళ

"ఎమ్.ఎఫ్. హుస్సేన్ దోహాలో ఉంటే ఎవరికేంటి నష్టం" అని సుప్రీం కోర్ట్ న్యాయమూర్తులు ప్రశ్నించిన తీరు అద్భుతంగా అనిపించింది.

"భారతదేశం గర్వించదగ్గ కలాకారుడైన హుస్సేను"పై దాఖలైన వందకు పైగా కేసుల్ని ఎత్తివేయాలని ఎవడో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్ట్ మొట్టికాయవేసి మోకాలితో తోసి తన్ని అవతల పారేసింది.

ఇంతా జరిగాక ఘనత వహించుకొన్న కొంతమంది మేతావులు విమర్శల గడ్డిపోచల్ని నెమరేయడం ఖాయం. సదరు మేతావుల తోకాత్మలు కొన్ని గిలగిలా కొట్టుకోవడమూ సంభవనీయమే! ఏది ఏమైనా "కామెడీ కేతిగాళ్ళ" సందడి మళ్లీ మొదలౌతుంది.

మిగతా "ఆవకాయలో"