గత మూడు నాలుగు రోజులుగా దేశ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలను పరిశీలిస్తే, మన దేశంలో ప్రజాస్వామ్యం ఒక ప్రహసనంగానే మిగిలి ఉందన్న విషయం మరోసారి తెలుస్తుంది.
అణు ఒప్పందంపై వాదవివాదాలు మొదలైనది లగాయితూ, కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తామనే బెదిరింపులతో దాదాపు మూడేళ్ళు మభ్యపెట్టిన కమ్యూనిస్టులు ఎట్టకేలకు అన్నంత పనీ చేసారు.
ఇది ఆచీతూచీ తీసుకున్న నిర్ణయమో లేదంటే జాతివిపత్కర పరిస్థితుల్లో తప్పనిసరై తీసుకున్న నిర్ణయమో అర్ధం చేసుకోలేని వెధవలు కాకపోవచ్చు దేశప్రజలు.
ప్రభుత్వానికి, కమ్యూనిస్టుల మధ్య జరిగిన లోపాయికారి ఒప్పందంలో సమాజ్ వాది పార్టీ ఒక పావు మాత్రమే. అణుఒప్పందంపై ఆరంభంలోనే దాడి ఆరంభించిన కమ్యూనిస్టులు అప్పటికి ప్రభుత్వాన్ని కాపాడటానికి నిర్ణయించారని ఇప్పుడు ఎవరికైనా అర్ధమౌతుంది. అణు ఒప్పందంపై, ప్రజలకు బాసటగా నిల్చామన్న ఖ్యాతి మూట కట్టుకోటానికి అటు కమ్యూనిస్టులు, ప్రపంచీకరణ నేపథ్యంలో దేశాన్ని ప్రగతిపథంలో నడుపుతున్నామన్న ఖ్యాతి కోసం కాంగ్రెసీయులు ఆడిన నాటకానికి ఎట్టకేలకూ ఈనాటికి తెరపడింది.
అణుఒప్పందంలోని మంచి చెడుల కన్నా, రాజకీయంగా ఎవరికి ఏవిధమైన మేలు జరుగుతుందనేదే ముఖ్యవిషయమయ్యిందనటంలో ఎటువంటి సందేహమూ లేదు.
ప్రభుత్వాన్ని కొనసాగించటానికి కూడా వీలుకానంత దుస్థితిలో అమెరికాతో చేయబోతున్న అణుఒప్పందం ఉందనుకుంటే, కమ్యూనిస్టులు ఇంతకాలం మీనమేషాలు లెక్కిస్తూ ఎందుకున్నరనేది మొదటి ప్రశ్న. ఒప్పందాన్ని చేసితీరతామని భీష్మించుకు కూర్చున్న యు.పి.ఎ. నుంచి కానీ, ఒప్పందం అమలుకానీయకుండా చూస్తామని పట్టుపడుతున్న కమ్యూనిస్టుల నుంచి కానీ ఒప్పందంలోని లోటుపాట్లు ఏమిటనేదానికి ఇంతవరకూ సరైన వివరణ లేదు.
మొన్నటిదాకా, కాంగ్రెస్ ను ఛీత్కరించిన సమాజ్ వాది పార్టీ కేవలం దేశశ్రేయస్సు కోసం అదే కాంగ్రెసును సమర్ధించబోతున్నదని నమ్మేయటానికి ప్రజలు సిద్ధంగా లేరు. ప్రస్తుత రాజకీయ అస్థిరత వల్ల మతతత్వశక్తులకు ప్రొద్బలం లభించకూడదనే ఉద్దేశ్యమే పరమావధి అని ములాయం ప్రకటించినా నమ్మశక్యం కాదు.
ఇంకపైగా, తమ వాదనకు అనుకూలంగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అణుఒప్పందం దేశానికి మంచిదిగా అభివర్ణించారని సమాజ్ వాది పార్టీ ప్రకటించటం కూడా ఆశ్చర్యమే! దేశానికి మంచి కలిగే చాలా విషయాలు కలాం చెప్పారు. మరి వాటన్నిటి మాట ఏమిటి? అవన్నీ ములాయం, అమర్ సింగ్ లు పాటిస్తున్నట్లేనా?
ఏదేమైనా, అణుఒప్పందం విషయంలో ప్రభుత్వం, కమ్యూనిస్టులు, సమాజ్ వాదిల మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందనేది నిర్ద్వంద్వంగా అర్ధమౌతుంది. ప్రజల బాసటగా నిల్చామని ఈ పార్టీలు మరో ఎన్నికలకు మూడు సంవత్సరాల క్రితమే సంసిద్ధమైనాయన్న విషయంలోనూ ఏ సందేహమూ లేదు. ఎన్ని కోట్లు మారాయనే విషయం తెలియకపోయినా, కొన్ని కోట్లు మారే ఉంటాయన్న విషయంలో 'అణు'మానాలేమీ లేవు.
మూడు సంవత్సరాలు ప్రజలను వెధవాయిలు చేసి ఆడించామనుకుంటున్న ఈ పార్టీల ఎత్తుగడలో మరో అయిదు సంవత్సరాలు ప్రజలు నోట్లో వేలు పెట్టుకునే కూర్చుంటారా అనేది కొన్నాళ్ళాగితేనే తెలుస్తుంది.
A stranger was seated next to a little girl on the airplane when the stranger turned to her and said, "Let's talk. I've heard that
ReplyDeleteFlights go quicker if you strike up a conversation with your fellow passenger."
The little girl, who had just opened her book, closed it slowly and
said to the stranger, "What would you like to talk about?"
Oh, I don't know", said the stranger. "How about nuclear power?"
"OK," she said. "That could be an interesting topic. But let me ask you a question first.
A horse, a cow, and a deer all eat grass, the same stuff.
Yet a deer excretes little pellets, while a cow turns out a flat patty, and a horse produces clumps of dried grass.
Why do you suppose that is?"
The stranger thinks about it and says, "Hmmm, I have no idea,"
To which the little girl replies,
"Do you really feel qualified to discuss nuclear power when you don't know shit?"
Moral Of the Story is....Why are left parties talking so loudly about nuclear deal and trying to bring down the government, when they care shit about welfare of the people and basic needs like Food,Health and Education for which large population of our country is dying for.
ఎవరికి వారివి స్వార్థ రాజకీయాలు తప్ప ప్రజల గోడు వీళ్ళకు పడుతుందా!వీళ్ళందరి దగ్గరా వుండేది ఒకే పాత రికార్డు.అదే మతం రికార్డు.ఆమత బూచి ఒక్క హిందువులకే పరిమితం వీళ్ళకు.మిగిలిన వాళ్ళు దేశాన్ని నాశనం చేస్తున్నాకనిపించదు వీళ్ళకు.
ReplyDeleteI just saw your blog as I am search blogs of Thane bloggers. I am also a telugu person residing in Thane. I started developing a blog on thane bloggers.
ReplyDeletehttp://www.thane-bloggers.blogspot.com/
Will keep visiting your blog