ఆంధ్రులకి (తెలంగాణా కలుపుకొనే చెబుతున్నాను) ఆమరణ నిరాహార దీక్షలు ఇప్పుడు వెన్నతోపెట్టిన విద్యలయ్యాయి. అసలీ ఆమరణ నిరాహార దీక్షల్లో విప్లవాత్మకమైన విధానాన్ని ప్రవేశపెట్టిన ఘనత కె.సి.ఆర్.కు దక్కితే, ఆ విధానాన్ని మరో మెట్టుపైకి చేరుస్తున్న ఘనత మాత్రం లగడపాటికే చెందుతుంది.
నెల రోజుల ముందు నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తా నంటూ ఊరించి ఊరించి చివరికి దీక్ష మొదలేయక మునుపే అరెస్టు చేయించుకోబడ్డాడు కె.సి.ఆర్. అరెస్టు కావడమే తరువాయి, అయ్యవారి ఆరోగ్యం గాలిలో దీపమయ్యిందని అటు డాక్టర్లు సెలైనులు, జ్యూసులు పట్టించారు. ఒక్కరోజు కూడా నలుగురిలో కూర్చోకుండానే, పదకొండు రోజులపాటు అసుపత్రి బెడ్డుపై పడుకునే ఆమరణ నిరాహార దీక్ష చేసిన కె.సి.ఆర్. తెలంగాణా గాంధీ అట!
ఇటు విజయవాడలో మరో పెద్దమనిషి సమైక్యాంధ్ర కోసం దాదాపు ఓ ఎనిమిది రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. అయ్యవారి ఆరోగ్యం బాగోలేదని అక్కడి ఆసుపత్రిలో చేరిస్తే, కాదని పారిపోయి హైద్రాబాదు ఎన్.ఐ.ఎం.ఎస్.లో చేరారు. నిన్నటి ఈ టీవీ వార్తల్లో లగడపాటి పరుగెత్తుకెళ్ళటం చూసాక ఆయన ఎనిమిది రోజులుగా చేసిన నిరాహార దీక్ష గుర్తుకు వచ్చి ఆశ్చర్యపోవాల్సి వచ్చింది.
అటు ఆ తెలంగాణా పెద్దమనిషి ఒక్క పూటకే డంగైపోతే, ఇక్కడ సమైక్యాంధ్ర పెద్దమనిషి ఎనిమిది రోజుల దీక్ష తర్వాత కూడా పి.టి.ఉష కన్నా ఉత్సాహంగా ఉన్నారు.
ఓ రెండు రోజులు దీక్షలో కూర్చోటం ఆలస్యం - డాక్టర్ల కోసం వెంపర్లాడటం మొదలు. చావటానికి సిద్ధపడ్డ త్యాగమూర్తులు డాక్టర్ల కోసం దేబిరించటంలోనే తెలుస్తుంది వారి త్యాగనిరతి. సందుకో సత్రకాయ తయారయ్యి చేస్తున్న ఈ ఆమరణ నిరాహార దీక్షలు చూస్తుంటే, ప్చ్! ఆమరణ నిరాహార దీక్షలంటే అందరికీ ఎంత అలుసైపోయాయో అనిపిస్తుంది.
ఈ దీక్షలో కిటుకులు తెలియని మరికొందరు సత్రకాయలు మాత్రం ఇంకా రిలే నిరాహార దీక్షలు చేస్తూ ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ఆహుతిచ్చానని సంబరపడి పోతున్నారు. 80ల్లో ఎంటీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన రిజర్వేషనుల వ్యతిరేకోద్యమంలో గుంటూరులో మేము చేసాం ఈ రిలే నిరాహార దీక్షలు. అప్పట్లో, రోజుకు ఇద్దరు ముగ్గురం చొప్పున దీక్ష చేసి, ఆ మర్నాడు మాత్రమే విరమించేవాళ్ళం. ఇప్పుడు పూటకొకళ్ళు రిలే నిరహార దీక్షలు చేస్తున్నట్లున్నారు.
ఏమైనా అపరగాంధీలకు అసలైన బానిసలం కాబట్టి, నిరాహార దీక్షల్లో ఆంధ్రుల ఆరంభ శూరత్వాన్ని నిరూపిస్తూనే ఉందాం, సిగ్గు పడకుండా!
నెల రోజుల ముందు నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తా నంటూ ఊరించి ఊరించి చివరికి దీక్ష మొదలేయక మునుపే అరెస్టు చేయించుకోబడ్డాడు కె.సి.ఆర్. అరెస్టు కావడమే తరువాయి, అయ్యవారి ఆరోగ్యం గాలిలో దీపమయ్యిందని అటు డాక్టర్లు సెలైనులు, జ్యూసులు పట్టించారు. ఒక్కరోజు కూడా నలుగురిలో కూర్చోకుండానే, పదకొండు రోజులపాటు అసుపత్రి బెడ్డుపై పడుకునే ఆమరణ నిరాహార దీక్ష చేసిన కె.సి.ఆర్. తెలంగాణా గాంధీ అట!
ఇటు విజయవాడలో మరో పెద్దమనిషి సమైక్యాంధ్ర కోసం దాదాపు ఓ ఎనిమిది రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. అయ్యవారి ఆరోగ్యం బాగోలేదని అక్కడి ఆసుపత్రిలో చేరిస్తే, కాదని పారిపోయి హైద్రాబాదు ఎన్.ఐ.ఎం.ఎస్.లో చేరారు. నిన్నటి ఈ టీవీ వార్తల్లో లగడపాటి పరుగెత్తుకెళ్ళటం చూసాక ఆయన ఎనిమిది రోజులుగా చేసిన నిరాహార దీక్ష గుర్తుకు వచ్చి ఆశ్చర్యపోవాల్సి వచ్చింది.
అటు ఆ తెలంగాణా పెద్దమనిషి ఒక్క పూటకే డంగైపోతే, ఇక్కడ సమైక్యాంధ్ర పెద్దమనిషి ఎనిమిది రోజుల దీక్ష తర్వాత కూడా పి.టి.ఉష కన్నా ఉత్సాహంగా ఉన్నారు.
ఓ రెండు రోజులు దీక్షలో కూర్చోటం ఆలస్యం - డాక్టర్ల కోసం వెంపర్లాడటం మొదలు. చావటానికి సిద్ధపడ్డ త్యాగమూర్తులు డాక్టర్ల కోసం దేబిరించటంలోనే తెలుస్తుంది వారి త్యాగనిరతి. సందుకో సత్రకాయ తయారయ్యి చేస్తున్న ఈ ఆమరణ నిరాహార దీక్షలు చూస్తుంటే, ప్చ్! ఆమరణ నిరాహార దీక్షలంటే అందరికీ ఎంత అలుసైపోయాయో అనిపిస్తుంది.
ఈ దీక్షలో కిటుకులు తెలియని మరికొందరు సత్రకాయలు మాత్రం ఇంకా రిలే నిరాహార దీక్షలు చేస్తూ ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ఆహుతిచ్చానని సంబరపడి పోతున్నారు. 80ల్లో ఎంటీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన రిజర్వేషనుల వ్యతిరేకోద్యమంలో గుంటూరులో మేము చేసాం ఈ రిలే నిరాహార దీక్షలు. అప్పట్లో, రోజుకు ఇద్దరు ముగ్గురం చొప్పున దీక్ష చేసి, ఆ మర్నాడు మాత్రమే విరమించేవాళ్ళం. ఇప్పుడు పూటకొకళ్ళు రిలే నిరహార దీక్షలు చేస్తున్నట్లున్నారు.
ఏమైనా అపరగాంధీలకు అసలైన బానిసలం కాబట్టి, నిరాహార దీక్షల్లో ఆంధ్రుల ఆరంభ శూరత్వాన్ని నిరూపిస్తూనే ఉందాం, సిగ్గు పడకుండా!